Akhilesh Yadav: గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ కుటుంబాన్ని పరామర్శించిన ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్..
Akhilesh Yadav: గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తాన్ అన్సారీ ఇటీవల ఉత్తర్ ప్రదేశ్లోని బండా జైలులో గుండెపోటుకు గురై మరణించారు. ఆయన మృతికి ‘విషప్రయోగం’ కారణమని కుటుంబ సభ్యులతో పాటు అతని కొడుకు ఆరోపించారు. అయితే, పోస్టుమార్టం నివేదికలో మాత్రం అతను గుండెపోటుతో మరణించినట్లు నిర్థారణ అయింది. ఇదిలా ఉంటే తాజాగా సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆదివారం అన్సారీ ఇంటికి వెళ్లారు.
ఉత్తర్ ప్రదేశ్లోని ఘాజీపూర్ జిల్లా మొహమ్మదాబాద్ పట్టణంలోని అన్సారీ ఇంటికి వెళ్లిన అఖిలేష్ యాదవ్, వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. మార్చి 28న ముఖ్తార్ అన్సారీ మరణించారు. అన్సారీ మృతిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని ఆయన కుటుంబ సభ్యులు డిమాండ్ చేసిన కొన్ని రోజుల తర్వాత అఖిలేష్ యాదవ్ అతని ఇంటికి వెళ్లడం గమనార్హం.
Also Read
- Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
- Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
- PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
Read Also: Anand Mahindra: కోతి దాడి నుండి మేనకోడలిని రక్షించిన అమ్మాయికి ఉద్యోగం ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్రా..!
దీనికి ముందు అన్సారీ కుమారుడు ఉమర్ అన్సారీ మాట్లాడుతూ.. ముఖ్తార్ అన్సారీకి మార్చి 19 భోజనంలో విషం ఇచ్చారని, అదే విషయాన్ని కోర్టుకు తెలియజేశానని చెప్పారు. అన్సారీ మరణం తర్వాత అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. ‘‘ ప్రతీ పరిస్థితిలో , ప్రతీ ప్రదేశంలో ఒకరి ప్రాణాలను రక్షించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత, కర్తవ్యం’’ అని అన్నారు. బండా జైలులో ఒక ఖైదీ మరణించడం న్యాయ ప్రక్రియపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లేలా చేస్తుందని, ఇలాంటి సందేహాస్పద కేసులన్నింటిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారించాలని అన్నారు.
ఇదిలా ఉంటే, అఖిలేష్ యాదవ్ వచ్చి మమ్మల్ని కలవడం, మా ఆత్మగౌరవాన్ని పెంచిందని ముఖ్తాన్ అన్సారీ కొడుకు ఉమర్ అన్సారీ అన్నారు. మా నాన్నతో నాకున్న అనుబంధం వేరు, కానీ లక్షలాది మందితో మా నాన్నను మెస్సయ్యాగా చూశారని అన్నారు. అఖిలేష్ యాదవ్ రావడం తమ ఫ్యామిలీకి మాత్రమే కాదని, మా నాన్న అనుచరులకు కూడా ధైర్యాన్ని ఇచ్చిందని ఉమర్ అన్సారీ అన్నారు. ముస్లింలే కాదు, అన్ని వర్గాల ప్రజలు ఆయన సమాధి వద్ద నివాళులు అర్పిస్తున్నారని చెప్పారు. తమకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, మేము పోరాడుతామని చెప్పారు.
#WATCH | Ghazipur, Uttar Pradesh: Mukhtar Ansari's son Umar Ansari says, "Akhilesh Yadav came and met us, he boosted our confidence. My mother and brother were not there… My relationship with my father is different, but millions of others considered my father as their messiah.… pic.twitter.com/DBjtRYBK7A
— ANI (@ANI) April 7, 2024
తాజావార్తలు
-
NBK – Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్కు పూనకాలే..
-
Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!
-
Robbery: బిగ్ షాక్.. శ్రీ చైతన్య కాలేజీలో దొంగతనం..
-
Angkrish Raghuvanshi: కోపం ఖరీదు.. 20% మ్యాచ్ ఫీజు జరిమానా.!
-
Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!