Temple- Mosque Issue: శ్రీరాముడు శివుడికి జలాభిషేకం చేసిన ఆలయం?.. పక్కనే వెలిసిన మసీదు?
- ఊపందుకున్న బంబేశ్వర్ పర్వతం సమీపంలో ఆలయం-మసీదు అంశం
- హిందూ సంఘాల నిరసనలు
- మసీదును అక్రమంగా నిర్మించారని నినాదాలు
- అక్కడికి చేరుకున్న భద్రతా బలగాలు
- విచారించి చర్యలు తీసుకుంటామన్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని బండాలోని ప్రసిద్ధ బంబేశ్వర్ పర్వతం సమీపంలో నిర్మించిన ఆలయం, మసీదు అంశం ఊపందుకుంది. దీనిపై విశ్వహిందూ పరిషత్ (విహెచ్పి), భజరంగ్ దళ్ కార్యకర్తలు నిరసనలు ప్రారంభించారు. సంఘటనా స్థలానికి చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హిందూ కార్యకర్తలను శాంతింపజేసి అక్కడి నుంచి తరలించారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో శాంతిభద్రతల పరిరక్షణకు భారీగా బలగాలను మోహరించారు.
బండలోని బంబేశ్వర్ పర్వత చరిత్ర…
బండలోని బంబేశ్వర్ పర్వత చరిత్ర శ్రీరామునికి సంబంధించినదని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఈ అంశం పురాణాల్లో కూడా ఉందని ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ శివాలయం ఉంది. శ్రీరాముడు ఇక్కడికి వచ్చి శివునికి జలాభిషేకం చేశాడని నమ్మిక. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఆలయం ఉంది. అయితే.. కరోనా కాలంలో పర్వతం వెనుక ఉన్న వ్యక్తులు అక్రమంగా ఒక సమాధిని నిర్మించారని, ఆ తర్వాత దానిని మసీదుగా మార్చారని వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు చంద్ర మోహన్ బేడీ ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, మసీదును తొలగించాలని సీఎం యోగిని వీహెచ్పీ ఇటీవల డిమాండ్ చేసింది.
Also Read
- Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధం వల్ల క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
- Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. 'జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ' ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
- Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
పెద్ద ఎత్తున భద్రతా బలగాల మోహరింపు..
ఈ ఘటనను నిరసిస్తూ.. నవంబర్ 8న విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలందరూ మసీదు దగ్గరకు చేరుకుని నినాదాలు చేశారు. ఈ సమాచారంతో పోలీసు ఉన్నతాధికారులు భారీ పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకుని ప్రజలకు వివరించారు. . ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మసీదు చుట్టూ భారీ పోలీసు బలగాలను మోహరించారు. వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్ బేడీ మాట్లాడుతూ.. అక్కడ ఎన్నో ఏళ్లుగా బామ్దేవ్ (బంబేశ్వర్) పవిత్ర క్షేత్రము ఉందని తెలిపారు. శ్రీరాముడు ఇక్కడికి వచ్చి పూజలు చేశారని చెప్పారు. ఇది చాలా పురాతనమైన పర్వతమని.. వెనుక వైపున, కొందరు వ్యక్తులు మొదట అక్రమంగా సమాధిని నిర్మించి ఇప్పుడు దాన్ని మజీద్గా మార్చారని తెలిపారు. అనుమతి లేకుండా ఏదైనా నిర్మాణాన్ని తీసివేసేలా చర్యలు తీసుకోవాలని.. చట్టవిరుద్ధంగా నిర్మించిన మసీదును కూల్చేయాలని డిమాండ్ చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధం వల్ల క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
-
Ben Stokes: బెన్ స్టోక్స్ నైట్క్లబ్ వివాదం.. అసలు ఏం జరిగింది?.. భద్రతా సిబ్బందికి కుట్లు పడటానికి కారణమేంటి?
-
West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
-
Peddi : “పెద్ది”పై అల్లు అర్జున్ జెన్యూన్ రివ్యూ… ప్రశంసల వర్షం
-
Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. ‘జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!