CM Revanth Reddy : మిల్లర్లకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్..
- బకాయిలు చెల్లించని మిల్లులపై సీఎం రేవంత్ సీరియస్
- డిఫాల్ట్ మిల్లులను స్వాధీనం చేసుకోవాలని ఆదేశం
- మిల్లింగ్ బాధ్యతలు మహిళా సంఘాలకు అప్పగించే యోచన
- 5 నియోజకవర్గాల్లో భారీ గోడౌన్ల పైలట్ ప్రాజెక్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణలో రైస్ మిల్లర్ల గోల్మాల్ వ్యవహారాలు , పెండింగ్ బకాయిలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయాలని చూస్తే ఏమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో పౌర సరఫరాల శాఖపై గురువారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఛైర్మన్ స్టీఫెన్ రవీంద్ర, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
డిఫాల్ట్ మిల్లుల స్వాధీనం.. మహిళా సంఘాలకు బిగ్ ఆఫర్
ఉద్దేశపూర్వకంగా డీఫాల్ట్ అయి ప్రభుత్వ బకాయిలు చెల్లించని రైస్ మిల్లులను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. అలా స్వాధీనం చేసుకున్న మిల్లులను, అవసరమైతే మిల్లింగ్ బాధ్యతలను మహిళా స్వయం సహాయక సంఘాలకు (మహిళా సంఘాలకు) అప్పగించే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు కీలక సూచన చేశారు. మిల్లర్ల నుండి బకాయిల వసూలే ప్రధాన లక్ష్యంగా పక్కా విధానాన్ని (పాలసీ) రూపొందించాలని, దీనిపై త్వరలోనే కేబినెట్ సబ్ కమిటీలో చర్చించి ఆమోదిస్తామని స్పష్టం చేశారు.
Also Read
- Karimnagar : కరీంనగర్లో పొలిటికల్ హీట్.. నేతల అరెస్టులు, వరుస ఘటనలతో టెన్షన్.!
- Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
- Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. 'బాండెడ్ క్రైట్'గా గుర్తించిన అటవీ అధికారులు!
- HCU Drugs: హెచ్సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
మహిళా సంఘాల ఆధ్వర్యంలో 100 ఎకరాల్లో మోడల్ గోడౌన్లు
ధాన్యం దిగుబడి ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి, ప్రాథమికంగా 5 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా సంఘాల ద్వారా 50 నుంచి 100 ఎకరాల విస్తీర్ణంలో భారీ గోడౌన్ల నిర్మాణాన్ని చేపడతారు. ఈ గోడౌన్ల నిర్మాణంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సీఎం సూచించారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న గోడౌన్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంతో పాటు, ప్రణాళికాబద్ధంగా పర్యవేక్షించేందుకు ప్రతీ జిల్లాకు ఒక నోడల్ అధికారిని నియమించాలని నిర్ణయించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : మిల్లర్లకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్..
-
Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
-
AP Investments : ఏపీకి భారీ పెట్టుబడుల జాతర.. రూ.2.08 లక్షల కోట్లకు SIPB గ్రీన్ సిగ్నల్.!
-
Abhijeet Dipke: త్వరలో జంతర్మంతర్-2 ప్రారంభం.. అభిజీత్ దిప్కే ప్రకటన
-
Police Lathi Testing: పోలీసుల “లాఠీ”లకు ఇన్ని పరీక్షలా.. మనుషుల్ని కొట్టి మరీ పరీక్షిస్తారా.?
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..