Crime: మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని సొంత తమ్ముడిని స్క్రూడ్రైవర్తో బాది దారుణ హత్య…
- ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లాలో దారుణం
- మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని సొంత తమ్ముడిని స్క్రూడ్రైవర్తో బాదిన అన్న
- తీవ్రగాయాలవ్వడంతో ఆస్పత్రికి తరలింపు
- చికిత్స పొందుతూ.. తమ్ముడు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లా రాజ్గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధుర్కర్ గ్రామంలో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ మద్యానికి డబ్బులు ఇవ్వలేదని అన్నయ్య తమ్ముడిని హత్య చేశాడు. ఈ ఘటనలో అన్న రాజు పాల్ తన తమ్ముడు ఉమేష్ పాల్ తలపై స్క్రూడ్రైవర్తో దాడి చేశాడు. దీంతో రాజేష్ మృతి చెందాడు. మృతుడి కోడలు బిందు కథనం ప్రకారం.. అక్టోబర్ 15 సాయంత్రం ఇద్దరు అన్నదమ్ములు వెదురు అమ్ముకున్నారు. రాజేష్తో వెదురు అమ్మిన డబ్బు ఉంది. అన్నయ్య రాజు మద్యం తాగడానికి డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. డబ్బు విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కాసేపటికి ఉమేష్ నిద్రకు ఉపక్రమించాడు. ఇదే అవకాశంగా భావించిన రాజు తలపై స్క్రూడ్రైవర్, సుత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఉమేష్ను కుటుంబ సభ్యులు వెంటనే రాజ్గఢ్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సిహెచ్సి)కి తరలించారు. అయితే బాధితుడు చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన కుటుంబంలో కలకలం రేపింది.
READ MORE: NIMS : నిమ్స్లో 10 నెలల్లోనే 101 కిడ్నీ మార్పిడి సర్జరీలు…
Also Read
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
అన్నదమ్ములిద్దరూ మద్యం మత్తులో
ఘటన జరిగిన సమయంలో సోదరులిద్దరూ మద్యం మత్తులో ఉన్నారని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఆపరేషన్స్) ఓపీ సింగ్ తెలిపారు. ఉమేష్ నిద్రిస్తున్న సమయంలో మద్యం మత్తులో ఉన్న రాజు స్క్రూడ్రైవర్తో తలపై మూడు నాలుగు సార్లు దాడి చేశాడని చెప్పారు. ఘటనానంతరం గాయపడిన ఉమేష్ను ఆస్పత్రికి తరలించినా ప్రాణాలతో బయటపడలేదన్నారు. ఈ కేసులో నిందితుడు రాజుపాల్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ సూపరింటెండెంట్ ఓపీ సింగ్ తెలిపారు.
READ MORE: Bomb Threats: విమానాల బాంబు బెదిరింపుల మిస్టరీ వీడింది.. విచారణలో షాకింగ్ విషయాలు!
తాజావార్తలు
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
-
Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!