Temple- Mosque Issue: శ్రీరాముడు శివుడికి జలాభిషేకం చేసిన ఆలయం?.. పక్కనే వెలిసిన మసీదు?
- ఊపందుకున్న బంబేశ్వర్ పర్వతం సమీపంలో ఆలయం-మసీదు అంశం
- హిందూ సంఘాల నిరసనలు
- మసీదును అక్రమంగా నిర్మించారని నినాదాలు
- అక్కడికి చేరుకున్న భద్రతా బలగాలు
- విచారించి చర్యలు తీసుకుంటామన్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని బండాలోని ప్రసిద్ధ బంబేశ్వర్ పర్వతం సమీపంలో నిర్మించిన ఆలయం, మసీదు అంశం ఊపందుకుంది. దీనిపై విశ్వహిందూ పరిషత్ (విహెచ్పి), భజరంగ్ దళ్ కార్యకర్తలు నిరసనలు ప్రారంభించారు. సంఘటనా స్థలానికి చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హిందూ కార్యకర్తలను శాంతింపజేసి అక్కడి నుంచి తరలించారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో శాంతిభద్రతల పరిరక్షణకు భారీగా బలగాలను మోహరించారు.
బండలోని బంబేశ్వర్ పర్వత చరిత్ర…
బండలోని బంబేశ్వర్ పర్వత చరిత్ర శ్రీరామునికి సంబంధించినదని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఈ అంశం పురాణాల్లో కూడా ఉందని ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ శివాలయం ఉంది. శ్రీరాముడు ఇక్కడికి వచ్చి శివునికి జలాభిషేకం చేశాడని నమ్మిక. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఆలయం ఉంది. అయితే.. కరోనా కాలంలో పర్వతం వెనుక ఉన్న వ్యక్తులు అక్రమంగా ఒక సమాధిని నిర్మించారని, ఆ తర్వాత దానిని మసీదుగా మార్చారని వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు చంద్ర మోహన్ బేడీ ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, మసీదును తొలగించాలని సీఎం యోగిని వీహెచ్పీ ఇటీవల డిమాండ్ చేసింది.
Also Read
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- 12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
- Ishan Kishan: బ్యాంక్ ఉద్యోగం, క్రికెట్ సరిపోలేదా?.. పార్ట్ టైమ్ టీ కొట్టు ఎప్పుడు పెట్టావ్ ఇషాన్ కిషాన్ భాయ్?
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
పెద్ద ఎత్తున భద్రతా బలగాల మోహరింపు..
ఈ ఘటనను నిరసిస్తూ.. నవంబర్ 8న విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలందరూ మసీదు దగ్గరకు చేరుకుని నినాదాలు చేశారు. ఈ సమాచారంతో పోలీసు ఉన్నతాధికారులు భారీ పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకుని ప్రజలకు వివరించారు. . ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మసీదు చుట్టూ భారీ పోలీసు బలగాలను మోహరించారు. వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్ బేడీ మాట్లాడుతూ.. అక్కడ ఎన్నో ఏళ్లుగా బామ్దేవ్ (బంబేశ్వర్) పవిత్ర క్షేత్రము ఉందని తెలిపారు. శ్రీరాముడు ఇక్కడికి వచ్చి పూజలు చేశారని చెప్పారు. ఇది చాలా పురాతనమైన పర్వతమని.. వెనుక వైపున, కొందరు వ్యక్తులు మొదట అక్రమంగా సమాధిని నిర్మించి ఇప్పుడు దాన్ని మజీద్గా మార్చారని తెలిపారు. అనుమతి లేకుండా ఏదైనా నిర్మాణాన్ని తీసివేసేలా చర్యలు తీసుకోవాలని.. చట్టవిరుద్ధంగా నిర్మించిన మసీదును కూల్చేయాలని డిమాండ్ చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
Friday Horoscope: ఆ రాశి వారు జాగ్రత్త.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు!
-
Ishan Kishan: బ్యాంక్ ఉద్యోగం, క్రికెట్ సరిపోలేదా?.. పార్ట్ టైమ్ టీ కొట్టు ఎప్పుడు పెట్టావ్ ఇషాన్ కిషాన్ భాయ్?
-
E3 Tryon: E3 ట్రయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. 165KM రేంజ్, AI ఫీచర్లు.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!