Constable Crying: యూపీలోని ఫిరోజాబాద్లో ఓ కానిస్టేబుల్ చేతిలో భోజనం పళ్లెం పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రోజుకు 12 గంటలు పని చేయించుకుంటూ నాసిరకం భోజనం పెడుతున్నారని కానిస్టేబుల్ మనోజ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. రెండు రోజులుగా ఆకలితో ఉన్నానని, అధికారులు పట్టించుకోవట్లేదని అతడు వాపోయాడు. జంతువులు కూడా ఇలాంటి ఆహారాన్ని తినలేవని, అలాంటి రొట్టెలు తమకు ఇస్తున్నారని ఎక్కి ఎక్కి ఏడ్చాడు. ఇంటికి దూరంగా…
ISIS Planning Terror Attack On August 15: స్వాతంత్య్ర దినోత్సవం వేళ విధ్వంసానికి పాల్పడాలని ఉగ్రవాద సంస్థలు ప్లాన్ చేస్తున్నాయి. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఇదిలా ఉంటే ఇండిపెండెంట్ డే వేడుకల్లో విధ్వంసం సృష్టించేందుకు ఐసిస్ కుట్ర చేసింది. అయితే ఉగ్రదాడికి ప్లాన్ చేస్తున్న ఉగ్రవాదిని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
BJP worker arrested by yogi government: ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ నోయిడాలో ఓ మహిళపై బీజేపీ నేత దాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీంతో యోగీ సర్కార్ బుల్డోజర్లతో యాక్షన్ మొదలు పెట్టింది. చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన సొంత పార్టీ నేతపైనే చర్యలు తీసుకుంది. నోయిడాలోని సెక్టార్ 93 బిలోని గ్రాండ్ ఓమాక్స్ హౌజింగ్ సొసైటీలోని బీజేపీ నేత శ్రీకాంత్ త్యాగి ఇంటిని బుల్డోజర్లతో కూల్చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమణ…
Free Bus Ride For Women: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అంటే నేరస్తులకు, మాఫియాకు ఎంతటి భయమో అందరికి తెలుసు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే నిందితుల ఇంటి ముందుకు బుల్డోజర్లు క్యూ కడుతాయి. శాంతి భద్రతల విషయంలో యోగి ఎంత నిక్కచ్చిగా ఉంటారో.. సంక్షేమ పథకాలు కార్యక్రమాల్లో కూడా తన మార్క్ చాటుకుంటున్నారు. అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ... రెండో సారి యూపీలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చారు.
Death Threat To UP CM,ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామని హెచ్చరికలు చేశారు. ఆగస్టు 2న లక్నో కంట్రోల్ రూంలోని వాట్సాప్ హెల్ప్ లైన్ నంబర్ కు ఓ బెదిరింపు మెసేజ్ వచ్చింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ను బాంబుతో హతమారుస్తామని ఆగంతకులు హెచ్చరించారు. మూడు రోజుల్లో ముఖ్యమంత్రిని చంపేస్తామని హెచ్చరికలు చేశారు. అయితే ఈ ఘటనపై ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఉన్నతస్థాయి విచారణ చేస్తున్నారు.
Indian-origin woman incident in New York: న్యూయార్క్ లో భారత సంతతి మహిళ ఆత్మహత్య వ్యవహారం వైరల్ గా మారింది. కేవలం ఆడపిల్లలు పుడుతున్నారనే నెపంతో భర్త, అత్తింటి వారి వేధింపులు తాళలేక సెల్ఫీ వీడియోను తీసుకుని తన బాధనంతా వెళ్లకక్కింది. భర్త మారుతాడని ఎదురుచూసిన ఆ యువతికి ఇక మారడనే విషయం తెలిసి.. రోజూ ఈ నరకాన్ని అనుభవించే కన్నా మరణించింది మేలనుకుని ఆత్మహత్య చేసుకుంది. మన్ దీప్ కౌర్( 30) తన బాధనంతా…
Father Try to Kill Own Daughter in Uttar Pradesh: లవ్ ఎఫైర్ పెట్టుకుందని సొంత కూతురినే తుదముట్టించేందుకు ప్రయత్నించాడో తండ్రి. కాంట్రాక్ట్ కిల్లర్ కు సుపారీ ఇచ్చి కూతురును హత్య చేయించేలా పథకం వేశాడు. అయితే చివరకు తండ్రితో పాటు కాంట్రాక్ట్ కిల్లర్ దొరికిపోయారు. వివరాల్లోకి వెళితే ఉత్తర్ ప్రదేశ్ మీరట్ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక తల్లిదండ్రుల మాట కాదని ఓ వ్యక్తిని ప్రేమిస్తూ.. అతనితో సంబంధం నెరుపుతోంది. అయితే తండ్రితో…
Lightning Strike In Uttar pradesh, Madhya pradesh: మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పిడుగుపాటులో పలువురు మరణించారు. మధ్యప్రదేశ్ లోని విదిశా, సత్నా, గుణ జిల్లాల్లో గత 24 గంటల్లో 9 మంది మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. విదిశా జిల్లాలోని గంజ్ బాసోడా తహసీల్ పరిధిలోని అగసోడ్ గ్రామంలో వర్షం వస్తుందని చెట్టుకింద నిల్చున్న నలుగురు వ్యక్తులపై పిడుగు పడింది. దీంతో వారంతా అక్కడిక్కడే మరణించారు. చ
Two test positive for HIV after getting tattoos in Varanasi: శరీరంపై టాటాస్ వేయించుకుంటే ఎంత ప్రమాదమో తెలియజెప్పే ఘటన ఇది. చౌకగా టాటూలు వేస్తున్నారని కక్కుర్తి పడితే.. ఏకంగా జీవితాన్నే పణంగా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకే సూదితో చాలా మంది టాటూలు వేయించుకున్న ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. అయితే ఇందులో ప్రస్తుతం ఇద్దరికి ప్రాణాంతకమైన హెచ్ఐవీ వ్యాధి సోకింది. వారణాసిలో చౌకగా వస్తుందని టాటూలు వేయించుకున్నారు. ఆ తరువాత…
Ayodhya Ram Temple: హిందువులు ఎంతో పవిత్రంగా భావించే అయోధ్య శ్రీ రామ మందిరం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎన్నో ఎళ్లుగా కోర్టులో పెండింగ్ ఈ సమస్య 2019లో సుప్రీం కోర్టు ముగింపు పలికింది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకాభిప్రాయంతో రామ జన్మభూమికి అనుకూలంగా 2019లో తీర్పు వెలువరించారు.