USA: ఇజ్రాయిల్కి అగ్రరాజ్యం అమెరికా పూర్తి మద్దతును ప్రకటించింది. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో ఇజ్రాయిల్ దేశానికి సంపూర్ణ సహకారం అందిస్తోంది. తాజాగా గురువారం అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ ఇజ్రాయిల్ వెళ్లారు.
Joe Biden: హమాస్ ఉగ్రవాదుల దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు అని చూడకుండా అత్యంత కిరాతకంగా హత్యలు చేశారు. ఒకే ప్రాంతంలో 40 మంది పిల్లల తలలను తెగనరికారు. ఈ క్రూరమైన దాడితో ఇజ్రాయిల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. హమాస్ని లేకుండా చేసేందుకు పావులు కదుపుతోంది. ఇదిలా ఉంటే ఈ దాడిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Israel-Hamas War: ఇజ్రాయిల్పై హమాస్ ఉగ్రసంస్థ మెరుపుదాడి యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపోయేలా చేసింది. పటిష్ట నిఘా వ్యవస్థ, సైన్యం ఉన్న ఇజ్రాయిల్ కూడా ఈ దాడిని కలలో కూడా ఊహించి ఉండకపోవచ్చు. పారా గ్లైడర్లు, బుల్డోజర్ల ద్వారా ఇజ్రాయిల్ సరిహద్దు దాటి లోపలకి వచ్చిన హమాస్ ఉగ్రమూకలు దొరికిన వారిని దొరికినట్లు చంపేశాయి. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 1200 మందికి పైగా చనిపోయారు.
Israel War: ఇజ్రాయిల్పై హమాస్ మిలిటెంట్లు భీకరదాడికి పాల్పడ్డారు. బలమైన సైన్యం, టెక్నాలజీ, మెస్సాద్ వంటి ఇంటెలిజెన్స్ సంస్థ ఉన్నప్పటికీ.. ఇలాంటి దాడిని ఊహించలేకపోయింది. అంత పకడ్భందీగా హమాస్ గాజా నుంచి కేవలం నిమిషాల వ్యవధిలోనే 5000 రాకెట్లను ప్రయోగించింది.
Donald Trump: అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయిల్ పై హమాస్ తీవ్రవాదులు భారీ దాడికి తెగబడ్డారు. 5000 రాకెట్లతో గాజా నుంచి ఇజ్రాయిల్ పైకి దాడి చేశారు. ఈ దాడిలో 300 మందికి పైగా ఇజ్రాయిల్ పౌరులు మరణించారు. ఊహించని దాడితో ఇజ్రాయిల్ ఉక్కిరిబిక్కిరి అయింది. ఇజ్రాయిల్ సైన్యం గాజా స్ట్రిప్ పై భీకరంగా దాడులు చేస్తోంది. చుట్టు పక్కల దేశాల్లోని మిలిటెంట్ సంస్థలు కూడా ఇజ్రాయిల్ పై దాడులకు చేస్తున్నాయి. ఈ చర్యలతో మరోసారి మధ్యప్రాచ్యంలో తీవ్ర…
Hamas Attack On Israel: గాజాను పాలిస్తున్న హమాస్ మిలిటెంట్లు ఎప్పుడూ లేని విధంగా ఇజ్రాయిల్ పై భీకరదాడి చేశారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 300 మందికిపైగా ఇజ్రాయిలు చనిపోగా.. చాలా మందిని బందీలుగా మిలిటెంట్లు పట్టుకుని, గాజాకు తీసుకెళ్లారు. ప్రపంచవ్యాప్తంగా భారత్తో సహా వివిధ దేశాలు హమాస్ దాడిని ఖండించాయి. అయితే ఇరాన్ మాత్రం హమాస్ దాడికి మద్దతు తెలుపుతూ, ఈ దాడి ఎంతో గర్వంగా ఉందని వ్యాఖ్యానించింది. పలు ఇస్లామిక్ దేశాల్లో ప్రజలు…
Canada-India row: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియాల మధ్య చిచ్చుపెట్టింది. ఇరు దేశాల మధ్య దౌత్యసంబంధాలు గతంలో ఎప్పుడూ లేని విధంగా దిగజారాయి. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలతో మొదలైన ఈ వివాదం చాలా దూరం వెళ్లింది. నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని ట్రూడో ఆరోపించడం,
USA: అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో భారత సంతతికి చెందిన కుటుంబంలో విషాదం నిండింది. దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు శవమై కనిపించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తేజ్ ప్రతాప్ సింగ్(43), సోనాల్ పరిహార్(42)తోపాటు వారి 10,6 ఏళ్ల వయసున్న పిల్లలు ప్లెయిన్స్బోరో లోని వారి ఇంట్లో విగతజీవులుగా పడి ఉన్నారు.
Putin: రష్యా తన కొత్త వ్యూహాత్మక క్షిపణిని విజయవంతంగా పరీక్షించిందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. 30 ఏళ్ల తరువాత తొలిసారిగి అణుసమార్థ్యం ఉన్న ఆయుధ పరీక్షను నిర్వహించింది రష్యా. అణుశక్తితో నడిచే, అణు సామర్థ్యం కలిగిన క్రూయిజ్ క్షిపణి అయిన ‘బ్యూరేవెస్ట్నిక్’ని విజయవంతంగా పరీక్షించిందని పుతిన్ చెప్పారు. రష్యా తన కొత్త తరం అణ్వాయుధాలలో కీలకమైన సర్మత్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థపై దాదాపుగా పనిని పూర్తి చేసిందని వెల్లడించారు.
Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి వెస్ట్రన్ దేశాలపై ఆగ్రహ వ్యక్తం చేశారు. ‘‘రష్యా కొత్త ప్రపంచాన్ని నిర్మించే పనిలో ఉంది’’ అని గురువారం అన్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి వెస్ట్రన్ దేశాలే కారణమని నిందించారు. ప్రపంచ ఆధిపత్యం కోసం పశ్చిమ దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయని ఆరోపించారు. పాశ్యాత్య దేశాలకు ఎప్పుడూ ఓ శతృవు కావాలని ఎద్దేవా చేశారు. వాల్దాయ్ పొలిటికల్ ఫోరమ్ సందర్భంగా పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.