Canada-India row: ఇండియా-కెనడా వివాదం.. భయపడుతున్న అమెరికా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canada-India row: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియాల మధ్య చిచ్చుపెట్టింది. ఇరు దేశాల మధ్య దౌత్యసంబంధాలు గతంలో ఎప్పుడూ లేని విధంగా దిగజారాయి. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలతో మొదలైన ఈ వివాదం చాలా దూరం వెళ్లింది. నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని ట్రూడో ఆరోపించడం, భారత దౌత్యవేత్తను కెనడా బహిష్కరించడంతో వివాదం తారాస్థాయికి వెళ్లింది. కెనడా చర్యలకు ప్రతిగా భారత్ కూడా కెనడియన్ దౌత్యవేత్తను బహిష్కరించింది. ఇదిలా ఉంటే తాగాజా 41 మంది కెనడా దౌత్యవేత్తలను తగ్గించుకోవాలని భారత్ కోరింది.
అమెరికాకు ఇండియా కీలకం:
Also Read
- Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
- Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
- Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
ఇదిలా ఉంటే ఈ రెండు దేశాల మధ్య అమెరికాకు భయం పట్టుకుంది. కెనడా , అమెరికాకు మిత్రదేశం, సరిహద్దు దేశం, సాంస్కృతికంగా అనేక సంబంధాలు ఉన్నాయి. మరోవైపు ప్రస్తుతం శరవేగంగా ఎదుగుతున్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్, ఇటీవల కాలంలో అమెరికా, భారత్ బంధం బలపడింది. అయితే కెనడా-భారత్ వివాదంలో భారత్ తో తమ బంధం ఎక్కడ దెబ్బతింటుందో అని అమెరికా భయపడుతోంది. నిజ్జర్ హత్య తర్వాత అమెరికా మాట్లాడుతూ..భారత్ విచారణకు సహకరించాలని కోరుతోంది. అయితే భారత్ మాత్రం అమెరికా సూచల్ని పట్టించుకోవడం లేదు.
ప్రస్తుతం చైనాను అడ్డుకోవాలంటే అమెరికాకు భారత్ ఒక్కటే దారి. భారత్ తో చెడితే చైనాకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉండదని యూఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే కెనడా వివాదం అమెరికాను చిక్కుల్లో పడేస్తోంది. ఇండో-పసిఫిక్ రిజియన్ లో భారత్ చాలా ముఖ్యదేశం. చైనాకు కళ్లెం వేయాలంటే భారత్ అవసరం తప్పనిసరి.ఇక క్వాడ్ కూటమిలో భారత్ తో పాటు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా ఉన్నాయి.
భయపెడుతున్న గత అనుభవం:
అయితే గత అనుభవాలను గుర్తు చేసుకుని అమెరికా భయపడుతోంది. 2018లో యూకేలోని సాలిస్బరీలో మాజీ రష్యన్ గూఢచారి సెర్గీ స్కీపాల్, అతని కుమార్తెను విష ప్రయోగం చేసి చంపారు. అయితే ఈ హత్యల్లో రష్యా పాత్ర ఉందని బ్రిటన్ ఆరోపించింది. 23 మంది రష్యన్ దౌత్యవేత్తలను బహిష్కరించింది. నాటో మిత్రదేశాలు కూడా ఇదే మార్గాన్ని అనుసరించాయి. అమెరికా 60 మంది రష్యన్ దౌత్యవేత్తలను బహిష్కరించింది. మిత్రదేశం యూకేకు మద్దతుగా సియాటెల్ లోని రష్యన్ కాన్సులేట్ మూసేయాలని ఆదేశించింది. దీనికి అంతేస్థాయిలో రష్యా కూడా సెయింట్ పీటర్స్ బర్గ్ లోని యూఎస్ కాన్సులేట్ ని మూసేసింది. అయితే ప్రస్తుతం భారత్, కెనడాల విషయంలో కూడా సరిగ్గా ఇదే జరుగోతుంది. రష్యా వ్యవహారం అంత సీరియస్ పరిస్థితి లేకున్నా.. పరిస్థితులు ఎటుమలుపు తిరుగుతాయో అని బెంగ పడుతోంది.
తాజావార్తలు
-
T20 Captain: భారత టీ20 కెప్టెన్గా కొత్త సారథి.. సంజూ శాంసన్కు అవకాశం..?
-
JioStar vs Zee: కోర్టుకెక్కిన బాలీవుడ్ సినిమాల వివాదం.. రూ.250 కోట్ల నష్టపరిహారం?
-
Supreme Court: సుప్రీం కోర్టు పొదుపు మంత్రం.. ఇకపై వర్చువల్ విచారణకు ఆదేశం
-
Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
-
Pawan Kalyan : ఏపీలో రక్షణ రంగ విప్లవం.. మెగా ప్రాజెక్టుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం.!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!