CM Revanth Reddy : మిల్లర్లకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్..
- బకాయిలు చెల్లించని మిల్లులపై సీఎం రేవంత్ సీరియస్
- డిఫాల్ట్ మిల్లులను స్వాధీనం చేసుకోవాలని ఆదేశం
- మిల్లింగ్ బాధ్యతలు మహిళా సంఘాలకు అప్పగించే యోచన
- 5 నియోజకవర్గాల్లో భారీ గోడౌన్ల పైలట్ ప్రాజెక్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణలో రైస్ మిల్లర్ల గోల్మాల్ వ్యవహారాలు , పెండింగ్ బకాయిలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయాలని చూస్తే ఏమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో పౌర సరఫరాల శాఖపై గురువారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఛైర్మన్ స్టీఫెన్ రవీంద్ర, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
డిఫాల్ట్ మిల్లుల స్వాధీనం.. మహిళా సంఘాలకు బిగ్ ఆఫర్
ఉద్దేశపూర్వకంగా డీఫాల్ట్ అయి ప్రభుత్వ బకాయిలు చెల్లించని రైస్ మిల్లులను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. అలా స్వాధీనం చేసుకున్న మిల్లులను, అవసరమైతే మిల్లింగ్ బాధ్యతలను మహిళా స్వయం సహాయక సంఘాలకు (మహిళా సంఘాలకు) అప్పగించే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు కీలక సూచన చేశారు. మిల్లర్ల నుండి బకాయిల వసూలే ప్రధాన లక్ష్యంగా పక్కా విధానాన్ని (పాలసీ) రూపొందించాలని, దీనిపై త్వరలోనే కేబినెట్ సబ్ కమిటీలో చర్చించి ఆమోదిస్తామని స్పష్టం చేశారు.
Also Read
- Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
- CM Revanth Reddy: ఓటర్ల జాబితా సవరణకు మరో 4 వారాలు ఇవ్వండి.. ఈసీకి సీఎం రేవంత్రెడ్డి లేఖ
- Night Bus Services: హైదరాబాద్లో నైట్ బస్ సర్వీసులు.. సెప్టెంబర్ 1 నుంచి ఈ 6 రూట్లలో ప్రారంభం..
- TGTET In-Service Teachers 2026: అలర్ట్.. టీజీ టెట్-ఇన్-సర్వీస్ టీచర్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల
మహిళా సంఘాల ఆధ్వర్యంలో 100 ఎకరాల్లో మోడల్ గోడౌన్లు
ధాన్యం దిగుబడి ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి, ప్రాథమికంగా 5 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా సంఘాల ద్వారా 50 నుంచి 100 ఎకరాల విస్తీర్ణంలో భారీ గోడౌన్ల నిర్మాణాన్ని చేపడతారు. ఈ గోడౌన్ల నిర్మాణంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సీఎం సూచించారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న గోడౌన్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంతో పాటు, ప్రణాళికాబద్ధంగా పర్యవేక్షించేందుకు ప్రతీ జిల్లాకు ఒక నోడల్ అధికారిని నియమించాలని నిర్ణయించారు.
తాజావార్తలు
-
Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
-
GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
-
Irumudi : 9వ రోజు కూడా డే1 రేంజ్లో ‘ఇరుముడి’ ర్యాంపేజ్..గంటలో 25 వేల టికెట్ల సేల్
-
Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
-
Ukraine War: ఉక్రెయిన్ రాజధానిపై రష్యా భారీ దాడి.. 27 మంది మృతి..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!