Joe Biden: పిల్లలపై ఇలాంటి ఘోరాలు చూస్తాననుకోలేదు.. హమాస్ దుశ్చర్యపై జో బైడెన్ ఆవేదన
Joe Biden: హమాస్ ఉగ్రవాదుల దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు అని చూడకుండా అత్యంత కిరాతకంగా హత్యలు చేశారు. ఒకే ప్రాంతంలో 40 మంది పిల్లల తలలను తెగనరికారు. ఈ క్రూరమైన దాడితో ఇజ్రాయిల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. హమాస్ని లేకుండా చేసేందుకు పావులు కదుపుతోంది. ఇదిలా ఉంటే ఈ దాడిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Israel-Hamas War: అప్పటి వరకు కుళాయి నీరు రాదు, కరెంట్ ఆన్ కాదు.. హమాస్కి ఇజ్రాయిల్ వార్నింగ్..
Also Read
- Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
- Indonesia: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి
- Trump-King Charles: వైట్హౌస్లో ట్రంప్ను కలిసిన కింగ్ చార్లెస్ దంపతులు
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
ఈ క్రూరమైన దాడిని, పిల్లల తలలు నరికేసే చిత్రాలను జీవితంలో ఎన్నడూ ఊహించలేదని ఆయన వ్యాఖ్యానించారు. హోలోకాస్ట్ తర్వాత యూదులకు ‘ప్రాణాంతక రోజు’గా ఆయన అభివర్ణించారు. చరిత్రలో యూదులకు వ్యతిరేకంగా జరిగిన మారణహోమాన్ని మళ్లీ గుర్తు చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హమాస్ ఉగ్రవాదులు, ఐసిస్ కన్నా అత్యంత దారుణాలకు తెలబడ్డారని బైడెన్ అన్నారు.
అయితే బైడెన్ ఈ చిత్రాలను నేరుగా చూడలేదని, ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు అధికార ప్రతినిధి చేసిన ప్రకటనల ఆధారంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని వైట్ హౌజ్ తెలిపింది. హమాస్ దాడుల్లో ఇప్పటి వరకు 22 మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారని, మరో 17 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని వైట్ హౌజ్ బుధవారం ప్రకటించింది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని యూఎస్ జాతీయ భద్రతా సలహాదారు జాక్ సలీవన్ తెలిపారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: “నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను”.. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
-
Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!