దేశ రాజధాని ఢిల్లీ పేరు మారబోతుందా? పేరు మార్చాలంటూ ఇటీవల భారీగా డిమాండ్ పెరిగింది. ఇప్పటికే వీహెచ్పీ డిమాండ్ చేయగా.. తాజాగా బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ప్రయాగ్రాజ్, అయోధ్య, ఉజ్జయిని, వారణాసి నగరాలు పురాతన గుర్తింపులు పొందాయని.. అలాగే తిరిగి ఢిల్లీని కూడా అసలు రూపంలో గౌరవించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పురాతన మూలాలను గుర్తు చేస్తూ.. దేశ రాజధాని పేరును ‘‘ఇంద్రప్రస్థ’’గా మార్చాలని లేఖ కోరారు. ‘‘ఢిల్లీ చరిత్ర వేల సంవత్సరాల నాటిది మాత్రమే కాదు. భారతీయ నాగరికత యొక్క ఆత్మను, పాండవులు స్థాపించిన ‘ఇంద్రప్రస్థ’ నగరం.’’ అని లేఖలో పేర్కొన్నారు. అలాగే దేశ రాజధానిలో పాండవుల గొప్ప విగ్రహాలను కూడా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: Kerala: తొలి పేదరిక రహిత రాష్ట్రంగా కేరళ.. ప్రకటించిన సీఎం పినరయి
అలాగే ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ పేరును ‘ఇంద్రప్రస్థ జంక్షన్’గా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ‘ఇంద్రప్రస్థ విమానాశ్రయం’గా మార్చాలని ఖండేల్వాల్ డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ లేఖను ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో కలిసి అమిత్ షాకు పంపించారు.
నెల రోజుల క్రితం ఇదే డిమాండ్ను వీహెచ్పీ కూడా చేసింది. ఢిల్లీ పేరు మార్చాలని విశ్వ హిందూ పరిషత్ (VHP) కేంద్రాన్ని కోరింది. ప్రాచీన భారతీయ చరిత్ర, మహాభారత యుగం నాటి విషయాలను గుర్తు చేసింది.
ఇది కూడా చదవండి: Ravi Kishan: బీజేపీ ఎంపీ రవి కిషన్కు బెదిరింపులు.. భయపడేదిలేదన్న నటుడు