Russian Youth leave nation due to new war plans: ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం మరింతగా ముదిరే పరిస్థితి కనిపిస్తోంది. పాక్షిక సైనిక సమీకరణకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో రానున్న రోజుల్లో ఉక్రెయిన్ వైపు మరింత మంది సైనికులను తరలించనున్నట్లు తెలుస్తోంది. తమ భూభాగాలను రక్షించుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకుంటామని.. అణుబాంబు వేసే సమయం వచ్చిందని..దీన్ని అమెరికా, దాని మిత్ర రాజ్యాలు డ్రామాలు…
France and USA praised Prime Minister Modi's comments: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇటీవల షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడితో అన్న వ్యాఖ్యలకు మద్దతు పెరుగుతోంది. తాజాగా యూఎస్ఏ, ఫ్రాన్స్ దేశాలు కూడా మోదీ వ్యాఖ్యలు సరైనవని తెలిపాయి. న్యూయార్క్ లో జరుగుతన్న 77వ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ మద్దతు తెలిపారు. యుద్ధానికి ఇది సమయం కాదని ప్రధాని మోదీ…
Omicron BA.4.6 Variant Is Now Spreading: కోవిడ్ 19 వ్యాధి పుట్టి దాదాపుగా మూడు ఏళ్లు కావస్తోంది. అయినా ఇప్పటికీ ఇది ప్రపంచ దేశాలను ప్రభావితం చేస్తూనే ఉంది. కోవిడ్ దెబ్బకు అనేక దేశాల ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. కరోనా తన రూపాలను మారుస్తూ.. మనుషులపై దాడి చేస్తూనే ఉంది. ఆల్ఫా, బీటా, ఓమిక్రాన్, డెల్టా, ఓమిక్రాన్ సబ్ వేరియంట్ల రూపంలో వ్యాధి వ్యాప్తి చెందుతూనే ఉంది. తాజాగా మరో కరోనా వేరియంట్ అయిన ఓమిక్రాన్…
Taliban Try Flying Chopper Left Behind By US, Crash It: ఆఫ్ఘనిస్తాన్ దేశంలో అధికారం చేజిక్కించుకున్న తాలిబాన్లు.. సైనికపరంగా కూడా బలపడాలని కోరుకుంటున్నారు. గతంలో యూఎస్ మిలిటరీ, ఆప్ఘన్ సైన్యంలో పనిచేసిన వారిని తిరిగి విధుల్లో చేరాలని అధికారం చేపట్టిన తర్వాత కోరారు. పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం ఉండటం, అంతర్గతంగా కూడా ఐసిస్ ప్రభావం ఎక్కువ అవుతుండటంతో తాలిబన్ ప్రభుత్వం తమకు సైన్యం ఉండాలని కోరుకుంటోంది.
Pramila Jayapal gets threat messages: అమెరికాలో భారతీయులపై విద్వేష దాడులు జరగుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో పలువురు భారతీయులపై దాడులు కూడా జరిగాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం అమెరికాలో కీలక స్థానంలో చట్టసభ్యురాలిగా ఉన్న ప్రమీలా జయపాల్ కు బెదిరింపులు ఎదురయ్యాయి. భారత-అమెరికన్ కాంగ్రెస్ సభ్యురాలు అయిన ప్రమీలా జయపాల్ కు ఓ వ్యక్తి ఫోన్ చేసి దుర్భాషలాడారు. విద్వేషపూరిత సందేశాలు పంపాడు. వీటిని ఆమె శుక్రవారం ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. భారతదేశానికి తిరిగి…
Kim Jong Un: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తమను తాము రక్షించుకోవడానికి ముందస్తు అణు దాడులకు వెనకాడం అని హెచ్చరించారు. తమను తాము రక్షించుకునే హక్కు ఉందని ఆయన అన్నారు. తమ అణ్వాస్త్ర సామర్థ్యం తిరగులేనిదని కిమ్ అన్నారు. అమెరికా చర్యలను అడ్డుకోవాలంటే అణ్వాయుధాలు ఉండాల్సిందే అని గురువారం ఉత్తర కొరియా సుప్రీం పీపుల్స్ అసెంబ్లీలో ప్రసగించారు. అమెరికా, దక్షిణ కొరియా కలిసి తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని…
US Approves Sale Of F-16 Fleet To Pakistan: అమెరికా, పాకిస్తాన్ దేశాల మధ్య మరోసారి సైనిక బంధం బలపడుతోంది. నాలుగేళ్ల తరువాతా అమెరికా, పాకిస్తాన్ దేశానికి భద్రత సహాయం చేయనుంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ కు సహాయపడేందుకు అమెరికా 450 మిలియన్ డాలర్ల ఎఫ్-16 ఫైటర్ జెట్ ప్లీట్ ను అమ్మనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి ప్రెసిడెంట్ బైడెన్ పరిపాలన యంత్రాంగం ఆమోదించింది. 2018లో ఆఫ్ఘన్ తాలిబన్లను,
More than 300 children died in the war between Russia and Ukraine: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై ఏడు నెలలకు చేరింది. ఇప్పటికీ ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. రష్యా దాడిలో ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోతోంది. యుద్ధం ప్రారంభం అయ్యే ముందు పటిష్టమైన రష్యా ముందు కేవలం వారాల వ్యవధిలోనే ఉక్రెయిన్ లొంగిపోతుందని అంతా అనుకున్నారు. అయితే పాశ్చాత్య దేశాలు, అమెరికా, బ్రిటన్ వంటి నాటో దేశాలు…
Pilot Threatens To Crash Plane into Walmart in USA: అమెరికాలో ఓ పైలెట్ విమానాన్ని దొంగిలించి కూల్చేస్తానని బెదిరిస్తున్నాడు. అమెరికాలో పైలెట్ గా పనిచేస్తున్న ఓ యువకుడు భద్రతా అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. వాల్మార్ట్ పై విమానాన్ని కూలుస్తానంటూ ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. అమెరికాలోని ఈశాన్య మిస్సిస్సిప్పీలోని టుపెలోలోలోని వెస్ట్ మెయిన్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది.
Taliban celebrates 1st anniversary of US troops withdrawal: ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ సంబారాలు అంబరాన్ని అంటుతున్నాయి. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున తాలిబాన్ ప్రభుత్వం సంబరాలు చేస్తోంది. ఆగస్టు 31న జాతీయ సెలవు దినంగా ప్రకటించింది. 20 ఏళ్ల పాటు ఆప్ఘనిస్తాన్ లో ఉన్న యూఎస్ బలగాలు ఉపసంహరించుకుని ఏడాది గడవడంతో తాలిబన్లు మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. రంగురంగలు లైట్లతో రాజధాని కాబూల్ మెరిసిపోతోంది.