Temple- Mosque Issue: శ్రీరాముడు శివుడికి జలాభిషేకం చేసిన ఆలయం?.. పక్కనే వెలిసిన మసీదు?
- ఊపందుకున్న బంబేశ్వర్ పర్వతం సమీపంలో ఆలయం-మసీదు అంశం
- హిందూ సంఘాల నిరసనలు
- మసీదును అక్రమంగా నిర్మించారని నినాదాలు
- అక్కడికి చేరుకున్న భద్రతా బలగాలు
- విచారించి చర్యలు తీసుకుంటామన్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని బండాలోని ప్రసిద్ధ బంబేశ్వర్ పర్వతం సమీపంలో నిర్మించిన ఆలయం, మసీదు అంశం ఊపందుకుంది. దీనిపై విశ్వహిందూ పరిషత్ (విహెచ్పి), భజరంగ్ దళ్ కార్యకర్తలు నిరసనలు ప్రారంభించారు. సంఘటనా స్థలానికి చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హిందూ కార్యకర్తలను శాంతింపజేసి అక్కడి నుంచి తరలించారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో శాంతిభద్రతల పరిరక్షణకు భారీగా బలగాలను మోహరించారు.
బండలోని బంబేశ్వర్ పర్వత చరిత్ర…
బండలోని బంబేశ్వర్ పర్వత చరిత్ర శ్రీరామునికి సంబంధించినదని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఈ అంశం పురాణాల్లో కూడా ఉందని ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ శివాలయం ఉంది. శ్రీరాముడు ఇక్కడికి వచ్చి శివునికి జలాభిషేకం చేశాడని నమ్మిక. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఆలయం ఉంది. అయితే.. కరోనా కాలంలో పర్వతం వెనుక ఉన్న వ్యక్తులు అక్రమంగా ఒక సమాధిని నిర్మించారని, ఆ తర్వాత దానిని మసీదుగా మార్చారని వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు చంద్ర మోహన్ బేడీ ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, మసీదును తొలగించాలని సీఎం యోగిని వీహెచ్పీ ఇటీవల డిమాండ్ చేసింది.
Also Read
- RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్పై సస్పెన్స్..
- 185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
- 9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
- AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
పెద్ద ఎత్తున భద్రతా బలగాల మోహరింపు..
ఈ ఘటనను నిరసిస్తూ.. నవంబర్ 8న విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలందరూ మసీదు దగ్గరకు చేరుకుని నినాదాలు చేశారు. ఈ సమాచారంతో పోలీసు ఉన్నతాధికారులు భారీ పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకుని ప్రజలకు వివరించారు. . ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మసీదు చుట్టూ భారీ పోలీసు బలగాలను మోహరించారు. వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్ బేడీ మాట్లాడుతూ.. అక్కడ ఎన్నో ఏళ్లుగా బామ్దేవ్ (బంబేశ్వర్) పవిత్ర క్షేత్రము ఉందని తెలిపారు. శ్రీరాముడు ఇక్కడికి వచ్చి పూజలు చేశారని చెప్పారు. ఇది చాలా పురాతనమైన పర్వతమని.. వెనుక వైపున, కొందరు వ్యక్తులు మొదట అక్రమంగా సమాధిని నిర్మించి ఇప్పుడు దాన్ని మజీద్గా మార్చారని తెలిపారు. అనుమతి లేకుండా ఏదైనా నిర్మాణాన్ని తీసివేసేలా చర్యలు తీసుకోవాలని.. చట్టవిరుద్ధంగా నిర్మించిన మసీదును కూల్చేయాలని డిమాండ్ చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్పై సస్పెన్స్..
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
Sonam Wangchuk: దీక్ష భగ్నం.. సోనమ్ వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలింపు..
-
Andy Flower: ఇంగ్లండ్ కోచ్ పదవి వద్దు.. ఆర్సీబీనే ముద్దు!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?