TDP-Janasena: 28న టీడీపీ-జనసేన భారీ బహిరంగ సభ.. హాజరుకానున్న చంద్రబాబు, పవన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP-Janasena: విజయవాడలో జరిగిన టీడీపీ – జనసేన సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది.. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు.. ఈ నెల 28వ తేదీన తాడేపల్లి గూడెంలో టీడీపీ – జనసేన కలిసి భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు.. ఇక, తాడేపల్లి గూడెం సభకు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు.. తాడేపల్లి గూడెం సభ వేదికగా కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.. సమన్వయ కమిటీ సమావేశంలో రెండు తీర్మానాలకు ఆమోదం లభించింది.. పొత్తును స్వాగతించిన టీడీపీ – జనసేన కేడర్ ను అభినందిస్తూ తీర్మానం. మీడియాపై దాడులను తప్పు పడుతూ సమన్వయ కమిటీ రెండో తీర్మానం చేసింది.
సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. రెండు పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన ఉమ్మడి సభ ఉంటుందన్నారు. తాడేపల్లి గూడెం సమీపంలోని పత్తిపాడు వద్ద ఉమ్మడి సభ నిర్వహిస్తున్నాం.. ఉమ్మడి మేనిఫెస్టోపై తుది కసరత్తు జరుగుతోంది.. త్వరలో విడుదల చేస్తాం అని వెల్లడించారు. ఏయే స్థానాల్లో ఏయే పార్టీలు పోటీ చేయాలనేది చంద్రబాబు-జనసేన అధినేతలే నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో టీడీపీ – జనసేన మధ్య గ్యాప్ లేకుండా పని చేయాలి. టీడీపీ – జనసేన మధ్య వైసీపీ తగువులు పెట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ప్రజల మధ్యన కూడా జగన్ తగవులు పెడతారు.. జగన్ అంత వరస్ట్ సీఎంను ఇప్పటి వరకు చూడలేదని ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి సీఎం జగన్ సైకోలా వ్యవహరిస్తున్నారు అంటూ విరుచుకుపడ్డారు అచ్చెన్నాయుడు..
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
ఇక, ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదనే ఉద్దేశ్యంతో పొత్తులు పెట్టుకున్నట్టు చెప్పుకొచ్చారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. సమన్వయం లోపం లేకుండా రెండు పార్టీలు ఎన్నికలకు వెళ్లబోతున్నాం. టీడీపీ – జనసేన పార్టీలు కలిసి పని చేయాల్సి ఉంటుందన్నారు. అవసరమైతే త్యాగాలు కూడా చేయక తప్పదని చంద్రబాబు – పవన్ సూచిస్తున్నారు. ఈ నెల 28వ తేదీన జరిగే సభ ఉమ్మడి సభలో రెండు పార్టీల నేతలు పాల్గొంటారని తెలిపారు. బై బై వైసీపీ అనేది ఓ నినాదంగా మారాలి. రెండు నెలల్లో వైసీపీ నుంచి విముక్తి లభించాలన్నారు. యువత, మహిళలు, రైతులకు సంబంధించిన ముఖ్యమైన అంశాలతో కూడిన మేనిఫెస్టో రూపొందిస్తాం. అభ్యర్థుల విషయంలో త్వరలోనే క్లారిటీ వస్తుందన్నారు. రెండు పార్టీల మధ్య ఎలాంటి గ్యాప్ లేదు. జరగాల్సిన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయని వెల్లడించారు నాదెండ్ల మనోహర్.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!