హనుమంతుడుపై టాలీవుడ్ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పకపోతే.. కచ్చితంగా ఆయన సినిమాలు ఆపేస్తాం అంటూ విశ్వహిందూ పరిషత్ హెచ్చరించింది. తండ్రి మనోభావాలను సైతం కించపరుస్తూ మాట్లాడారని విశ్వహిందూ పరిషత్ తెలుగు రాష్ట్రాల క్షేత్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాముడు, కృష్ణుడు, హనుమంతుడు దేవుళ్లుగా కనిపించలేదా? అని ప్రశ్నించారు. హిందూ సమాజం చూస్తూ ఊరుకోదని రాజమౌళిని రవికుమార్ హెచ్చరించారు. రాజమౌళి వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని తీవ్ర వేదనకు…
దేశ రాజధాని ఢిల్లీ పేరు మారబోతుందా? పేరు మార్చాలంటూ ఇటీవల భారీగా డిమాండ్ పెరిగింది. ఇప్పటికే వీహెచ్పీ డిమాండ్ చేయగా.. తాజాగా బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ డిమాండ్ చేశారు.
Akhilesh Yadav: సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక సభలో ప్రసంగిస్తూ.. ‘‘నేను మీకు ఒక సూచన ఇవ్వాలనుకోవడం లేదు, కానీ నేను రాముడి పేరు మీద ఒక సూచన ఇస్తాను. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సందర్భంగా అన్ని నగరాలు ప్రకాశవంతంగా ఉంటాయి.
ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళా 2025 తర్వాత.. ఇప్పుడు అందరి కళ్ళు మరో కుంభమేళాపై ఉన్నాయి. ఈ కుంభమేళా దక్షిణ భారతదేశంలో జరుగుతుంది. తమిళనాడులోని కుంభకోణం పట్టణంలో 'మహామహం' (కుంభమేళా) నిర్వహిస్తారు. ఈ 'మహామహం'లో కూడా దేశం నలుమూలల నుంచి దాదాపు కోటి మంది భక్తులు పవిత్రమైన అమృత స్నానానికి వస్తారు. ఈ కుంభమేళా కూడా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. 'మహామహం' సందర్భంగా.. "అఖిల భారత సన్యాసి సంఘం" నిర్వహించిన 'మాసి మహాపెరువిల- 2025' కార్యక్రమానికి…
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14 న ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ పాశ్చాత్య సంస్కృతి అమెరికా, కెనడా, మెక్సికో, యునైటేడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, భారత్, ఇటలీ, డెన్మార్క్, జపాన్తో పాటు భారత దేశానికి కూడా పాకింది. పాశ్చాత్య దేశాల ప్రభావంగా భావించే వాలెంటైన్స్ డే వేడుకలు భారతదేశంలో వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రేమికుల దినోత్సవాన్ని వ్యతిరేకించే వారిలో విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ముందుంటాయి.
Justice Shekhar Kumar Yadav: విశ్వ హిందూ పరిషత్(వీహెచ్పీ) కార్యక్రమంలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ చేసిన ‘‘మెజారిటీ’’ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రతిపక్షాలు, పలు సంఘాలు సుప్రీంకోర్టుకు లేఖలు రాస్తున్నాయి. భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ఈ ఫిర్యాదులను స్వీకరించారు. ఈ ప్రసంగంపై సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టుని మంగళవారం వివరణ కోరింది. ప్రసంగానికి సంబంధించిన వివరాలనున అందించాలని ఆదేశించింది.
ఉత్తరప్రదేశ్లోని బండాలోని ప్రసిద్ధ బంబేశ్వర్ పర్వతం సమీపంలో నిర్మించిన ఆలయం, మసీదు అంశం ఊపందుకుంది. దీనిపై విశ్వహిందూ పరిషత్ (విహెచ్పి), భజరంగ్ దళ్ కార్యకర్తలు నిరసనలు ప్రారంభించారు. సంఘటనా స్థలానికి చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
West Bengal: పశ్చిమ బెంగాల్లో రెండు సింహాలకు పెట్టిన పేర్లు వివాదాస్పదమయ్యాయి. త్రిపుర నుంచి బెంగాల్ సఫారీ పార్కుకు తీసుకువచ్చిన ఆడ సింహానికి ‘సీత’ అని పేరుపెట్టడంపై విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) హైకోర్టును ఆశ్రయించింది. కలకత్తా హైకోర్టులోని జల్పాయిగురి సర్క్యూట్ బెంచ్ హిందూ సంస్థ తరుపున న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆడ సింహానికి ఎలాంటి పేరు పెట్టలేదని పార్క్ అధికారులు వెల్లడించారు. ఈ ఆరోపణల్ని కొట్టిపారేశారు.
Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదుపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ASI) నివేదిక సంచలనంగా మారింది. ఏఎస్ఐ సర్వేలో మసీదుకు ముందు అక్కడి పెద్ద హిందూ దేవాలయం ఉండేదని తేలింది. వారణాసి కోర్టు ఏఎస్ఐ నివేదికను బహిరంగపరచాలని, ఇరు పక్షాలకు రిపోర్టును అందించాలని ఆదేశించిన నేపథ్యంలో ఈ సర్వేకి చెందిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉంటే సర్వే తర్వాత విశ్వహిందూ పరిషత్(VHP) జ్ఞానవాపి నిర్మాణాన్ని హిందువులకు అప్పగించాలని కోరింది.
QR code scam: రామమందిర ప్రారంభోత్సవానికి కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. జనవరి 22, 2024న అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. దేశవ్యాప్తంగా కోట్లాది భక్తులు ఈ మహత్తర ఘట్టం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇదే అదనుగా కొందరు భక్తుల్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు.