Govt on Congress: ‘‘మెలోని’’పై కాంగ్రెస్ జోక్ వివాదం.. స్పందించిన విదేశాంగ శాఖ..
- జార్జియా మెలోనిపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై స్పందించిన కేంద్రం..
- భారత్, ఇటలీ మధ్య బలమైన సంబంధాలున్నాయన్న విదేశాంగ శాఖ..
- ద్వైపాక్షిక సంబంధాల్లో పరస్పర గౌరవం, అవగాహన కీలకమని వ్యాఖ్య..
- రాహుల్ గాంధీ ప్రధాని మోదీ విదేశాంగ విధానంపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Govt on Congress: ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. ‘‘మనకు ఇటలీతో బలమైన సంబంధాలు ఉన్నాయి. వాటిని మరింత బలోపేతం చేయాలనుకుంటున్నాము. ద్వైపాక్షిక సంబంధాల్లో పరస్పర గౌరవం, అవగాహన ఎంతో ముఖ్యం. ఏ విషయాన్నైనా గౌరవంగా ముందుకు తీసుకురావాలి’’ అని విదేశాంగ ప్రతినిధి అన్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీ విదేశాంగ విధానంపై విమర్శలు చేస్తూ జార్జియా మెలోని ప్రస్తావన తీసుకువచ్చారు.
గురువారం ఢిల్లీలో క్రియేటివ్ కాంగ్రెస్ సదస్సులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. విదేశాంగ విధానం అంటే కౌగిలించుకోవడం అనే ఆలోచన ఆయన బుర్రలోకి ఎలా వచ్చింది? అంటూ వ్యాఖ్యానించారు. సెటైరికల్గా కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ను స్టేజ్పై కౌగిలించుకున్నారు. అయితే, ఆ సమయంలో సందీప్ దీక్షిత్ రాహుల్ గాంధీతో ‘‘నన్ను మీరు మెలోనీ అనుకోలేదు కదా?’’ అని అన్నారు. దీంతో అక్కడ ఉన్న వారంతా నవ్వారు. దీనికి సమాధానంగా రాహుల్ గాంధీ..‘‘నేను ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదు’’ అని అన్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Also Read
- West Bengal: ‘‘అమ్మాయిలు 3 నెలల స్కర్టులు ధరించొద్దు’’.. బెంగాల్ మంత్రి ఎందుకు ఇలా చెప్పారు.?
- Free LPG Cylinders Scheme: గుడ్న్యూస్ చెప్పిన గోవా సీఎం.. 3 ఎల్పీజీ సిలిండర్లు ఫ్రీ.. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్
- RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
- Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
కాంగ్రెస్, రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తూ, దేశాన్ని నడిపించడానికి పరిణతి చెందిన నాయకత్వం అవసరమని అన్నారు. ప్రధాని మోదీని అవమానించే వ్యాఖ్యలు చేయడం ద్వారా రాహుల్ గాంధీ దేశ ప్రజలను కూడా అవమానిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే, దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గతంలో పలువురు విదేశాల అధినేతల్ని ఆలింగనం చేసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
తాజావార్తలు
-
OTR: వివాదాలకు కేరాఫ్గా బోనబోయిన శ్రీనివాస్..
-
Gut Health: జీర్ణక్రియ మెరుగుపడాలంటే..? రోజువారీ ఆహారంలో ఈ ఐదు చేర్చండి
-
OTR: యాక్టివ్ మోడ్లోకి షకీల్.. కవిత ఎఫెక్ట్, కేటిఆర్ వార్నింగ్ కారణమా ?
-
OTR: కొండా సురేఖ బీజేపీలో చేరుతుందా ?
-
West Bengal: ‘‘అమ్మాయిలు 3 నెలల స్కర్టులు ధరించొద్దు’’.. బెంగాల్ మంత్రి ఎందుకు ఇలా చెప్పారు.?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!