Loksabha Election 2024: జోరుగా బీజేపీ ఎన్నికల ప్రచారం.. యూపీలో అమిత్ షా, రాజ్నాథ్సింగ్, సీఎం యోగి పర్యటన..
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నాయకులు ఇవాళ (బుధవారం) ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కొందరు నేతలు తమ నామినేషన్ సమావేశాలకు హాజరవుతూ బీజేపీ అభ్యర్థులకు మద్దతను ఇస్తున్నారు. నేటి మధ్యాహ్నం 12.30 గంటలకు ముజఫర్నగర్లోని బుధానాలోని నేషనల్ ఇంటర్ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు మొరాదాబాద్లో సమావేశమై మొదటి, రెండో దశ సీట్ల విషయంలో పార్టీ నేతలతో ఎన్నికల వ్యూహం ఖరారు చేయనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ఘజియాబాద్లోని ఘంటాఘర్ ప్రాంతంలోని రామ్లీలా గ్రౌండ్లో బీజేపీ అభ్యర్థి అతుల్ గార్గ్ నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరవుతారు.
Read Also: Mayank Yadav: నా అంతిమ లక్ష్యం అదే: మయాంక్ యాదవ్
Also Read
అలాగే, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేడు ఫతేపూర్ సిక్రీ, ఆగ్రా లోక్సభ నియోజకవర్గాల్లో జ్ఞానోదయ సదస్సుల్లో పాల్గొననున్నారు. ఫతేపూర్ సిక్రీ లోక్సభ నియోజకవర్గంలోని శంషాబాద్ ప్రాంతంలోని ఏపీ ఇంటర్ కాలేజీలో ఉదయం 11.30 గంటలకు, మధ్యాహ్నం 1 గంటలకు ఆగ్రాలోని ఎంజీ రోడ్డులోని సుర్సదన్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన జ్ఞానోదయ సదస్సుల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రసంగిస్తారు.
Read Also: Bihar : బీహార్ రాష్ట్రంలో భారీ అగ్ని ప్రమాదం.. 58ఇళ్లు బుగ్గిపాలు
ఇక, రేపు సాయంత్రం 4 గంటలకు వారణాసిలోని రోహనియా ప్రాంతంలోని బీజేపీ ప్రాంతీయ కార్యాలయంలో లోక్సభ ఎన్నికల స్టీరింగ్ కమిటీ సమావేశానికి సీఎం యోగి హాజరవుతారు. అలాగే, రేపు (ఏప్రిల్ 4న) మథురలో బీజేపీ అభ్యర్థి హేమమాలిని నామినేషన్కు యోగి హాజరై నామినేషన్ సమావేశంలో ప్రసంగించనున్నారు. అదే రోజు సాయంత్రం గోరఖ్పూర్కు వెళ్లి అక్కడ లోక్సభ ఎన్నికల స్టీరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు.
తాజావార్తలు
-
Lemon Price Hike : నిమ్మ రైతుల పంట పండింది.. కిలో రూ.200
-
Raghav chadha: సీఏ నుంచి ఆప్ను కూల్చేదాకా.! రాఘవ్ చద్దా ఎవరు..?
-
Raghav Chadha: ఆప్లో భారీ చీలిక.. పంజాబ్లో ‘మాన్’ ప్రభుత్వం కూలిపోతుందా!
-
Botsa Satyanarayana: వైఎస్ జగన్ తెచ్చిన ప్రాజెక్టుకు చంద్రబాబు శంకుస్థాపన.. బొత్స ఫైర్..
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
ట్రెండింగ్
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!