ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ రెండవ సమావేశం అయింది. మ్యానిఫెస్టో కమిటీ కమిటీ ఛైర్మన్ పల్లంరాజు అధ్యక్షతన ఈ భేటీ కొనసాగుతుంది. ఈ మీటింగ్ లో తులసిరెడ్డి, జంగా గౌతం, తాంతియాకుమారి, మస్తాన్ వలి, రమాదేవి, ఉషానాయుడు తదితర నాయకులు ఉన్నారు.
విజయవాడ నగరంలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, జై భారత్ పార్టీల రాష్ట్ర స్ధాయి పొలిటికల్ సెమినార్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ సమావేశానికి సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు గిడుగు రుద్రరాజు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వి.వి.లక్ష్మీనారాయణ హాజరయ్యారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలనాపై రాష్ట్ర స్థాయి మహిళా సదస్సు ఏర్పాటు చేశారు. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి.వి కృషంరాజు ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్ లీలా గ్రాండ్ హోటల్ లో ఈ సదస్సు కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి తెలుగు అకాడమీ చైర్ పర్సన్ డాక్టర్ లక్ష్మీపార్వతితో పాటు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్ ఇటీవల రామబాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా కథ పరంగా బాగున్నా అనుకున్న హిట్ టాక్ ను అందుకోలేక పోయింది.. దాంతో గోపి చంద్ సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకొని కొత్త సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.. కన్నడ డైరెక్టర్ హర్ష దర్శకత్వంలో తెరకేక్కుతున్న భీమా సినిమాలో నటిస్తున్నారు.. ఈ సినిమాలో ప్రియభావాని శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.. ఈ సినిమాలో హీరో పవర్ ఫుల్…
విజయవాడలోని అంబేద్కర్ స్మృతివనాన్ని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 206 అడుగుల అంబేద్కర్ మహా శిల్పాన్ని ఏర్పాటు చేయడం ఓ చరిత్ర అని అన్నారు. అంబేద్కర్ ఆశయాలకు కట్టుబడిన వ్యక్తి సీఎం జగన్ అని తెలిపారు. సమసమాజ స్థాపనకు సీఎం జగన్ నడుంబిగించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. దేశంలో బలహీన వర్గాలను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ కాదని నిరూపించే దమ్ము మీకుందా అని ప్రశ్నించారు.…