TDP-Janasena: 28న టీడీపీ-జనసేన భారీ బహిరంగ సభ.. హాజరుకానున్న చంద్రబాబు, పవన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP-Janasena: విజయవాడలో జరిగిన టీడీపీ – జనసేన సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది.. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు.. ఈ నెల 28వ తేదీన తాడేపల్లి గూడెంలో టీడీపీ – జనసేన కలిసి భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు.. ఇక, తాడేపల్లి గూడెం సభకు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు.. తాడేపల్లి గూడెం సభ వేదికగా కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.. సమన్వయ కమిటీ సమావేశంలో రెండు తీర్మానాలకు ఆమోదం లభించింది.. పొత్తును స్వాగతించిన టీడీపీ – జనసేన కేడర్ ను అభినందిస్తూ తీర్మానం. మీడియాపై దాడులను తప్పు పడుతూ సమన్వయ కమిటీ రెండో తీర్మానం చేసింది.
సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. రెండు పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన ఉమ్మడి సభ ఉంటుందన్నారు. తాడేపల్లి గూడెం సమీపంలోని పత్తిపాడు వద్ద ఉమ్మడి సభ నిర్వహిస్తున్నాం.. ఉమ్మడి మేనిఫెస్టోపై తుది కసరత్తు జరుగుతోంది.. త్వరలో విడుదల చేస్తాం అని వెల్లడించారు. ఏయే స్థానాల్లో ఏయే పార్టీలు పోటీ చేయాలనేది చంద్రబాబు-జనసేన అధినేతలే నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో టీడీపీ – జనసేన మధ్య గ్యాప్ లేకుండా పని చేయాలి. టీడీపీ – జనసేన మధ్య వైసీపీ తగువులు పెట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ప్రజల మధ్యన కూడా జగన్ తగవులు పెడతారు.. జగన్ అంత వరస్ట్ సీఎంను ఇప్పటి వరకు చూడలేదని ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి సీఎం జగన్ సైకోలా వ్యవహరిస్తున్నారు అంటూ విరుచుకుపడ్డారు అచ్చెన్నాయుడు..
Also Read
- Heavy Rain Alert: తెలంగాణకు వాన ముప్పు.. ఈ 4 రోజులు జాగ్రత్త..
- Shreyas Iyer: కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు.. భారత క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి..
- TG Police Recruitment: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 7,437 పోలీస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ రెడీ!
- Vaibhav Sooryavanshi: బౌలర్ ఎవరైతే నాకేంటి?.. ఫస్ట్ బాల్ సిక్స్ వెళ్లాల్సిందే.. దిగ్గజ బౌలర్లను వణికిస్తున్న వైభవ్..
ఇక, ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదనే ఉద్దేశ్యంతో పొత్తులు పెట్టుకున్నట్టు చెప్పుకొచ్చారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. సమన్వయం లోపం లేకుండా రెండు పార్టీలు ఎన్నికలకు వెళ్లబోతున్నాం. టీడీపీ – జనసేన పార్టీలు కలిసి పని చేయాల్సి ఉంటుందన్నారు. అవసరమైతే త్యాగాలు కూడా చేయక తప్పదని చంద్రబాబు – పవన్ సూచిస్తున్నారు. ఈ నెల 28వ తేదీన జరిగే సభ ఉమ్మడి సభలో రెండు పార్టీల నేతలు పాల్గొంటారని తెలిపారు. బై బై వైసీపీ అనేది ఓ నినాదంగా మారాలి. రెండు నెలల్లో వైసీపీ నుంచి విముక్తి లభించాలన్నారు. యువత, మహిళలు, రైతులకు సంబంధించిన ముఖ్యమైన అంశాలతో కూడిన మేనిఫెస్టో రూపొందిస్తాం. అభ్యర్థుల విషయంలో త్వరలోనే క్లారిటీ వస్తుందన్నారు. రెండు పార్టీల మధ్య ఎలాంటి గ్యాప్ లేదు. జరగాల్సిన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయని వెల్లడించారు నాదెండ్ల మనోహర్.
తాజావార్తలు
-
Amazon Prime Day Sale: రూ.30,000 లోపు బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఏ ఫోన్పై ఎంత ఆఫర్?
-
Kalyan Ram: సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్తో భారీ అప్డేట్!
-
Ali Khamenei Funeral: అగ్రరాజ్యానికి కాలం మూడిందా? ఖమేనీ మరణానికి ఇరాన్ ‘ఇంతకామ్’ తీర్చుకోబోతుందా!
-
Aamir Khan Third Marriage: ఆమిర్ ఖాన్ 3వ భార్య ఈమెనే! ఆమె ఏం చేస్తుందో తెలుసా? బ్యాక్గ్రౌండ్ తెలిస్తే షాకవుతారు..
-
Isakapatnam: తెలుగు వెబ్ సిరీస్కు దేశవ్యాప్తంగా క్రేజ్… టాప్ 3లో దూసుకెళ్తున్న ‘ఇసకపట్నం’..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!