PM Modi: కమీషన్ కోసం ఇండియా కూటమి.. మిషన్ కోసం ఏన్డీయే..
PM Modi: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తర్ప్రదేశ్లో ప్రధాని నరేంద్రమోడీ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. శనివారం సహరాన్పూర్లో జరిగిన కార్యక్రమంలో ఇండియా కూటమిపై ప్రధాని నిప్పులు చెరిగారు. బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే మిషన్(లక్ష్యం) కోసం పనిచేస్తుంటే, ఇండియా కూటమి కమీషన్ సంపాదించడానికి ప్రయత్నిస్తోందని పీఎం మోడీ ఆరోపించారు. బీజేపీకి 370 కంటే ఎక్కువ సీట్లు రాకుండా ప్రయత్నించేందుకు ప్రతిపక్ష కూటమి పోరాడుతోందని ఆయన అన్నారు.
‘‘తన పాలనలో కాంగ్రెస్ కమీషన్లు సంపాదించడంపై దృష్టి పెట్టింది. ఇండి కూటమి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కమీషన్ సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఎన్డీయే, మోడీ సర్కార్ ఒక మిషన్ కోసం పనిచేస్తున్నాయి.’’ అని ప్రధాని మోడీ అన్నారు. సమాజ్వాదీ(ఎస్పీ) ప్రతీ గంటకు అభ్యర్థిని మారుస్తోందని, కాంగ్రెస్కి పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకడం లేదని ప్రధాని అన్నారు. చివరకు తమ కంచుకోటల్లా భావించే స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టేందుకు కాంగ్రెస్ ధైర్యం చేయడం లేదని ఎద్దేవా చేశారు.
Also Read
- West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
- Supreme Court : 31 వారాల గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Boat sink: మధ్యప్రదేశ్లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
Read Also: Maldives: భారత్కి మాల్దీవుల కృతజ్ఞతలు.. EAM జైశంకర్ స్పందన ఇదే…
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్ర ఉందని, అందులో కొంత భాగం వామపక్షాల ఆధిపత్యం కనిపిస్తోందని ప్రధాని విమర్శించారు. ఇండియా కూటమి అస్థిరత, అనిశ్చితికి పర్యాయపదంగా మారిందని, దేశ ప్రజలు వాటిని సీరియస్గా తీసుకోవడం లేదని ప్రధాని అన్నారు. ‘‘శక్తిని ఆరాధించడం మన సహజ ఆద్యాత్మిక ప్రయాణంలో భాగం, కానీ ఇండియా కూటమి ప్రజలు శక్తికి వ్యతిరేకంగా తమ పోరాటం అంటున్నారు’’ అని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు.
ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 విడతల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. ఉత్తర్ ప్రదేశ్లో 7 విడదల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సహారన్పూర్, కైరానా, ముజఫర్నగర్, బిజ్నోర్, నగీనా (SC), మొరాదాబాద్, రాంపూర్ మరియు పిలిభిత్ ఎంపీ స్థానాలకు మొదటి విడతలో ఎన్నికలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!