Crime: మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని సొంత తమ్ముడిని స్క్రూడ్రైవర్తో బాది దారుణ హత్య…
- ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లాలో దారుణం
- మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని సొంత తమ్ముడిని స్క్రూడ్రైవర్తో బాదిన అన్న
- తీవ్రగాయాలవ్వడంతో ఆస్పత్రికి తరలింపు
- చికిత్స పొందుతూ.. తమ్ముడు మృతి
ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లా రాజ్గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధుర్కర్ గ్రామంలో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ మద్యానికి డబ్బులు ఇవ్వలేదని అన్నయ్య తమ్ముడిని హత్య చేశాడు. ఈ ఘటనలో అన్న రాజు పాల్ తన తమ్ముడు ఉమేష్ పాల్ తలపై స్క్రూడ్రైవర్తో దాడి చేశాడు. దీంతో రాజేష్ మృతి చెందాడు. మృతుడి కోడలు బిందు కథనం ప్రకారం.. అక్టోబర్ 15 సాయంత్రం ఇద్దరు అన్నదమ్ములు వెదురు అమ్ముకున్నారు. రాజేష్తో వెదురు అమ్మిన డబ్బు ఉంది. అన్నయ్య రాజు మద్యం తాగడానికి డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. డబ్బు విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కాసేపటికి ఉమేష్ నిద్రకు ఉపక్రమించాడు. ఇదే అవకాశంగా భావించిన రాజు తలపై స్క్రూడ్రైవర్, సుత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఉమేష్ను కుటుంబ సభ్యులు వెంటనే రాజ్గఢ్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సిహెచ్సి)కి తరలించారు. అయితే బాధితుడు చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన కుటుంబంలో కలకలం రేపింది.
READ MORE: NIMS : నిమ్స్లో 10 నెలల్లోనే 101 కిడ్నీ మార్పిడి సర్జరీలు…
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
అన్నదమ్ములిద్దరూ మద్యం మత్తులో
ఘటన జరిగిన సమయంలో సోదరులిద్దరూ మద్యం మత్తులో ఉన్నారని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఆపరేషన్స్) ఓపీ సింగ్ తెలిపారు. ఉమేష్ నిద్రిస్తున్న సమయంలో మద్యం మత్తులో ఉన్న రాజు స్క్రూడ్రైవర్తో తలపై మూడు నాలుగు సార్లు దాడి చేశాడని చెప్పారు. ఘటనానంతరం గాయపడిన ఉమేష్ను ఆస్పత్రికి తరలించినా ప్రాణాలతో బయటపడలేదన్నారు. ఈ కేసులో నిందితుడు రాజుపాల్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ సూపరింటెండెంట్ ఓపీ సింగ్ తెలిపారు.
READ MORE: Bomb Threats: విమానాల బాంబు బెదిరింపుల మిస్టరీ వీడింది.. విచారణలో షాకింగ్ విషయాలు!
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!