డొమినికన్ బీచ్లో తప్పిపోయిన భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోనంకి ఆచూకీ ఇంకా లభించలేదు. వారం రోజులు అవుతున్నా జాడ మాత్రం దొరకలేదు. ఐదుగురు స్నేహితులతో కలిసి సుదీక్ష విహార యాత్రకు వెళ్లింది. పుంటా కానాలోని రియు రిపబ్లికా రిసార్ట్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఉన్నట్టుండి హఠాత్తుగా మాయమైపోయింది. దీంతో స్నేహితుల సమాచారం మేరకు అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. బోట్లు, హెలికాప్టర్ల ద్వారా గాలింపు చేపట్టారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. రెండేళ్లకు పైగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో మరోసారి ఉక్రెయిన్పై రష్యా వైమానిక దాడులతో విరుచుకుపడింది.
గాజా-ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు మరోసారి తీవ్రమవుతున్నాయి. ఏడాదికిపైగా గాజాపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో సర్వనాశనం అయింది. ఇటీవల అంతర్జాతీయ మధ్యవర్తుల ద్వారా పరిస్థితులు సద్దుమణిగాయి. అంతా బాగున్నాయి అనుకుంటున్న సమయంలో మరోసారి పరిణామాలు తీవ్రమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
భారత సంతతికి చెందిన విద్యార్థిని సుదీక్ష(20) డొమినికన్ రిపబ్లిక్లోని ఓ రిసార్ట్ బీచ్లో హఠాత్తుగా అదృశ్యమైంది. బికినీ ధరించి బీచ్లో నడుస్తుండగా కనిపించకుండా పోయింది. మార్చి 6న స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్లినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. సుదీక్ష తప్పిపోయిన విషయాన్ని స్నేహితులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఆమె కోసం అధికారులు గాలిస్తు్న్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. హమాస్కు మరోసారి తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. బందీలను వెంటనే విడుదల చేయాలని.. లేదంటే అంతు చూస్తానంటూ చివరి హెచ్చరిక జారీ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చారు.
గాజాలో హమాస్ చెరలో బందీలుగా ఉన్న అమెరికా పౌరుల కోసం వైట్హౌస్ రహస్యంగా చర్యలు జరిపినట్లు తెలుస్తోంది. అమెరికన్ బందీలను విడుదల చేయాలని హమాస్ను అమెరికా అధికారులు కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్కు సమాచారం ఇవ్వకుండానే.. ఈ చర్చలు జరిపినట్లుగా సమాచారం.
వైట్హౌస్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య తీవ్రమైన వాగ్యుద్ధం నడిచింది. రష్యాతో యుద్ధం, అలాగే ఖనిజ ఒప్పందాలపై ఇరువురి మధ్య మాటల యుద్ధం నడిచింది.
ఎలాన్ మస్క్ 2002లో అమెరికా పౌరసత్వం పొందారు. చాలాకాలం పాటు ఎలాంటి రాజకీయ పార్టీ ముద్ర పడకుండా ఉన్నారు. ఆయన తనను తాను హాఫ్-డెమొక్రాట్, హాఫ్ రిపబ్లికన్ అనీ, రాజకీయంగా మితవాద, ఇండిపెండెంట్ అంటూ చెప్పుకునేవారు. బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్లకు ఓటు వేశానని, అంతేకాకుండా జో బైడెన్కు అయిష్టంగానే ఓటు వేశానని మస్క్ చెప్పారు. కానీ కొన్నేళ్లుగా ఆయన డోనల్డ్ ట్రంప్కు మద్దతిస్తూ వచ్చారు. ట్రంప్ ప్రచారానికి ప్రధాన మద్దతుదారులలో ఒకరిగా ఉన్నారు.
వైట్హౌస్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్ర వాగ్యుద్ధానికి దిగారు. ఇందుకు ప్రపంచ మీడియా వేదిక అయింది. శాంతి చర్చలు సందర్భంగా ట్రంప్-జెలెన్ స్కీ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడిచింది.
అమెరికాలో జరిగిన రోడ్డుప్రమాదంలో భారతీయ విద్యార్థిని నీలం షిండే (35) పరిస్థితి విషమంగా ఉంది. ఈనెల 14న ఆమె ప్రయాణించిన కారు ప్రమాదానికి గురైంది. అప్పటి నుంచి ఆమె ఐసీయూలో ఉంది.