Loksabha Election 2024: జోరుగా బీజేపీ ఎన్నికల ప్రచారం.. యూపీలో అమిత్ షా, రాజ్నాథ్సింగ్, సీఎం యోగి పర్యటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నాయకులు ఇవాళ (బుధవారం) ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కొందరు నేతలు తమ నామినేషన్ సమావేశాలకు హాజరవుతూ బీజేపీ అభ్యర్థులకు మద్దతను ఇస్తున్నారు. నేటి మధ్యాహ్నం 12.30 గంటలకు ముజఫర్నగర్లోని బుధానాలోని నేషనల్ ఇంటర్ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు మొరాదాబాద్లో సమావేశమై మొదటి, రెండో దశ సీట్ల విషయంలో పార్టీ నేతలతో ఎన్నికల వ్యూహం ఖరారు చేయనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ఘజియాబాద్లోని ఘంటాఘర్ ప్రాంతంలోని రామ్లీలా గ్రౌండ్లో బీజేపీ అభ్యర్థి అతుల్ గార్గ్ నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరవుతారు.
Read Also: Mayank Yadav: నా అంతిమ లక్ష్యం అదే: మయాంక్ యాదవ్
Also Read
- Suryakumar Yadav: ‘నా వంతు కృషి చేస్తున్నా’.. టీమిండియాలోకి రీఎంట్రీపై కీలక వ్యాఖ్యలు..!
- OdalaRevu Fishermens: చుట్టూ చీకటి.. చాలా భయమేసింది.. 23 రోజులు నరకయాతన అనుభవించాం!
- Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
- 5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
అలాగే, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేడు ఫతేపూర్ సిక్రీ, ఆగ్రా లోక్సభ నియోజకవర్గాల్లో జ్ఞానోదయ సదస్సుల్లో పాల్గొననున్నారు. ఫతేపూర్ సిక్రీ లోక్సభ నియోజకవర్గంలోని శంషాబాద్ ప్రాంతంలోని ఏపీ ఇంటర్ కాలేజీలో ఉదయం 11.30 గంటలకు, మధ్యాహ్నం 1 గంటలకు ఆగ్రాలోని ఎంజీ రోడ్డులోని సుర్సదన్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన జ్ఞానోదయ సదస్సుల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రసంగిస్తారు.
Read Also: Bihar : బీహార్ రాష్ట్రంలో భారీ అగ్ని ప్రమాదం.. 58ఇళ్లు బుగ్గిపాలు
ఇక, రేపు సాయంత్రం 4 గంటలకు వారణాసిలోని రోహనియా ప్రాంతంలోని బీజేపీ ప్రాంతీయ కార్యాలయంలో లోక్సభ ఎన్నికల స్టీరింగ్ కమిటీ సమావేశానికి సీఎం యోగి హాజరవుతారు. అలాగే, రేపు (ఏప్రిల్ 4న) మథురలో బీజేపీ అభ్యర్థి హేమమాలిని నామినేషన్కు యోగి హాజరై నామినేషన్ సమావేశంలో ప్రసంగించనున్నారు. అదే రోజు సాయంత్రం గోరఖ్పూర్కు వెళ్లి అక్కడ లోక్సభ ఎన్నికల స్టీరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు.
తాజావార్తలు
-
Suryakumar Yadav: ‘నా వంతు కృషి చేస్తున్నా’.. టీమిండియాలోకి రీఎంట్రీపై కీలక వ్యాఖ్యలు..!
-
Shankar & Murugadoss : మురుగదాస్ స్టోరీతో శంకర్ దర్శకత్వంలో సినిమా?
-
OdalaRevu Fishermens: చుట్టూ చీకటి.. చాలా భయమేసింది.. 23 రోజులు నరకయాతన అనుభవించాం!
-
Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
-
OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీలలో థ్రిల్లర్ల నుంచి ప్రేమ కథల వరకు చూడాల్సిన సినిమాలు, సిరీస్ లు ఇవే..
ట్రెండింగ్
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!