MB. Patil : మైసూరు శాండిల్ కోసం తమన్నాని ఎందుకు ఎంపిక చేశారో వెల్లడించిన కర్ణాటక మంత్రి ఎంబి పాటిల్
కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (KSDL) తన ఐకానిక్ బ్రాండ్ మైసూర్ శాండల్ సోప్ ప్రచారకర్తగా నటి తమన్నా భాటియాను తీసుకుంది. అయితే, స్థానిక కన్నడ నటీమణులను కాదని ముంబైకి చెందిన తమన్నాను ఎంచుకోవడంపై సోషల్ మీడియాలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తమన్నా ఎంపిక వెనుక ఉన్న అసలు కారణాలను మంత్రి ఎం.బి. పాటిల్ వెల్లడించారు. ఎం.బి. పాటిల్ మీడియాతో మాట్లాడుతూ ‘బ్రాండ్ అంబాసిడర్ ఎంపిక ప్రక్రియలో సూపర్ స్టార్ రజనీకాంత్ సభ్యుడిగా ఉన్న ఒక ఉన్నత స్థాయి కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. కమిటీ సుమారు 5 నుండి 6 పేర్లను పరిశీలించింది, అందులో కర్ణాటకకు చెందిన 2-3 పేర్లు కూడా ఉన్నాయి. అయితే వారు ఇప్పటికే ఇతర పోటీ బ్రాండ్లకు అంబాసిడర్లుగా ఉన్నందున, నిబంధనల ప్రకారం వారిని పరిగణనలోకి తీసుకోలేదు.
Also Read : Doctor Actresses : యాక్టింగ్ చేస్తూ డాక్టర్ పట్టా పొందిన హీరోయిన్స్ వీళ్ళే?
Also Read
- FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
- Sanju Samson: గుజరాత్ టైటాన్స్పై చేసిన పరుగులు 11.. అయినా మరో రికార్డ్ సాధించిన సంజూ శాంసన్..
- Weight Loss: బరువు తగ్గాలనుకునే వారికి శుభవార్త.. ఇంత వరకు ఎవరూ చెప్పని చిట్కా.. 99 శాతం సక్సెస్..
- Bangladesh: బంగ్లాదేశ్ ఎయిర్ఫోర్స్లో తాలిబాన్లు.. బయటపడ్డ పాకిస్తాన్ మూలాలు..
కన్నడ మూలాలున్న గ్లోబల్ స్టార్ దీపికా పదుకొనేను కూడా ఈ రేసులో పరిశీలించాము, కానీ ఆమె డిమాండ్ చేసిన పారితోషికం ప్రభుత్వ బడ్జెట్ పరిమితులను మించి ఉంది. అలాగే దీపికకు స్వంత బ్యూటీ బ్రాండ్ ఉండటం కూడా ఆమెను తీసుకోకపోవడానికి ఒక కారణం. రాష్మిక మందన్న, శ్రీలీల వంటి మరికొంత మంది నటీమణులు కూడా ఇతర బ్రాండ్లతో బిజీగా ఉండటం వల్ల తమన్నా వైపు మొగ్గు చూపాల్సి వచ్చింది. “ఇది కేవలం వ్యాపార పరమైన నిర్ణయం మాత్రమే. మైసూర్ శాండల్ సోప్ అమ్మకాలు కేవలం కర్ణాటకకే పరిమితం కాలేదు. తెలంగాణలో 18%, ఉత్తర భారతదేశంలో 8%, అంతర్జాతీయంగా 1% మార్కెట్ ఉంది. 2030 నాటికి రూ. 5,000 కోట్ల టర్నోవర్ సాధించడమే మా లక్ష్యం” అని మంత్రి తెలిపారు. తమన్నాకు ఉన్న పాన్-ఇండియా క్రేజ్ మరియు కోట్లాది మంది సోషల్ మీడియా ఫాలోవర్లు బ్రాండ్ ప్రమోషన్కు బాగా ఉపయోగపడతారని ప్రభుత్వం భావిస్తోంది.
తాజావార్తలు
-
Ragi Puri: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. రాగి పిండితో మెత్తటి పూరీలు.. ఇలా చేస్తే లొట్టలేయాల్సిందే!
-
Senior Citizen FD: సీనియర్ సిటిజన్లకు FDలో అత్యధిక రాబడి.. ఏ బ్యాంకులు ఉత్తమం? పూర్తి వివరాలు
-
FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
-
Sanju Samson: గుజరాత్ టైటాన్స్పై చేసిన పరుగులు 11.. అయినా మరో రికార్డ్ సాధించిన సంజూ శాంసన్..
-
Post Office Scheme: కేవలం వడ్డీతోనే రూ.18 లక్షలు.. సింపుల్గా కోటీశ్వరులు అయ్యే ఛాన్స్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!