Retail Inflation: ఉల్లి-వెల్లుల్లి ధరల మంట.. 4.45%కి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం
- జూలైలో 4.45 శాతానికి పెరిగిన భారత రిటైల్ ద్రవ్యోల్బణం..
- ఆర్బీఐ 4 శాతం లక్ష్యాన్ని అధిగమించిన గణాంకాలు..
- ఉల్లి, వెల్లుల్లి, అల్లం ధరల పెరుగుదలతో పెరిగిన ఆహార ద్రవ్యోల్బణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Retail Inflation: భారతదేశంలో రిటైల్ ద్రవ్యల్బణం జూలై నెలలో తీవ్రంగా పెరిగింది. బుధవారం విడుదల చేసిన ప్రభుత్వం గణాంకాల ప్రకారం.. పెరిగిన ఆహార, నిత్యావసర ధరల కారణంగా వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూన్ లోని 4.38% నుండి జూలై 2026 నాటికి 4.45%కి పెరిగింది. ఇది ఆర్బీఐ అంచనా 4 శాతం మధ్యకాలిక లక్ష్యాన్ని అధిగమించింది. నెలవారీ ప్రాతిపదికన సాధారణ CPI సూచీ 0.9 శాతం పెరగగా, ఆహార ధరల సూచీ 2.1 శాతం పెరిగింది.
గ్రామీణ ప్రాంతాల్లో జూన్ నెలలో ద్రవ్యోల్బణం 4.74%గా ఉంటే, అది జూలై నెలకు 4.84%కి పెరిగింది. ఇదే సమయంలో పట్టణ ద్రవ్యోల్బణం 3.93% నుండి 3.96%కి పెరిగింది. ఆహార ద్రవ్యోల్బణం జూన్లోని 5.32 శాతం నుంచి జూలైలో 5.52 శాతానికి పెరిగింది. ఆహారం, పానీయాల విభాగంలో ద్రవ్యోల్బణం కూడా 5.05 శాతం నుంచి 5.24 శాతానికి చేరింది.
Also Read
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
ఉల్లి ద్రవ్యోల్బణం 4.73% నుండి 22.54%కి పెరిగింది. వెల్లుల్లి ద్రవ్యోల్బణం 17.93% నుండి 35.36%కి పెరగగా, అల్లం ద్రవ్యోల్బణం 50.41% నుండి 83.62%కి పెరిగింది. అయితే, అన్ని కూరగాయల ధరలు పెరగలేదు. బంగాళాదుంప ధరలు ఏడాది ప్రాతిపదికన 16.56% తగ్గగా, బెండకాయల ధరలు 5.52% తగ్గాయి. బఠానీ, టమాటా ధరలు కూడా వరుసగా 5.27%, 4.59% తగ్గాయి.
రవాణా విభాగంలో ద్రవ్యోల్బణం జూన్ నెలలో 4.31% నుండి జూలైలో 4.43%కి పెరిగింది, అయితే సరుకుల రవాణా సేవల ద్రవ్యోల్బణం 7.70% నుండి 7.77%కి స్వల్పంగా పెరిగింది. గృహ ద్రవ్యోల్బణం 2.22% గా నమోదంది, ఇందులో గ్రామీణ గృహ ద్రవ్యోల్బణం 2.80% , పట్టణ గృహ ద్రవ్యోల్బణం 2.01%గా ఉంది. రెస్టారెంట్లు, వసతి సేవల్లో ద్రవ్యోల్బణం 7.72%గా నమోదైంది. దుస్తులు, పాదరక్షల ధరలు 3.38 %కి పెరిగాయి. వ్యక్తిగత సంరక్షణ, ఇతర వస్తువులు, సేవల విభాగంలో ద్రవ్యోల్బణం 14.77% శాతం వద్ద నమోదవడం గమనార్హం.
ఆరోగ్య సేవల ద్రవ్యోల్బణం 1.34% వద్ద స్థిరంగా ఉండగా, విద్యా సేవల ద్రవ్యోల్బణం 3.64%కి పెరిగింది. మొదటి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 4.1%, రెండవ త్రైమాసికంలో 4.7%, మూడవ త్రైమాసికంలో 5.9%, నాల్గవ త్రైమాసికంలో 5.5% ఉంటుందని ఆర్బిఐ అంచనా వేస్తోంది. ప్రధాన ద్రవ్యోల్బణం మూడవ త్రైమాసికంలో గరిష్ట స్థాయికి చేరుకుని, ఆ తర్వాత తగ్గుతుందని ఇది భావిస్తోంది.
తాజావార్తలు
-
Producer Deepti: హీరోయిన్పై నిర్మాత సంచలన ఆరోపణలు.. ‘పేమెంట్ ఇవ్వను.. ఆ డబ్బు హార్ట్ ఆపరేషన్లకు విరాళంగా ఇస్తా’
-
King 100 : సంక్రాంతి కంటే ముందే విడుదలకి రెడీ అవుతున్న ‘కింగ్ 100’
-
Dil Raju: ‘టాక్సిక్’తో దిల్ రాజుకు జాక్పాట్.. సినిమా రిజల్ట్ ఏదైనా ప్రాఫిటేనట! అసలు లెక్క ఇదే..
-
IND vs SL 2nd Test: అదే జరిగితే.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతే!
-
Re Release : స్టార్ హీరోల ఫ్యాన్స్ను హర్ట్ చేస్తోన్న రీ-రిలీజ్ మూవీస్
ట్రెండింగ్
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?