ఉత్తరప్రదేశ్లోని మధురలోని యమునా ఎక్స్ప్రెస్వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధురలోని యమునా ఎక్స్ప్రెస్వేపై 40 మందితో ప్రయాణిస్తున్న బస్సును కారు ఢీకొట్టడంతో ఐదుగురు సజీవదహనం అయ్యారు.
Agra: ఉత్తర ప్రదేశ్లో దారుణం జరిగింది. ఓ వ్యాపారవేత్త తన తల్లిని, కొడుకును హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. భార్య గుడికి వెళ్లిన సమయంలో అతను ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. ఆత్మహత్య, హత్యలకు ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది.
Valentine Day: వాలెంటైన్ డేని ప్రేమికులు ఎంతో గొప్పగా జరుపుకుంటారు. కానీ, ఉత్తర్ ప్రదేశ్లోని కాంత్రి సేన మాత్రం ‘లాఠీ పూజ’ని నిర్వహించింది. లాఠీలకు నూనె రాసి పూజ చేస్తున్న వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రేమికులు దినోత్సవం ముసుగులో అమ్మాయిలపై దురుసుగా ప్రవర్తించే, ఆటపట్టించే వ్యక్తులకు, లవ్ జిహాద్ వ్యాప్తి చేసే వ్యక్తులకు లాఠీలతో గుణపాఠం చెబుతామని క్రాంతి సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోజ్ సైనీ శనివారం వార్నింగ్ ఇచ్చారు.
Gyanvapi: ఉత్తర్ ప్రదేశ్ బరేలీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇత్తేహాద్-ఈ-మిల్లత్ కౌన్సిల్ చీఫ్ మౌలానా తౌకీర్ రజాఖాన్ జ్ఞానవాపి వివాదంలో ‘జైల్ భరో’కి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. జ్ఞానవాపి కేసులో కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఆయన మద్దతుదారులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినా, బారికెడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లారు.
INDIA bloc: ప్రతిపక్ష ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలింది. 2024 లోక్సభ ఎన్నికల ముందు బీజేపీని అధికారం నుంచి దించేందుకు కాంగ్రెస్, ఆప్, టీఎంసీ, ఆర్జేడీ పలు పార్టీలతో ఇండియా కూటమి ఏర్పడింది. అయితే, ప్రస్తుతం ఆ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా బయటకు వెళ్తున్నారు. ఇప్పటికే, ఇండియా కూటమి రూపశిల్పిగా పేరున్న సీఎం నితీష్ కుమార్, ఆర్జేడీతో పొత్తును కాదని, ఇండియా కూటమికి గుడ్బై చెప్పి మళ్లీ బీజేపీతో దోస్తీ కట్టారు. ఇక టీఎంసీ చీఫ్,…
తల్లి అనే ఈ రెండు అక్షరాల్లోనే ప్రేమ ఉంటుంది. తల్లి ప్రేమను ఈ లోకంలో ఎవరు అందించలేరు. తల్లి బిడ్డల బాంధవ్యం విడదీయరానిది. కష్టమొచ్చినా.. దుఖమొచ్చినా.. ఏం సమస్య వచ్చినా ముందుగా చెప్పుకునేది తల్లితోనే.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. 19 ఏళ్ల కుర్రాడు తన మైనర్ సోదరిని రేప్ చేసి హత్య చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
లక్నో జైలులో హెచ్ఐవీ కలకలం రేపిన సంగతి తెలిసిందే. జైలులో మొదటగా 47 మందికి హెచ్ఐవీ సోకినట్లు తేలగా.. తాజాగా ఆ సంఖ్య 63కు చేరుకుంది. ప్రస్తుతం ఈ వ్యాధి సోకిన రోగులందరికీ లక్నోలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. డిసెంబర్ 2023లో ఉత్తర ప్రదేశ్ ఆరోగ్య శాఖ నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లో ఈ కేసులు బయటపడ్డాయి. జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హెచ్ఐవీ సోకిన ఖైదీలలో చాలా మంది డ్రగ్స్ కు బానిసైన వారే ఉన్నారని…
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ దెహాత్ జిల్లాలోని సికంద్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని జగన్నాథ్ పూర్ గ్రామ సమీపంలో ఇవాళ తెల్లవారు జామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
HIV positive: లక్నో జైలులో హెచ్ఐవీ కలకలం రేపుతోంది. జైలులో కొత్తగా 36 మందికి హెచ్ఐవీ ఉన్నట్లుగా తేలింది. వీరందరు హెచ్ఐవీ పాజిటివ్గా పరీక్షించబడ్డారు. దీంతో జైలులో మొత్తం 47 మంది ఖైదీలకు హెచ్ఐవీ సోకింది. ప్రస్తుతం ఈ వ్యాధి సోకిన రోగులందరికీ లక్నోలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. డిసెంబర్ 2023లో ఉత్తర ప్రదేశ్ ఆరోగ్య శాఖ నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లో ఈ రోగ నిర్ధారణ జరిగింది.