ఇటు సినీ కెరీర్.. అటు అకడమిక్స్ బ్యాలెన్స్ చేయలేక ఎడ్యుకేషన్ను మధ్యలోనే ఆపేస్తుంటారు హీరోయిన్స్. కానీ ఈ భామల రూటే సెపరేట్. ఓ వైపు కెరీర్ మరో వైపు వైద్య విద్యను అభ్యసిస్తూ ఎంతో మందికి రోల్ మోడల్స్ అయ్యారు. జార్జియాలో ఎంబీబీఎస్ చదువుతూనే నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన సాయి పల్లవి.. ఓ వైపు యాక్టింగ్ కొనసాగిస్తూనే.. మరో వైపు వైద్య విద్యను పూర్తి చేసింది. అలాగే ఇక్కడ ప్రాక్టీస్ చేసేందుకు ఎగ్జామ్ కూడా రాసింది. ప్రజెంట్ బిజీ షెడ్యూల్స్ వల్ల ప్రాక్టీస్ పక్కన పెట్టిన సాయి పల్లవి.. భవిష్యత్తులో డాక్టర్గా సెటిలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.
Also Read : Karthikeya 3 : కార్తీకేయ3 గురించి కూడా క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో నిఖిల్
తెలుగుమ్మాయి శ్రీలీల కూడా ఎంబీబీఎస్ చదువుతూనే మొహానికి మేకప్ వేసుకుంది. చేతిలో భారీ లైనప్ ఉన్నా.. బిజీ షెడ్యూల్స్ ఉన్నా అకడమిక్స్ను అశ్రద్ద చేయలేదు. ఎట్టకేలకు ఎంబీబీఎస్ పూర్తి చేసి.. తాజాగా డిగ్రీ తీసుకుంది ఈ వైరల్ వయ్యారీ. తనకు ఇష్టమైన నటన కోసం డాక్టర్ వృత్తిని పక్కన పెట్టేసింది మరో టాలీవుడ్ గర్ల్ కామాక్షి భాస్కర్ల. చైనాలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి.. కొన్నాళ్ల పాటు డాక్టర్గా వర్క్ చేసి.. ఆ తర్వాత యాక్ట్రెస్గా మారింది ఈ బ్యూటీ. డాక్టర్ రాజశేఖర్ పెద్ద కూతురు శివానీ రాజశేఖర్ కూడా తన తండ్రి అడుగు జాడల్లోనే ఎంబీబీఎస్ పూర్తి చేసింది. శివాని హైదరాబాద్లోని అపోలో మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతూ.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. గాడ్సేతో టాలీవుడ్ తెరంగేట్రం చేసిన ఐశ్వర్య లక్ష్మీ కూడా వైద్య విద్యను కంప్లీట్ చేసింది. ప్రస్తుతం తెలుగులో సంబరాల ఏటిగట్టు చేస్తున్న ఈ బ్యూటీ కేరళలో మెడిసిన్ పూర్తి చేసింది. డాక్టర్ కాబోయి యాక్ట్రెస్ అయ్యామంటూ గతంలో ఎంతో మంది హీరోయిన్స్ మాటలకు వీళ్లు రివర్స్ చేసి చూపిస్తూ.. అప్ కమింగ్ బ్యూటీలకు ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు.