Covid-19: కోవిడ్ 19 గత మూడేళ్లుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. వ్యాక్సినేషన్ డెవలప్ చేసినా కూడా రూపాలు మార్చుకుంటూ కొత్త వేరియంట్ల రూపంలో ప్రజలపై దాడి చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే కోవిడ్ 19 దీర్ఘకాలంలో పలు సమస్యలకు కారణమవుతోంది. మెదడు, జట్టు రాలడం, అంగస్తంభన వంటి అనారోగ్య సమస్యలకు దారి తీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాణాంతక ప్రియాన్ వ్యాధికి కూడా కారణం అవుతోందని, కోవిడ్ 19తో సంబంధం ఉందనే అనుమానం కలుగుతోంది.
S Jaishankar: భారత్-అమెరికా కలిసి పనిచేయడం చాలా అవసరమని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఇరు దేశాల బంధంపై పరిమితి విధించడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు దేశాలు ఒకరికొకరు కావాల్సిన, అనుకూలమైన, సౌకర్యవంతమైన భాగస్వాములుగా ఆయన అభివర్ణించారు. ఇటీవల యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు జైశంకర్ అమెరికా వెళ్లారు. దీంతో పాటు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్, యూఎస్ జాతీయ భద్రతా సలహాదారుతో సమావేశమయ్యారు.
Floods in New York: ఇటీవల ప్రపంచ దేశాలన్నీ వరదలు, భూకంపాలతో అతలాకుతలం అయిపోతున్నాయి. ఇటీవల లిబియాలో సంభవించిన వరతల కారణంగా వేల మంది చనిపోయారు. మొరాకోలో వచ్చిన భూకంపం కారణంగా కూడా కొన్ని వందల మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఇలా ఈ ఏడాది చివరిలో ప్రపంచం మొత్తం మీద ప్రకృతి విలయతాండవం చేస్తోంది. తాజాగా న్యూయార్క్ సిటీని వరదలు ముంచెత్తాయి. శుక్రవారం రాత్రి కుండపోతగా వర్షం కురవడంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. వీధులన్నీ…
S Jaishankar: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అమెరికాలో పర్యటిస్తున్నారు. అక్కడి నేతలతో సమావేశం అవుతున్నారు. ప్రస్తుతం ఇండియా-కెనడాల మధ్య తీవ్ర దౌత్యవివాదం చెలరేగుతున్న సమయంలో జైశంకర్ యూఎస్ పర్యటన చర్చనీయాంశంగా మారింది. ఖలిస్తాన్ ఉగ్రవాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్) ఉగ్రసంస్థ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఇరు దేశాల మధ్య సంబంధాలను ప్రభావితం చేసింది.
New York Sinking: అమెరికాలో అతిపెద్ద నగరం న్యూయార్క్ దాని బరువును మోయలేకపోతోంది. నగరం వేగంగా కూరుకుపోతోంది. అనుకున్నదానికన్నా వేగంగా న్యూయార్క్ సిటీ నేలలోకి కూరుకుపోతున్నట్లు నాసా రిపోర్ట్స్ తెలిపాయి. నగరంలోని లాగ్వార్డియా ఎయిర్పోర్ట్, ఆర్థర్ ఆష్ స్టేడియం, కోని ఐలాండ్ మొదటగా ప్రభావితం అవుతున్నాయని నాసా వెల్లడించింది.
US Visa: భారత్, అమెరికాల మధ్య ఇటీవల కాలంలో బంధం బలపడుతోంది. ఇటీవల కాలంలో భారతదేశానికి అగ్రరాజ్యం పెద్దపీట వేస్తోంది. భారతీయులకు వీసాలను జారీ చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది 10 లక్షల మంది భారతీయులకు అమెరికా వీసాలను మంజూరు అయ్యాయి. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అమెరికా రాయబార కార్యాలయం తన అధికార సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అన్ని రకాల వీసాలు కలిసి…
Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఒకటిన్నరేళ్లు గడుస్తున్నాయి. అయినప్పటికీ ఇరు దేశాల మధ్య యుద్ధం సద్దుమణగలేదు. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలనై పట్టు నిలుపుకునేందుకు రష్యా, ఉక్రెయిన్ ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ కి అమెరికా, యూకే, కెనడా వంటి వెస్ట్రన్ దేశాలు మద్దతు పలుకుతున్నాయి. దీంతో పాటు ఉక్రెయిన్ కి కావాల్సిన ఆయుధ, ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాయి.
North Korea: ప్రపంచం అంతా ఒకలా ఉంటే నార్త్ కొరియా మాత్రం మరోకలా ఉంటుంది. బయటి ప్రపంచంతో అక్కడి ప్రజలకు ఎలాంటి సంబంధాలు ఉండవు. ఫాల్స్ ప్రాపగండాతో ఆ దేశం నడుస్తుంది. అక్కడి కిమ్ జోంగ్ ఉన్ చెప్పిందే చట్టం, చేసిందే న్యాయం. కాదని ఎదురు తిరిగారో కుక్క చావే. అలాంటి దేశంలోకి వేరే దేశం వాళ్లు వెళ్లడం అంటే సింహం నోట్లో తలపెట్టినట్లే. ఇక అమెరికా పౌరుడైతే చావే గతి.
USA: అమెరికాలో ఫిలడెల్ఫియాలో ఘరానా దోపిడి జరిగింది. క్షణాల్లో యాపిల్ స్టోర్లు, ఇతర షాపుల్ని కొల్లగొట్టారు. ఇప్పుడు ఈ దోపిడికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. 100 మందికి పైగా ముసుగులు ధరించిన యువకులు ఫిలడెల్ఫియాలోని సిటీ సెంటర్ షాపుల్లోకి చొరబడి దోచుకున్నారు. మంగళవారం రాత్రి ‘ప్లాష్ మాబ్’ తరహాలో దోపిడికి పాల్పడ్డారు.
Vivek Ramaswamy: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీ రసవత్తంగా మారింది. అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల్లో అభ్యర్థులు తలపడుతున్నారు. ప్రతిపక్ష రిపబ్లిక్ పార్టీలో మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో పాటు ఇండో అమెరికన్ల వివేక్ రామస్వామి, నిక్కీహేలీలు పోటీలో ఉన్నారు. అయితే ఇటీవల వివేక్ రామస్వామి తరుచుగా వార్తల్లో నిలుస్తున్నారు