Vijayawada: దేశి సురేష్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada: బెజవాడలో సంచళనంగా మారిన దేశి సురేష్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కారులో చౌడేష్ తోపాటు మరో ముగ్గురు వున్నట్లు.. అందరూ మద్యం సేవించనట్లు పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులోనే కారును నడుపుతూ సురేష్ ని ఢీకొట్టి చౌడేష్ అనే వ్యక్తం హత్య చేసినట్లు నిర్థారించారు. దీంతో కేసునమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అదుపులో తీసుకున్నారు. హత్యకు వాడిన ఐ 20 కారు సీజ్ చేశారు. మృతుడు సురేష్, నిందితుడు చౌడీష్ మధ్య 2020లో వివాదం వుందని, బ్యానర్లు కట్టే విషయంలో చౌదేష్ పై సురేష్ చేయి చేసుకున్నట్లు ఆరోపణలు వున్నాయి. అయితే దీనిపై అప్పట్లోనే కేసు నమోదు చేసిన పోలీసులు తెలిపారు. ఈ విషయంపై కక్ష పెంచుకుని సురేష్ ని చౌడేష్ కారుతో ఢీకొట్టి హత్య చేసినట్లు నిర్థారించారు.
అయితే మృతిడి సురేష్ భార్య శివాణి ఎన్టీవీతో మాట్లాడుతూ.. కొడుకుకి ఐస్ క్రీమ్ తెస్తానని వెళ్ళి కానరాని లోకాలకు వెళ్ళిపోయాడని భావోద్వేగానికి గురైంది. పాత కక్షలతో హత్య చేసి.. నాబ్రతుకు రోడ్డు పాలు చేసాడు అని వాపోయింది. కోపం ఉంటే కొట్టాలి కానీ హత్య ఎందుకు చెయ్యాలి? అని ప్రశ్నించింది. తన బిడ్డను.. ఎలా పోషించుకోవాలి, నేను ఎలా బ్రతకాలి అంటూ కన్నీరుమున్నీరైంది. వాళ్ళిచ్చే నష్టపరిహారం నాకొద్దు.. నా భర్త ఉంటే అంతకన్నా ఎక్కువ సంపాదిస్తాడంటూ తెలిపింది. హత్యకు కారణం చెప్పి చంపినా అతనికి కఠిన శిక్ష వెయ్యాలని కోరింది.
Also Read
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
- Deputy CM Pawan Kalyan: సీఎస్, డీజీపీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ.. పోక్సో కేసులపై కీలక సూచనలు
అయితే.. మాచవరం పోలిస్ స్టేషన్ పరిధిలో అమ్మా కళ్యాణ మండపం నుండి క్రీస్తు రాజు పురం వైపు వెళుతూన్న దేశీ సురేశ్ అనే వ్యక్తిని కారుతో గుద్ది కంకణాల చౌడేస్ అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. వైస్సార్సీపీ కార్యకర్తలుగా బ్యానర్స్ విషయంలో కొద్దీ రోజుల క్రితం ఇరువురికి గొడవకు దారితీసింది. దీంతో ఆగ్రహంతో సురేష్ ను చౌడేష్ కారుతో గుద్ది పోలీసులకు చౌడేష్ లొంగిపోయాడు. పోలీసులు ఐపీసీ 302 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
MK Stalin: మరోసారి డీఎంకే అధినేతగా స్టాలిన్.. ఏకగ్రీవంగా ఎన్నిక
తాజావార్తలు
-
HYD 21CR CHEATING: సైబర్ టోకరా @ 21Cr
-
Shabad Serial Killer: ఆరుగురిని హత్య చేసిన షాబాద్ సైకో కిల్లర్.. కథ ఇక్కడితో ముగియలేదు!
-
Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
-
Ben Stokes Returns: ‘క్రికెట్పై మళ్లీ ఆసక్తి వచ్చింది’.. రీఎంట్రీకి సిద్ధమైన స్టార్ ఆల్రౌండర్
-
Lockup Death: ఏపీలో లాకప్ డెత్లు పరంపర.. రెండు జిల్లాల్లో ప్రకంపనలు
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!