Home
Vaccination
Vaccination News
-
ఒమిక్రాన్ వైరస్తో అప్రమత్తంగా ఉండాలి
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్తరకం వేరియంట్ ‘ఒమిక్రాన్’ ఇప్పటికే ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ఆఫ్రికాలోని పలు దేశాలకు ఇప్పటికే విస్తరించిన ఈ వేరియంట్.. క్రమంగా మిగతా చోట్లకు విస్తరిస్తోంది. తాజాగా జర్మనీలో ఒకరు ఒమిక్రాన్ బారిన పడగా.. బ్రిటన్లో రెండు కేసులు నిర్ధారణ అయ్యాయి. B.1.1529 వేరియంట్ బోట్స్వానా, బెల్జియం, ఇజ్రాయెల్, హాంకాంగ్లకు వ్యాపించింది. ఒమిక్రాన్ వైరస్ కొన్ని దేశాల్లో మాత్రమే వ్యాపిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈమేరకు ప్రజలకు కొన్ని సూచనలు చేసింది. ఒమిక్రాన్ వైరస్తో అప్రమత్తంగా… -
ప్రధాని మోడీ అధ్యక్షతన అత్యవసర సమావేశం…దీనిపైనే చర్చ…
ప్రధాని మోడీ అధ్యక్షతన ఈరోజు ఉదయం 10:30 గంటలకు అత్యవసర సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ మంత్రి, కీలక అధికారులు హాజరుకాబోతున్నారు. కరోనా కొత్త వేరియంట్ పై వస్తున్న వార్తల నేపథ్యంలో దీనిపైనే కీలకంగా చర్చించే అవకాశం ఉన్నది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్పై ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ వేరియంట్ లో 32 మ్యూటేషన్లు ఉన్నట్టు ఇప్పటికే పరిశోధకులు తెలిపారు. Read: 63శాతం పెరిగిన టమోటా ధరలు… ధరల స్థిరీకరణకు…… -
వ్యాక్సినేషన్పై హరీష్రావు డెడ్లైన్..!
కరోనా వైరస్కు చెక్ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. అన్ని రాష్ట్రాలు ఇప్పుడు వ్యాక్సినేషన్పై ఫోకస్ పెట్టాయి.. ఇక, తెలంగాణలో డిసెంబర్ వరకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించిన మంత్రి.. ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి మొదటి డోస్, రెండో డోస్ ఎంత మంది తీసుకున్నారనే వివరాలు పక్కా సేకరించాలని చెప్పారు. ఆశాలు, ఏఎన్ఎంలు, వైద్యులు గ్రామస్థాయి, సబ్సెంటర్… -
బ్రెజిల్లో డేంజర్ బెల్స్ మోగిస్తున్నా కరోనా..
బ్రెజిల్లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. గడచిన 24 గంటల్లో 12,930 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని ఆ దేశ ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా కేసుల 22,043,112 సంఖ్యకి చేరింది. ఇక మంగళవారం ఒక్కరోజే 273 మంది కరోనాతో మృతి చెందగా… మొత్తం మరణాల సంఖ్య 613,339కి చేరింది. ఇక బ్రెజిల్లో గత ఏడురోజుల్లో సగటున 9,350మంది కరోనా బారినపడ్డారని, 213 మంది మరణించారని అక్కడి ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. లక్షలాది మంది నివసించే… -
బూస్టర్ డోస్పై ఐసీఎంఆర్ కీలక ప్రకటన…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ను పెద్ద ఎత్తున అందిస్తున్న సంగతి తెలిసిందే. రెండు డోసుల వ్యాక్సిన్తో పాటుగా కొన్ని దేశాల్లో బూస్టర్ డోస్ను అందిస్తున్నారు. అమెరికా ప్రభుత్వం 18 ఏళ్లు నిండిన అందరికి బూస్టర్ డోస్ అందిస్తున్న సంగతి తెలిసిందే. భారత్లో కూడా బూస్టర్ డోస్ ఇవ్వాలనే వాదన పెరుగుతున్నది. దీనిపై ఐసీఎంఆర్ కీలక ప్రకటన చేసింది. Read: రాజధాని బిల్లుల ఉపసంహరణపై బాబు స్పందన: సీఎం వైఖరితో రాష్ట్రానికి తీరని నష్టం… బూస్టర్… -
వందశాతం వ్యాక్సినేటేడ్ నగరంగా నిలవాలి: కలెక్టర్ శర్మన్
సికింద్రాబాద్ లోని రసూల్పుర,పికెట్ లోని వ్యాక్సినేషన్ సెంటర్లను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పించిన ఈ అవకా శాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజ లు తమంతట తాముగా రెండో డోసు వ్యాక్సిన్ వేయించుకోవాలని, అధికా రులు ప్రజలు వాక్సిన్ వేయించుకునేలా వంద శాతం వాక్సినేటెడ్ నగరంగా హైదరాబాద్ను తయారు చేయాలని అధికారులకు సూచించారు. ఈ ప్రాంతంలో అధికారులు ఇంటింటి సర్వేను పూర్తి చేశామని వ్యాక్సిన్… -
బూస్టర్ డోస్పై ఐసీఎంఆర్ కీలక వ్యాఖ్యలు
దేశంలో కరోనా బూస్టర్ డోసు ఆవశ్యకతపై ఐసీఎంఆర్ కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ పై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. కొందరూ వేసుకుంటే మంచిదని, మరికొందరూ రెండు డోసులు కాకుండా ఇంకొటి కూడా వేసుకోవాలా అంటూ పెదవి విరుస్తున్నారు. దీనిపై భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) కీలక వ్యాఖ్యలు చేసింది. శాస్త్రీయ ఆధారాల ప్రకారం బూస్టర్ డోసు తీసుకోవాలని ఖచ్చితంగా ఎక్కడా లేదని ఐసీఎంఆర్లో అంటూరోగాల విభాగం హెడ్ సమీరన్ పాండా… -
వ్యాక్సినేషన్ పై మంత్రి హరీష్ రావు కీలక ఆదేశాలు..
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ రెండు డోసుల వాక్సిన్ త్వరగా పూర్తి చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్ని జిల్లాల వైద్యాధికారులను ఆదేశించారు. ఒక్క మనిషి కూడా మిగులకుండా ప్రతీ ఒక్కరికి కోవిడ్ వాక్సిన్ ఇవ్వాలని సూచించారు. బుధవారం బీఆర్కే భవన్ లో అన్ని జిల్లాల వైద్యాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ని ప్రతీ గ్రామం ఏదీ వదలకుండా వాక్సినేషన్ ప్రక్రియ వేగంగా చేపట్టాలన్నారు. వందకు వంద శాతం మొదటి డోస్, రెండో… -
అధికారులకు షాక్: టీకాలు వేసేందుకు ఆ గ్రామానికి వెళ్తె…
కరోనా నుంచి బయటపడాలి అంటే తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే సురక్షిత మార్గం కావడంతో దేశంలో వేగంగా వ్యాక్సినేషన్ను అమలు చేస్తున్నారు. వంద కోట్లమందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. వ్యాక్సిన్పై అవగాహన లేక వ్యాక్సిన్ తీసుకొవడానికి చాలా ప్రాంతాల్లోని ప్రజలు ముందుకు రావడంలేదు. వారికి అవగాహన కల్పించి వ్యాక్సిన్ అందిస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకోడిగా సాగుతోంది. Read: జాతీయరహదారులపై రన్వేలు… ఇదే… -
యూరప్లో కోవిడ్ విజృంభణ.. వారంలో 20లక్షలకుపైగా కేసులు
కోవిడ్ కేసులతో యూరప్ వణికిపోతుంది. గత వారం వ్యవధిలో దాదా పు 20 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వ్యాప్తి మొదలు ఒకే వారంలో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే మొదటి సారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ఓ) ఆందోళన వ్యక్తం చే సింది. ఇదే వ్యవధిలో దాదాపు 27 వేల మరణాలు సంభవించినట్టు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని మరణాలను లెక్కగడితే.. సగానికి పైగా ఇక్కడే నమోదైనట్టు పేర్కొంది. యూరప్లోని తాజా పరిస్థితులపై డబ్ల్యూహెచ్ఓ…
తాజావార్తలు
-
Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
-
CM Chandrababu: ఏపీ చరిత్రలో ఇది మరిచిపోలేని రోజు.. గూగుల్ రాక గేమ్ ఛేంజర్..
-
WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
-
UIDAI Important Update: యూఐడీఏఐ కీలక నిర్ణయం.. ఇక వీటికి ఆధార్ చెల్లదు..
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!