PM Modi: కమీషన్ కోసం ఇండియా కూటమి.. మిషన్ కోసం ఏన్డీయే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తర్ప్రదేశ్లో ప్రధాని నరేంద్రమోడీ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. శనివారం సహరాన్పూర్లో జరిగిన కార్యక్రమంలో ఇండియా కూటమిపై ప్రధాని నిప్పులు చెరిగారు. బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే మిషన్(లక్ష్యం) కోసం పనిచేస్తుంటే, ఇండియా కూటమి కమీషన్ సంపాదించడానికి ప్రయత్నిస్తోందని పీఎం మోడీ ఆరోపించారు. బీజేపీకి 370 కంటే ఎక్కువ సీట్లు రాకుండా ప్రయత్నించేందుకు ప్రతిపక్ష కూటమి పోరాడుతోందని ఆయన అన్నారు.
‘‘తన పాలనలో కాంగ్రెస్ కమీషన్లు సంపాదించడంపై దృష్టి పెట్టింది. ఇండి కూటమి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కమీషన్ సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఎన్డీయే, మోడీ సర్కార్ ఒక మిషన్ కోసం పనిచేస్తున్నాయి.’’ అని ప్రధాని మోడీ అన్నారు. సమాజ్వాదీ(ఎస్పీ) ప్రతీ గంటకు అభ్యర్థిని మారుస్తోందని, కాంగ్రెస్కి పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకడం లేదని ప్రధాని అన్నారు. చివరకు తమ కంచుకోటల్లా భావించే స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టేందుకు కాంగ్రెస్ ధైర్యం చేయడం లేదని ఎద్దేవా చేశారు.
Also Read
- Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి ఆ ప్రాంతాలకు వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్..
- West Bengal: బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు బ్యాడ్ న్యూస్.. బెంగాల్ ప్రభుత్వం బిగ్ యాక్షన్! ఆ సెంటర్లు రెడీ..
- Dog Steals Cash: ఖతర్నాక్ కుక్క.. ఖరీదైన దొంగతనం! సీసీటీవీ విజువల్స్ చూస్తే మైండ్ బ్లాకే..
- West Bengal: మమత మేనల్లుడి కోటకు బీటలు.. ఫల్తాలో భారీ విజయం దిశగా బీజేపీ..
Read Also: Maldives: భారత్కి మాల్దీవుల కృతజ్ఞతలు.. EAM జైశంకర్ స్పందన ఇదే…
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్ర ఉందని, అందులో కొంత భాగం వామపక్షాల ఆధిపత్యం కనిపిస్తోందని ప్రధాని విమర్శించారు. ఇండియా కూటమి అస్థిరత, అనిశ్చితికి పర్యాయపదంగా మారిందని, దేశ ప్రజలు వాటిని సీరియస్గా తీసుకోవడం లేదని ప్రధాని అన్నారు. ‘‘శక్తిని ఆరాధించడం మన సహజ ఆద్యాత్మిక ప్రయాణంలో భాగం, కానీ ఇండియా కూటమి ప్రజలు శక్తికి వ్యతిరేకంగా తమ పోరాటం అంటున్నారు’’ అని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు.
ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 విడతల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. ఉత్తర్ ప్రదేశ్లో 7 విడదల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సహారన్పూర్, కైరానా, ముజఫర్నగర్, బిజ్నోర్, నగీనా (SC), మొరాదాబాద్, రాంపూర్ మరియు పిలిభిత్ ఎంపీ స్థానాలకు మొదటి విడతలో ఎన్నికలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
Telangana Govt: గుడ్న్యూస్.. జూన్ 2 నుంచి మరో పథకం ప్రారంభం.. వారికి రూ.5 లక్షల వరకు..
-
Iran: ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాలకు బిగ్ రిలీఫ్! హోర్ముజ్ జలసంధిపై బిగ్ అనౌన్స్మెంట్..
-
Satya Kumar Yadav: ‘ఎబోలా’పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం.. అధికారులకు ఆదేశాలు జారీ.!
-
Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి ఆ ప్రాంతాలకు వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్..
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?