Russia-Ukraine War: రష్యా దాడిలో ఇప్పటి వరకు 382 మంది పిల్లల మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
More than 300 children died in the war between Russia and Ukraine: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై ఏడు నెలలకు చేరింది. ఇప్పటికీ ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. రష్యా దాడిలో ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోతోంది. యుద్ధం ప్రారంభం అయ్యే ముందు పటిష్టమైన రష్యా ముందు కేవలం వారాల వ్యవధిలోనే ఉక్రెయిన్ లొంగిపోతుందని అంతా అనుకున్నారు. అయితే పాశ్చాత్య దేశాలు, అమెరికా, బ్రిటన్ వంటి నాటో దేశాలు ఇచ్చే ఆర్థిక, సైనిక సహాయంతో ఉక్రెయిన్ ఎదురొడ్డి నిలుస్తోంది. ఫిబ్రవరి 24న ప్రారంభమైన యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఇదిలా ఉంటే రష్యా దాడిలో తీవ్రంగా నష్టపోతోంది ఉక్రెయిన్. ఇప్పటికే ఉక్రెయిన్ లోని మరియోపోల్, ఖార్కివ్, సుమీ వంటి నగరాలతో పాటు రాజధాని కీవ్ కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇక డాన్ బోస్ రీజియన్ కూడా రష్యా దాడితో అతలాకుతలం అవుతోంది. రష్యా దాడి ప్రారంభం అయినప్పటి నుంచి ఉక్రెయిన్ లో 382 మంది పిల్లలు చనిపోయారని.. 741 మందికి పైగా గాయపడ్డారని.. ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం వెల్లడించింది. డోనెట్స్క్ ప్రాంతంలో 388 మంది, ఖార్కివ్ ప్రాంతంలో 204 మంది, కీవ్ లో 116 మంది, మైకోలైవ్ లో 71 మంది, చెర్నిహివ్ లో 68 మంది, లుహాన్స్క్ లో 61 మంది, ఖేర్సన్ లో 55 మంది, జపోరిజియాలో 46 మంది పిల్లలు ప్రభావితం అయ్యారని తెలిపింది. ప్రతీ ఇద్దరు ఉక్రెయిన్ పిల్లల్లో ఒకరు శరణార్థిగా మారినట్లు ఐక్యరాజ్యసమితి అంచానా వేసింది.
Also Read
- Indonesia Earthquake: ఇండోనేషియాలో 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Italy: ఇటలీలో భారీ ప్రమాదం.. డెలివరీ చేసిన 4 రోజులకే మునిగిన లగ్జరీ నౌక
- August 15 Independence Day: భారత్తో పాటు, ఆగస్టు 15న ఈ నాలుగు దేశాలకు స్వాతంత్య్రం..
- Modi-Rahman: బ్రిక్స్కు ముందే ఢిల్లీకి రెహమాన్.. మోడీతో బంగ్లాదేశ్ ప్రధాని కీలక భేటీ?
ఈ రెండు దేశాల మధ్య యుద్ధం వల్ల రష్యాపై పాశ్చాత్య దేశాలు అనేక ఆంక్షలు విధించిన ప్రెసిడెంట్ పుతిన్ వెనుకడుగు వేయడం లేదు. ఉక్రెయిన్ తో పాటు నాటో దేశాలు, యూరోపియన్ దేశాలతో తాడోపేడో తేల్చుకోవాలనే అనుకుంటున్నారు. తాజాగా రష్యా నుంచి యూరోపియన్ దేశాలకు వెళ్లాల్సిన గ్యాస్ ను ఆపేశారు. అయితే గ్యాస్ లైన్ లో లీకేజీలు ఉండటంతోనే గ్యాస్ సరఫరాను నిలిపివేశామని రష్యా అంటుంటే.. కావాలనే రష్యా ఇలా చేసిందని యూరప్ దేశాలు ఆరోపిస్తున్నాయి. వచ్చే శీతాకాలంలో యూరప్ తో గ్యాస్ అవసరాలు తారాస్థాయికి చేరుతాయి. ఇదే అదనుగా రష్యా, యూరప్ దేశాలను ఇరుకున పెట్టాలని భావిస్తోంది.
తాజావార్తలు
-
TV Ad Cap: 12 నిమిషాల యాడ్ రూల్కు కేంద్రం గుడ్బై.. టీవీ ఛానళ్లకు కొత్త నిబంధనలు
-
PM Modi: “మనం ఇతర దేశాలపై ఆధారపడకూడదు”.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ కీలక సందేశం..
-
Sreeleela: ముంబైలో సెట్స్పై శ్రీలీల.. కార్తీక్ మూవీ షూటింగ్ మళ్లీ స్టార్ట్!
-
Independence Day 2026: ఎర్రకోటపై ప్రధాని మోడీ జెండా ఆవిష్కరణ.. తొలిసారి మార్మోగిన ‘వందేమాతరం’..
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!