Afghanistan: తాలిబాన్ల సంబరాలు.. ఆగస్టు 31 జాతీయ సెలవు దినంగా ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taliban celebrates 1st anniversary of US troops withdrawal: ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ సంబారాలు అంబరాన్ని అంటుతున్నాయి. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున తాలిబాన్ ప్రభుత్వం సంబరాలు చేస్తోంది. ఆగస్టు 31న జాతీయ సెలవు దినంగా ప్రకటించింది. 20 ఏళ్ల పాటు ఆప్ఘనిస్తాన్ లో ఉన్న యూఎస్ బలగాలు ఉపసంహరించుకుని ఏడాది గడవడంతో తాలిబన్లు మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. రంగురంగలు లైట్లతో రాజధాని కాబూల్ మెరిసిపోతోంది.
2021 ఆగస్టులో యఎస్, నాటో బలగాలు ఆప్ఘన్ నుంచి వెళ్లిపోయాయి. దీంతో తాలిబన్లు ప్రజా ప్రభుత్వాన్ని కూల్చి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఏడాదిగా తాలిబన్ పాలన కొనసాగుతోంది. కఠినమైన ఇస్లామిక్ చట్టాలను అమలు చేస్తున్నారు అక్కడి పాలకులు. ప్రపంచంలోని చాలా దేశాలు ఆప్ఘన్ లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించలేదు. దీంతో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, తాలిబాన్ అరాచక పాలన, పేదరికంతో ఆఫ్ఘనిస్తాన్ కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికీ మహిళల విద్య ప్రశ్నార్థకంగానే ఉంది. కాబూల్ నుంచి ఇతర దేశాలకు వెళ్లి చదువుకునేందుకు మహిళలకు పర్మిషన్ కూడా ఇవ్వడం లేదు.
Also Read
- Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
- Tarique Rahman: బ్రిక్స్కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
- Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
- Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
ఇలాంటి సంక్షోభ పరిస్థితులు ఉన్నా కూడా.. కొంత మంది ఆప్ఘన్ పౌరులు తాలిబాన్ పాలనపై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అల్లా మా దేశం నుంచి అవిశ్వాసులను వెళ్లగొట్టారని చెబుతున్నారు. న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్ పై సెప్టెంబర్ 11,2001 దాడుల నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ లో మొదలైన యూఎస్ సైనిక జోక్యం చివరకు 2021లో ముగిసిందని కొంతమంది మతఛాందస వాదులు వ్యాఖ్యానిస్తున్నారు. దాదాపు 20 ఏళ్లలో 66,000 మంది ఆఫ్ఘాన్ సైనికులు, 48,000 మంది ప్రజలు, 3500 మంది నాటో సైనికులు మరణించారు.
తాలిబాన్ పాలన ప్రారంభం అయినప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్ లో పేదరికం విపరీతంగా పెరిగింది. పిల్లలను అమ్ముకోవడంతో పాటు.. కిడ్నీలను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు అక్కడి ప్రజలు. మరోవైపు ఐసిస్ ఉగ్రసంస్థ వరసగా దాడులకు తెగబడుతోంది. ముఖ్యంగా మైనారిటీలు అయిన షియాలు, హజారా తెగలకు సంబంధించిన ప్రజలనే టార్గెట్ చేస్తోంది. మసీదుల్లో బాంబులు పెడుతూ.. ఆత్మాహుతి దాడులకు తెగబడుతోంది. ఏడాది కాలంలో పదికిపైగా మేజర్ ఉగ్రవాద దాడులకు తెగబడింది ఐసిస్
తాజావార్తలు
-
LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
-
Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
-
TGTET ఇన్సర్వీస్ కీ విడుదల.. అభ్యంతరాలకు ఇదే చివరి ఛాన్స్.!
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
-
Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?