PM Modi: ఎర్రకోట వేదికగా యూత్కు ప్రధాని మోడీ గుడ్న్యూస్.. కోటి మంది యువతకు ఉచితంగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోట ప్రాచీరం నుంచి వరుసగా 13వ సారి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధించడంలో దేశ యువశక్తి, నవతరం కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పునరుద్ఘాటించారు. నవభారత నిర్మాణం కోసం దేశం వేగంగా ముందుకు సాగుతోందని, రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే ఊహించని పెద్ద మార్పులు రాబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. యువత సామర్థ్యాన్ని పెంపొందించేందుకు మోడీ ఒక భారీ ప్రకటన చేశారు. ఏడాది వ్యవధిలోనే కోటి మంది యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లో శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. దీనికి తోడు విద్యార్థులు, యువత కోసం ఉచిత ఆన్లైన్ కోచింగ్ వ్యవస్థను కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. మారుతున్న ఆర్థిక వ్యవస్థ, అత్యాధునిక సాంకేతికతకు అనుగుణంగా నవతరాన్ని సన్నద్ధం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
జన్-జీ (Gen Z) చేతుల్లోనే దేశ ప్రగతి ఆధారపడి ఉందన్న మోడీ, స్టార్టప్లు, ఇన్నోవేషన్, సాంకేతిక రంగాలలో యువత భాగస్వామ్యం అభినందనీయమన్నారు. విద్యా రంగంలో సాధించిన ప్రగతిని వివరిస్తూ, 2004 నుంచి 2014 మధ్య దేశంలో 350 కంటే తక్కువ యూనివర్సిటీలు ఉంటే, గడిచిన 10-12 ఏళ్లలోనే దాదాపు 650 కొత్త యూనివర్సిటీలు ఏర్పాటై, మొత్తం సంఖ్య 1,000కి చేరిందని గుర్తుచేశారు. అలాగే 2014 కంటే ముందు కేవలం 400గా ఉన్న వైద్య కళాశాలల సంఖ్య నేడు దాదాపు 850కి పెరిగిందన్నారు. విదేశీ విశ్వవిద్యాలయాలు కూడా భారత తీరాలకు వస్తున్నాయని, స్వదేశంలోనే ఉంటూ విదేశీ డిగ్రీలు పొందే వెసులుబాటు తెచ్చామని పేర్కొన్నారు. చిన్నతనం నుంచే ఆవిష్కరణల పట్ల ఆసక్తి పెంచేందుకు 10,000కు పైగా ‘అటల్ టింకరింగ్ ల్యాబ్స్’ ఏర్పాటు చేశామని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిస్తూ, ఇతర దేశాలపై ఆధారపడటం స్వయం సమృద్ధికి తోడ్పడదని తేల్చిచెప్పారు. ప్రపంచంలో కొన్ని వస్తువులు చౌకగా, వేగంగా లభించినప్పటికీ, అవి దేశీయ సామర్థ్యాన్ని పెంచలేవని అభిప్రాయపడ్డారు. ఈ శతాబ్దంలో గడిచిన పావు శతాబ్దం ఒకెత్తయితే, రాబోయే పావు శతాబ్దం అత్యంత కీలకమని, గత 5-7 దశాబ్దాల్లో జరగని అభివృద్ధిని రాబోయే 5-7 ఏళ్లలో పూర్తి చేసేలా పని సంస్కృతిలో మార్పు రావాలన్నారు. AI శిక్షణ, ఉచిత కోచింగ్ వంటి నిర్ణయాలు 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ను నిర్మించే దిశగా వేసిన బలమైన వేడుకోలుగా నిలుస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
Also Read
- Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!