Afghanistan: తాలిబాన్ల సంబరాలు.. ఆగస్టు 31 జాతీయ సెలవు దినంగా ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taliban celebrates 1st anniversary of US troops withdrawal: ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ సంబారాలు అంబరాన్ని అంటుతున్నాయి. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున తాలిబాన్ ప్రభుత్వం సంబరాలు చేస్తోంది. ఆగస్టు 31న జాతీయ సెలవు దినంగా ప్రకటించింది. 20 ఏళ్ల పాటు ఆప్ఘనిస్తాన్ లో ఉన్న యూఎస్ బలగాలు ఉపసంహరించుకుని ఏడాది గడవడంతో తాలిబన్లు మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. రంగురంగలు లైట్లతో రాజధాని కాబూల్ మెరిసిపోతోంది.
2021 ఆగస్టులో యఎస్, నాటో బలగాలు ఆప్ఘన్ నుంచి వెళ్లిపోయాయి. దీంతో తాలిబన్లు ప్రజా ప్రభుత్వాన్ని కూల్చి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఏడాదిగా తాలిబన్ పాలన కొనసాగుతోంది. కఠినమైన ఇస్లామిక్ చట్టాలను అమలు చేస్తున్నారు అక్కడి పాలకులు. ప్రపంచంలోని చాలా దేశాలు ఆప్ఘన్ లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించలేదు. దీంతో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, తాలిబాన్ అరాచక పాలన, పేదరికంతో ఆఫ్ఘనిస్తాన్ కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికీ మహిళల విద్య ప్రశ్నార్థకంగానే ఉంది. కాబూల్ నుంచి ఇతర దేశాలకు వెళ్లి చదువుకునేందుకు మహిళలకు పర్మిషన్ కూడా ఇవ్వడం లేదు.
Also Read
- Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
- Vladimir Putin: "మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు".. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
- Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ఇలాంటి సంక్షోభ పరిస్థితులు ఉన్నా కూడా.. కొంత మంది ఆప్ఘన్ పౌరులు తాలిబాన్ పాలనపై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అల్లా మా దేశం నుంచి అవిశ్వాసులను వెళ్లగొట్టారని చెబుతున్నారు. న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్ పై సెప్టెంబర్ 11,2001 దాడుల నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ లో మొదలైన యూఎస్ సైనిక జోక్యం చివరకు 2021లో ముగిసిందని కొంతమంది మతఛాందస వాదులు వ్యాఖ్యానిస్తున్నారు. దాదాపు 20 ఏళ్లలో 66,000 మంది ఆఫ్ఘాన్ సైనికులు, 48,000 మంది ప్రజలు, 3500 మంది నాటో సైనికులు మరణించారు.
తాలిబాన్ పాలన ప్రారంభం అయినప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్ లో పేదరికం విపరీతంగా పెరిగింది. పిల్లలను అమ్ముకోవడంతో పాటు.. కిడ్నీలను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు అక్కడి ప్రజలు. మరోవైపు ఐసిస్ ఉగ్రసంస్థ వరసగా దాడులకు తెగబడుతోంది. ముఖ్యంగా మైనారిటీలు అయిన షియాలు, హజారా తెగలకు సంబంధించిన ప్రజలనే టార్గెట్ చేస్తోంది. మసీదుల్లో బాంబులు పెడుతూ.. ఆత్మాహుతి దాడులకు తెగబడుతోంది. ఏడాది కాలంలో పదికిపైగా మేజర్ ఉగ్రవాద దాడులకు తెగబడింది ఐసిస్
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Record: వైభవ్ సూర్యవంశీకి గుడ్న్యూస్.. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డు బద్దలే!
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25% వద్ద యథాతథం.. లక్షలాది మంది రుణగ్రహీతలకు ఊరట
-
Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
-
వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
-
Ather Rizta Price Hike: పెరిగిన ఏథర్ రిజ్టా ధరలు.. ఏ వేరియంట్పై ఎంత ధర పెరిగిందో తెలుసా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..