FaceBook Love: పెళ్లి చేసుకోమంటే ఇటుకతో కొట్టి చంపిన ప్రియుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FaceBook Love: సోషల్ మీడియా ప్రియుడి ప్రేమ కోసం భర్త, పిల్లలను వదిలేసిన ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. ఫేస్బుక్ బాయ్ఫ్రెండ్ను కలవడానికి నిజామాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్కు వెళ్లిన ఓ వివాహిత అతడి చేతిలో ప్రాణాలు కోల్పోయిశవమై కనిపించింది. వివరాల్లోకి వెళితే… నిజామాబాద్ జిల్లా బాన్సువాడ పట్టణంలో ముఖిద్-ఉస్మాభేగం దంపతులకు ఇద్దరు పిల్లలు. పెళ్లయిన 12 ఏళ్ల తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తి కొంతకాలంగా విడిపోయి ఇటీవలే మళ్లీ కలిశారు. భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉన్న సమయంలో ఉస్మాకు సోషల్ మీడియాలో ఉత్తరప్రదేశ్లోని అమ్రేహ జిల్లాకు చెందిన హెజాద్తో పరిచయం ఏర్పడింది. ఇది ప్రేమకు దారితీసింది. షెహజాద్ మాయమాటలు నమ్మి భర్తనే కాకుండా పెంచి పోషించిన పిల్లలను సైతం వదిలి వెళ్లేందుకు సిద్ధపడింది. ఉస్మాభేగం తన సోషల్ మీడియా ప్రేమికుడిని కలవడానికి ఈనెల (నవంబర్) 6న ఇంటి నుంచి బయలుదేరింది. భార్య ఆచూకీ లభించకపోవడంతో ముఖిద్ పోలీసులను ఆశ్రయించడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read also: Tamilnadu Rains: పొంగిపొర్లుతున్న డ్యామ్లు, నీటమునిగిన వీధులు.. తమిళనాడును ముంచెత్తిన వర్షాలు
Also Read
- Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
- OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
అయితే బాన్సువాడలో అదృశ్యమైన ఉస్మాభేగం ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాలోని గజరౌలాకు వెళ్లింది. సెక్యూరిటీ కంపెనీ కీ షాజాద్ వద్ద ఉండడంతో ఉస్మాను అక్కడికి తీసుకెళ్లాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఉస్మా కోరగా షాజాద్ నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కోపోద్రిక్తుడైన షాజాద్ ఉస్మాను చున్నీతో కట్టి చేతిలోని ఇటుకతో తలపై కొట్టాడు. ఆమె తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయింది. ఉస్మా మృతదేహాన్ని అక్కడే వదిలేసి షాజాద్ పారిపోయాడు. రెండు మూడు రోజుల తర్వాత కంపెనీ సిబ్బంది మృతదేహాన్ని గుర్తించి గాజరావుల పోలీసులకు సమాచారం అందించారు. మహిళ మృతదేహంతో లభించిన ఆధారాలను బట్టి ఆమెను నిజామాబాద్ జిల్లాగా గుర్తించారు. అదృశ్యమైన మహిళ ఉస్మాగా గుర్తించారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు మృతదేహాన్ని తీసుకురావడానికి యూపీ వెళ్లారు. సుఖవంతమైన జీవితంలోకి ప్రవేశించిన సోషల్ మీడియా స్నేహం చివరకు ఓ వివాహిత జీవితాన్ని బలిగొంది. ఇలాంటి సంఘటనలను దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియా స్నేహాలను నమ్మి మోసపోవద్దని పోలీసులు తెలిపారు. షాజాద్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Fact Check on Cm jagan: సీఎం జగన్ కి అవమానం జరగలేదు..వాస్తవం ఇదీ!
తాజావార్తలు
-
Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
-
నేడు టాప్-2 కోసం తుది సమరం.. ఉప్పల్లో SRH vs RCB హై వోల్టేజ్ ఫైట్.. సన్రైజర్స్ సరికొత్త ప్లాన్!
-
Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
-
Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?
-
ITR Filing Deadline Alert: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ తేదీ తర్వాత ITR దాఖలు చేస్తే రూ. 5,000 జరిమానా!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!