Afghanistan: తాలిబాన్ల సంబరాలు.. ఆగస్టు 31 జాతీయ సెలవు దినంగా ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taliban celebrates 1st anniversary of US troops withdrawal: ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ సంబారాలు అంబరాన్ని అంటుతున్నాయి. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున తాలిబాన్ ప్రభుత్వం సంబరాలు చేస్తోంది. ఆగస్టు 31న జాతీయ సెలవు దినంగా ప్రకటించింది. 20 ఏళ్ల పాటు ఆప్ఘనిస్తాన్ లో ఉన్న యూఎస్ బలగాలు ఉపసంహరించుకుని ఏడాది గడవడంతో తాలిబన్లు మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. రంగురంగలు లైట్లతో రాజధాని కాబూల్ మెరిసిపోతోంది.
2021 ఆగస్టులో యఎస్, నాటో బలగాలు ఆప్ఘన్ నుంచి వెళ్లిపోయాయి. దీంతో తాలిబన్లు ప్రజా ప్రభుత్వాన్ని కూల్చి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఏడాదిగా తాలిబన్ పాలన కొనసాగుతోంది. కఠినమైన ఇస్లామిక్ చట్టాలను అమలు చేస్తున్నారు అక్కడి పాలకులు. ప్రపంచంలోని చాలా దేశాలు ఆప్ఘన్ లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించలేదు. దీంతో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, తాలిబాన్ అరాచక పాలన, పేదరికంతో ఆఫ్ఘనిస్తాన్ కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికీ మహిళల విద్య ప్రశ్నార్థకంగానే ఉంది. కాబూల్ నుంచి ఇతర దేశాలకు వెళ్లి చదువుకునేందుకు మహిళలకు పర్మిషన్ కూడా ఇవ్వడం లేదు.
Also Read
- Mojtaba Khamenei: ప్రతీకారం తప్పకుండా ఉంటుంది.. యూఎస్-ఇజ్రాయిల్కు మొజ్తబా వార్నింగ్..
- China: స్పేస్ వార్కు చైనా సై.. ఉపగ్రహాలను సైతం బూడిద చేసే ‘సరికొత్త ఆయుధం’ సిద్ధం! ఎలా పని చేస్తుందంటే..
- Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 19కు చేరిన తెలుగు పర్యాటకుల మృతుల సంఖ్య
- Trump-Iran: ఆ విషయంలో ‘పొరపాటు’ జరిగింది.. ట్రంప్ బృందానికి ఇరాన్ రహస్య సందేశం?
ఇలాంటి సంక్షోభ పరిస్థితులు ఉన్నా కూడా.. కొంత మంది ఆప్ఘన్ పౌరులు తాలిబాన్ పాలనపై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అల్లా మా దేశం నుంచి అవిశ్వాసులను వెళ్లగొట్టారని చెబుతున్నారు. న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్ పై సెప్టెంబర్ 11,2001 దాడుల నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ లో మొదలైన యూఎస్ సైనిక జోక్యం చివరకు 2021లో ముగిసిందని కొంతమంది మతఛాందస వాదులు వ్యాఖ్యానిస్తున్నారు. దాదాపు 20 ఏళ్లలో 66,000 మంది ఆఫ్ఘాన్ సైనికులు, 48,000 మంది ప్రజలు, 3500 మంది నాటో సైనికులు మరణించారు.
తాలిబాన్ పాలన ప్రారంభం అయినప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్ లో పేదరికం విపరీతంగా పెరిగింది. పిల్లలను అమ్ముకోవడంతో పాటు.. కిడ్నీలను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు అక్కడి ప్రజలు. మరోవైపు ఐసిస్ ఉగ్రసంస్థ వరసగా దాడులకు తెగబడుతోంది. ముఖ్యంగా మైనారిటీలు అయిన షియాలు, హజారా తెగలకు సంబంధించిన ప్రజలనే టార్గెట్ చేస్తోంది. మసీదుల్లో బాంబులు పెడుతూ.. ఆత్మాహుతి దాడులకు తెగబడుతోంది. ఏడాది కాలంలో పదికిపైగా మేజర్ ఉగ్రవాద దాడులకు తెగబడింది ఐసిస్
తాజావార్తలు
-
Bihar: షాకింగ్ నిర్ణయం.. బంకీపూర్ అభ్యర్థిని మార్చేసిన బీజేపీ.. కారణమిదేనా?
-
Mojtaba Khamenei: ప్రతీకారం తప్పకుండా ఉంటుంది.. యూఎస్-ఇజ్రాయిల్కు మొజ్తబా వార్నింగ్..
-
Thalliki Vandanam: తల్లికి వందనం లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. ఈ మూడు పనులు చేయకుంటే డబ్బులు రావు!
-
Omar Abdullah: రూ.30 కోట్లతో ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారు.. బీజేపీపై జమ్మూకాశ్మీర్ సీఎం ఆరోపణలు
-
Monsoon 2026: దేశంలోని మాయమైన వర్ష మేఘాలు..రుతుపవనాలకు ఏమైంది?..
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!