ముంబై పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణాకు అమెరికాలో దారులన్నీ మూసుకుపోయాయి. భారత్కు అప్పగించొద్దంటూ వేసిన పిటిషన్లను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో భారత్కు అప్పగించేందుకు అమెరికాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రత్యేక విమానంలో తహవూర్ రాణాను భారత్కు తరలిస్తున్నట్లు వర్గాలు పేర్కొ్న్నాయి. ఈ రాత్రికి లేదా రేపు తెల్లవారుజామున తహవూర్ రాణా భారత్కు చేరుకోన్నాడు. దీంతో ఢిల్లీలోని తీహార్ జైలు, ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులోని హై-సెక్యూరిటీ సెల్స్ను అప్రమత్తం చేసినట్లు అధికారులు ధృవీకరించారు.
ఇది కూడా చదవండి: Crime: నిన్న భార్య ఆత్మహత్య.. నేడు శవమై కనిపించిన భర్త
ఇటీవల ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించారు. ఆ సమయంలో తహవూర్ రాణాను అప్పగించాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను మోడీ కోరారు. అందుకు ట్రంప్ అంగీకరించారు. ఈ విషయాన్ని సంయుక్త విలేకర్ల సమావేశంలో ట్రంప్-మోడీ తెలిపారు.
2008, నవంబర్లో జరిగిన ముంబై దాడుల్లో తహవూర్ రాణా పాత్ర కీలకమైంది. నిందితుల్లో ఒకరిగా ఉన్నారు. పాకిస్తానీ-అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీకి రాణా సహచరుడు. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధాలు ఉన్నాయని గుర్తించింది. పదేళ్ల నుంచి అమెరికా జైల్లో రాణా మగ్గుతున్నాడు.
ఇది కూడా చదవండి: Land Issue: కమ్మగుడలో ఉద్రిక్తత.. యజమానులను భయభ్రాంతులకు చేసిన భూమాఫియా గ్యాంగ్!