Kumbh Mela: 2028లో మరో కుంభమేళా.. ఎక్కడంటే?
- ముగిసిన మహాకుంభమేళా 2025
- 2028లో మరో కుంభమేళా
- దేశం నలుమూలల నుంచి భక్తులు
- ప్రతి 12 ఏళ్లకు ఓ సారి కుంభమేళా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళా 2025 తర్వాత.. ఇప్పుడు అందరి కళ్ళు మరో కుంభమేళాపై ఉన్నాయి. ఈ కుంభమేళా దక్షిణ భారతదేశంలో జరుగుతుంది. తమిళనాడులోని కుంభకోణం పట్టణంలో ‘మహామహం’ (కుంభమేళా) నిర్వహిస్తారు. ఈ ‘మహామహం’లో కూడా దేశం నలుమూలల నుంచి దాదాపు కోటి మంది భక్తులు పవిత్రమైన అమృత స్నానానికి వస్తారు. ఈ కుంభమేళా కూడా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. ‘మహామహం’ సందర్భంగా.. “అఖిల భారత సన్యాసి సంఘం” నిర్వహించిన ‘మాసి మహాపెరువిల- 2025’ కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ (VHP) అఖిల భారత సంస్థ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే, పూజ్యమైన సాధువు రామానంద్ మహారాజ్, వందలాది మంది సన్యాసి జీయర్ స్వామీజీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ‘మహామహం’ లోగోను కూడా ఆవిష్కరించారు. ఈ సమావేశంలో 10 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో (మహామహం సందర్భంగా) శాస్త్రీయ, మత, సామాజిక, ఆధ్యాత్మిక అంశాలపై చర్చలు జరిపారు. హిందూ మత పరిరక్షణపై చర్చలు నిర్వహించాలని నిర్ణయించారు. గతంలో ‘మహామహం’ ఫిబ్రవరి 2016 లో నిర్వహించారు. 10 రోజుల పాటు జరిగిన ఈ మేళాకు 2 కోట్ల 20 లక్షలకు పైగా భక్తులు హాజరయ్యారు. ఈ ‘మహామహం’ నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం కూడా తన సహకారాన్ని అందిస్తోంది.
READ MORE: Pak Vs NZ: పాకిస్తాన్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న న్యూజిలాండ్ బ్యాట్స్మెన్స్..
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
ఇదిలా ఉంగా.. భారత్ కు ఘనమైన సంస్కృతి, గర్వపడే ఆధ్యాత్మిక వారసత్వం ఉన్నాయని మహా కుంభమేళాతో మరోసారి రుజువైంది. మహా కుంభమేళాకు ఉత్సాహంగా పోటెత్తిన భక్తులు.. మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. దీంతో మరోసారి విశ్వవ్యాప్తంగా భారత్ పేరు మార్మోగిపోయింది. అసలు ఆధ్యాత్మిక క్రతువు ఎలా జరగాలో మహాకుంభమేళా నిరూపించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంలో ప్రతి ఘట్టం రికార్డులు సృష్టించి.. మహా కుంభమేళా వైభవాన్ని చాటిచెప్పింది. పెద్ద సంఖ్యలో వీఐపీలు త్రివేణిసంగమంలో స్నానానికి తరలిరావడం.. భక్తుల్లో మరింత ఉత్సాహం పెంచింది. ఇన్ని కోట్ల మంది జనం.. అంతా బహిరంగ ప్రదేశంలో జరిగే వేడుక.. ఎవరూ నియంత్రించకుండానే.. భక్తులు స్వచ్ఛందంగా పాల్గొన్న మహా ఉత్సవం.. ప్రపంచాన్ని అబ్బురపరిచింది. నాగసాధువులు, అఘోరాలు, అఖాడాల రాకతో త్రివేణి సంగమానికి కొత్త కళ వచ్చింది. పుణ్యస్నానాలకు సమాంతరంగా పూజలు, యాగాలు, హోమాలు, ఆధ్యాత్మిక వాతావరణానికి కొత్త శోభ నిచ్చాయి. భారత్ లో కుంభమేళాకు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారో.. ప్రపంచమంతా కళ్లారా చూసింది. అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభవానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!