కార్లలో అమర్చే సాఫ్ట్వేర్ విషయంలో అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కార్లలో చైనీస్ సాఫ్ట్వేర్ను నిషేధించాలని అమెరికా ప్రతిపాదించింది. జాతీయ భద్రతా సమస్యలు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చైనీస్ అభివృద్ధి చేసిన సాఫ్ట్వేర్ను ఇంటర్నెట్తో అనుసంధానించబడి ఉంటుంది.
భారతదేశం నుండి అక్రమంగా తరలించబడిన అమూల్యమైన పురాతన వారసత్వాలను అమెరికా ఇండియాకు తిరిగి ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఈ 297 పురాతన వస్తువులను ప్రధాని మోడీకి అందజేశారు. దీంతో.. 2014 నుండి భారతదేశం నుండి స్వాధీనం చేసుకున్న పురాతన వస్తువుల మొత్తం సంఖ్య 640కి పెరిగింది.
అమెరికా పర్యటనలో సిక్కులపై కాంగ్రెస్ అగ్ర నేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సిక్కులు ఢిల్లీలో నిరసనలు చేపట్టారు. బీజేపీ నేతల తీవ్రంగా తప్పుపట్టారు. తాజాగా అమెరికాలో చేసిన వ్యాఖ్యలపై రాహుల్ స్పందించారు. తన వ్యాఖ్యలపై బీజేపీ పార్టీ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
అగ్రరాజ్యం అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన విద్యార్థి ముత్తిన రమేష్ గుండెపోటుతో మృతిచెందాడు. రమేష్ యూఎస్లో ఎమ్మెస్ డిగ్రీ చదువుతున్నాడు. మృతుడు నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంకు చెందిన వాసిగా గుర్తించారు.
ఈ మధ్య విమానాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. గగనతలంలోకి వెళ్లాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ మధ్య ఓ విమానం ఆకాశంలో తీవ్ర కుదుపులకు గురైంది. దీంతో ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇలాంటి ఘటనలు ఆయా ఎయిర్లైన్స్లో చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అమెరికాలో కూడా భయంకరమైన సంఘటన చోటుచేసుకుంది.
అమెరికాలోని తాజా గణాంకాల ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే వారం జరిగే పాలసీ సమావేశంలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉంది.
అగ్ర రాజ్యం అమెరికాలో 22 అంతస్తుల టవర్ను సెకన్ల వ్యవధిలో కూల్చేశారు. లూసియానాలోని లేక్ చార్లెస్ ప్రాంతంలో పాడుబడిన హెరిటేజ్ టవర్ ఉంది. ఇటీవల తుపాన్కు దెబ్బకు భారీగా నష్టం వాటిల్లింది. అయినా కూడా స్థిరత్వం రాలేదు. దీంతో టవర్ను కూల్చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఏడాది చివరిలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్ష రేసులో డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ పోటీ పడుతున్నారు. ఇద్దరి మధ్య ఫైటింగ్ పోటాపోటీగా ఉంది. నువ్వానేనా? అన్నట్లుగా వార్ నడుస్తోంది.
America Elections : 2024 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తోందని అమెరికా ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ సమాచారం బుధవారం వెలుగులోకి వచ్చింది.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ అమెరికా పర్యటనలో కొంత సమయం జాలిగా గడిపారు. షికాగో సరస్సు తీరంలో సరదాగా సైకిల్ తొక్కారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో అందర్నీ ఆకర్షించింది. కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తనదైన శైలిలో స్పందించారు.