Canada-India row: ఇండియా-కెనడా వివాదం.. భయపడుతున్న అమెరికా..
Canada-India row: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియాల మధ్య చిచ్చుపెట్టింది. ఇరు దేశాల మధ్య దౌత్యసంబంధాలు గతంలో ఎప్పుడూ లేని విధంగా దిగజారాయి. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలతో మొదలైన ఈ వివాదం చాలా దూరం వెళ్లింది. నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని ట్రూడో ఆరోపించడం, భారత దౌత్యవేత్తను కెనడా బహిష్కరించడంతో వివాదం తారాస్థాయికి వెళ్లింది. కెనడా చర్యలకు ప్రతిగా భారత్ కూడా కెనడియన్ దౌత్యవేత్తను బహిష్కరించింది. ఇదిలా ఉంటే తాగాజా 41 మంది కెనడా దౌత్యవేత్తలను తగ్గించుకోవాలని భారత్ కోరింది.
అమెరికాకు ఇండియా కీలకం:
Also Read
- Salim Dola: టర్కీలో దొరికిన దావూద్ రైట్ హ్యాండ్.. భారత్ మాస్టర్ ప్లాన్ హిట్!
- Cole Thomas Allen: సాఫ్ట్వేర్ డెవలపర్ నుంచి నాసా ఫెలో వరకు.. ట్రంప్ పార్టీలో కాల్పులకు పాల్పడిన కోల్ థామస్ అలెన్ ఎవరు?
- Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..
- Donald Trump: ‘‘మీకే ఎందుకు ఇలా జరుగుతోంది.?’’ కాల్పుల ఘటనపై ట్రంప్ ‘‘లింకన్’’ ఆన్సర్..
ఇదిలా ఉంటే ఈ రెండు దేశాల మధ్య అమెరికాకు భయం పట్టుకుంది. కెనడా , అమెరికాకు మిత్రదేశం, సరిహద్దు దేశం, సాంస్కృతికంగా అనేక సంబంధాలు ఉన్నాయి. మరోవైపు ప్రస్తుతం శరవేగంగా ఎదుగుతున్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్, ఇటీవల కాలంలో అమెరికా, భారత్ బంధం బలపడింది. అయితే కెనడా-భారత్ వివాదంలో భారత్ తో తమ బంధం ఎక్కడ దెబ్బతింటుందో అని అమెరికా భయపడుతోంది. నిజ్జర్ హత్య తర్వాత అమెరికా మాట్లాడుతూ..భారత్ విచారణకు సహకరించాలని కోరుతోంది. అయితే భారత్ మాత్రం అమెరికా సూచల్ని పట్టించుకోవడం లేదు.
ప్రస్తుతం చైనాను అడ్డుకోవాలంటే అమెరికాకు భారత్ ఒక్కటే దారి. భారత్ తో చెడితే చైనాకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉండదని యూఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే కెనడా వివాదం అమెరికాను చిక్కుల్లో పడేస్తోంది. ఇండో-పసిఫిక్ రిజియన్ లో భారత్ చాలా ముఖ్యదేశం. చైనాకు కళ్లెం వేయాలంటే భారత్ అవసరం తప్పనిసరి.ఇక క్వాడ్ కూటమిలో భారత్ తో పాటు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా ఉన్నాయి.
భయపెడుతున్న గత అనుభవం:
అయితే గత అనుభవాలను గుర్తు చేసుకుని అమెరికా భయపడుతోంది. 2018లో యూకేలోని సాలిస్బరీలో మాజీ రష్యన్ గూఢచారి సెర్గీ స్కీపాల్, అతని కుమార్తెను విష ప్రయోగం చేసి చంపారు. అయితే ఈ హత్యల్లో రష్యా పాత్ర ఉందని బ్రిటన్ ఆరోపించింది. 23 మంది రష్యన్ దౌత్యవేత్తలను బహిష్కరించింది. నాటో మిత్రదేశాలు కూడా ఇదే మార్గాన్ని అనుసరించాయి. అమెరికా 60 మంది రష్యన్ దౌత్యవేత్తలను బహిష్కరించింది. మిత్రదేశం యూకేకు మద్దతుగా సియాటెల్ లోని రష్యన్ కాన్సులేట్ మూసేయాలని ఆదేశించింది. దీనికి అంతేస్థాయిలో రష్యా కూడా సెయింట్ పీటర్స్ బర్గ్ లోని యూఎస్ కాన్సులేట్ ని మూసేసింది. అయితే ప్రస్తుతం భారత్, కెనడాల విషయంలో కూడా సరిగ్గా ఇదే జరుగోతుంది. రష్యా వ్యవహారం అంత సీరియస్ పరిస్థితి లేకున్నా.. పరిస్థితులు ఎటుమలుపు తిరుగుతాయో అని బెంగ పడుతోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!