Crime: మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని సొంత తమ్ముడిని స్క్రూడ్రైవర్తో బాది దారుణ హత్య…
- ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లాలో దారుణం
- మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని సొంత తమ్ముడిని స్క్రూడ్రైవర్తో బాదిన అన్న
- తీవ్రగాయాలవ్వడంతో ఆస్పత్రికి తరలింపు
- చికిత్స పొందుతూ.. తమ్ముడు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లా రాజ్గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధుర్కర్ గ్రామంలో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ మద్యానికి డబ్బులు ఇవ్వలేదని అన్నయ్య తమ్ముడిని హత్య చేశాడు. ఈ ఘటనలో అన్న రాజు పాల్ తన తమ్ముడు ఉమేష్ పాల్ తలపై స్క్రూడ్రైవర్తో దాడి చేశాడు. దీంతో రాజేష్ మృతి చెందాడు. మృతుడి కోడలు బిందు కథనం ప్రకారం.. అక్టోబర్ 15 సాయంత్రం ఇద్దరు అన్నదమ్ములు వెదురు అమ్ముకున్నారు. రాజేష్తో వెదురు అమ్మిన డబ్బు ఉంది. అన్నయ్య రాజు మద్యం తాగడానికి డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. డబ్బు విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కాసేపటికి ఉమేష్ నిద్రకు ఉపక్రమించాడు. ఇదే అవకాశంగా భావించిన రాజు తలపై స్క్రూడ్రైవర్, సుత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఉమేష్ను కుటుంబ సభ్యులు వెంటనే రాజ్గఢ్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సిహెచ్సి)కి తరలించారు. అయితే బాధితుడు చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన కుటుంబంలో కలకలం రేపింది.
READ MORE: NIMS : నిమ్స్లో 10 నెలల్లోనే 101 కిడ్నీ మార్పిడి సర్జరీలు…
Also Read
- Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. పోలీస్శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
- Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
- Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
- ENG vs SL: హడలెత్తించిన 'హ్యారీ బ్రూక్' సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
అన్నదమ్ములిద్దరూ మద్యం మత్తులో
ఘటన జరిగిన సమయంలో సోదరులిద్దరూ మద్యం మత్తులో ఉన్నారని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఆపరేషన్స్) ఓపీ సింగ్ తెలిపారు. ఉమేష్ నిద్రిస్తున్న సమయంలో మద్యం మత్తులో ఉన్న రాజు స్క్రూడ్రైవర్తో తలపై మూడు నాలుగు సార్లు దాడి చేశాడని చెప్పారు. ఘటనానంతరం గాయపడిన ఉమేష్ను ఆస్పత్రికి తరలించినా ప్రాణాలతో బయటపడలేదన్నారు. ఈ కేసులో నిందితుడు రాజుపాల్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ సూపరింటెండెంట్ ఓపీ సింగ్ తెలిపారు.
READ MORE: Bomb Threats: విమానాల బాంబు బెదిరింపుల మిస్టరీ వీడింది.. విచారణలో షాకింగ్ విషయాలు!
తాజావార్తలు
-
Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
-
Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. పోలీస్శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
-
Tollywood : సెన్సార్ లేట్.. ఈ వారం సినిమాలు వాయిదా?
-
ChiranjeeviOdela : ‘ప్యారడైజ్’ రిజల్ట్పైనే చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ ఆధారపడి ఉందా?
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
ట్రెండింగ్
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!