Temple- Mosque Issue: శ్రీరాముడు శివుడికి జలాభిషేకం చేసిన ఆలయం?.. పక్కనే వెలిసిన మసీదు?
- ఊపందుకున్న బంబేశ్వర్ పర్వతం సమీపంలో ఆలయం-మసీదు అంశం
- హిందూ సంఘాల నిరసనలు
- మసీదును అక్రమంగా నిర్మించారని నినాదాలు
- అక్కడికి చేరుకున్న భద్రతా బలగాలు
- విచారించి చర్యలు తీసుకుంటామన్న పోలీసులు
ఉత్తరప్రదేశ్లోని బండాలోని ప్రసిద్ధ బంబేశ్వర్ పర్వతం సమీపంలో నిర్మించిన ఆలయం, మసీదు అంశం ఊపందుకుంది. దీనిపై విశ్వహిందూ పరిషత్ (విహెచ్పి), భజరంగ్ దళ్ కార్యకర్తలు నిరసనలు ప్రారంభించారు. సంఘటనా స్థలానికి చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హిందూ కార్యకర్తలను శాంతింపజేసి అక్కడి నుంచి తరలించారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో శాంతిభద్రతల పరిరక్షణకు భారీగా బలగాలను మోహరించారు.
బండలోని బంబేశ్వర్ పర్వత చరిత్ర…
బండలోని బంబేశ్వర్ పర్వత చరిత్ర శ్రీరామునికి సంబంధించినదని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఈ అంశం పురాణాల్లో కూడా ఉందని ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ శివాలయం ఉంది. శ్రీరాముడు ఇక్కడికి వచ్చి శివునికి జలాభిషేకం చేశాడని నమ్మిక. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఆలయం ఉంది. అయితే.. కరోనా కాలంలో పర్వతం వెనుక ఉన్న వ్యక్తులు అక్రమంగా ఒక సమాధిని నిర్మించారని, ఆ తర్వాత దానిని మసీదుగా మార్చారని వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు చంద్ర మోహన్ బేడీ ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, మసీదును తొలగించాలని సీఎం యోగిని వీహెచ్పీ ఇటీవల డిమాండ్ చేసింది.
Also Read
- SRM University Harassment Case: ఎస్ఆర్ఎం వర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం.. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిర్యాదుతో..
- Zohran Mamdani-King Charles: కోహినూర్ వజ్రం భారత్కు ఇచ్చేయండి.. కింగ్ చార్లెస్కు మమ్దానీ విజ్ఞప్తి!
- Kitchen Tips: వేసవిలో పప్పు త్వరగా పాడవుతుందా..? ఇలా చేస్తే ఉదయం వండినా రాత్రి వరకు ఫ్రెష్గా..!
- Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. 'హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
పెద్ద ఎత్తున భద్రతా బలగాల మోహరింపు..
ఈ ఘటనను నిరసిస్తూ.. నవంబర్ 8న విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలందరూ మసీదు దగ్గరకు చేరుకుని నినాదాలు చేశారు. ఈ సమాచారంతో పోలీసు ఉన్నతాధికారులు భారీ పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకుని ప్రజలకు వివరించారు. . ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మసీదు చుట్టూ భారీ పోలీసు బలగాలను మోహరించారు. వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్ బేడీ మాట్లాడుతూ.. అక్కడ ఎన్నో ఏళ్లుగా బామ్దేవ్ (బంబేశ్వర్) పవిత్ర క్షేత్రము ఉందని తెలిపారు. శ్రీరాముడు ఇక్కడికి వచ్చి పూజలు చేశారని చెప్పారు. ఇది చాలా పురాతనమైన పర్వతమని.. వెనుక వైపున, కొందరు వ్యక్తులు మొదట అక్రమంగా సమాధిని నిర్మించి ఇప్పుడు దాన్ని మజీద్గా మార్చారని తెలిపారు. అనుమతి లేకుండా ఏదైనా నిర్మాణాన్ని తీసివేసేలా చర్యలు తీసుకోవాలని.. చట్టవిరుద్ధంగా నిర్మించిన మసీదును కూల్చేయాలని డిమాండ్ చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
TG DGP Sivadhar Reddy: 32 ఏళ్ల పోలీస్ సేవకు గౌరవ వందనం.. డీజీపీ శివధర్ రెడ్డికి వీడ్కోలు
-
SRM University Harassment Case: ఎస్ఆర్ఎం వర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం.. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిర్యాదుతో..
-
Abhishek Sharma: నాకు టార్గెట్ అంటూ ఏమీ ఉండదు, అదొక్కటే తెలుసు.. అభిషేక్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Hardik Pandya: మా స్టేడియంలో వారి పేరు మార్మోగుతోంది.. ఒక్కసారిగా ఏడుపొచ్చేసింది!
-
Zohran Mamdani-King Charles: కోహినూర్ వజ్రం భారత్కు ఇచ్చేయండి.. కింగ్ చార్లెస్కు మమ్దానీ విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!