TDP-Janasena: టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ భేటీ.. వాటిపై ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP-Janasena: వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించిన టీడీపీ-జనసేన పార్టీలు.. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.. అందులో భాగంగా ఈ రోజు టీడీపీ – జనసేన సమన్వయ కమిటీ సమావేశాన్ని విజయవాడలోని నోవాటెల్లో నిర్వహించారు..ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన, ఎన్నికల ప్రచారం, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.. ఇక, ఈ నెల 28వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించాలనే అంశంపై కూడా సమాలోచనలు చేశారు.. ఉమ్మడి సభకు రెండు పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ హాజరయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు.. అయితే, సభ ఎక్కడ నిర్వహించాలనే అంశంపై ఈ భేటీలో క్లారిటీ రానుందట..
Read Also: B.V. Raghavulu: మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతిపక్షాల మనుగడ కష్టమే..
Also Read
- Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
- IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
- Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
- Rajnath Singh: హైదరాబాద్కు రక్షణ మంత్రి రాక.. నేడు, రేపు మేధావులతో భేటీలు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం
ఇక, మేనిఫెస్టో రూపకల్పనపై కీలకాంశాల ప్రస్తావన జరిగినట్టుగా సమాచారం.. డ్వాక్రా రుణ మాఫీ హామీ అంశంపై కీలక చర్చ సాగగా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫోకస్ పెట్టాల్సిన అంశాలపై సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి.. వలంటీర్ల వ్యవస్థ కట్టడిపై ప్రత్యేక దృష్టి పెట్టనునుంది టీడీపీ – జనసేన కూటమి. అయితే, వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమించాలన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలను టీడీపీ – జనసేన సీరియస్గా తీసుకున్నాయి.. వలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమించొద్దనే ఈసీ ఆదేశాలు ఉన్నాయని టీడీపీ – జనసేన నేతలు గుర్తుచేస్తున్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేసే అంశంపై సమాలోచనలు చేశారు. ఈ రోజు జరిగిన సమావేశానికి టీడీపీ, జనసేన నుంచి కమిటీ సభ్యులు హాజరయ్యారు.
తాజావార్తలు
-
The Odyssey : ‘ది ఒడిస్సీ’కి భయపడి ప్రీ పోన్ చేసుకుంటోన్న బాలీవుడ్ ఫిల్మ్స్
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
-
Prabhas : షాకింగ్.. ఫౌజీ vs స్పిరిట్?
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
ట్రెండింగ్
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?