Iran-Israel: ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణ దాడి.. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున మంటలు
- ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణ దాడి
- మైక్రోసాఫ్ట్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున మంటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య వరుసగా దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్.. ఇజ్రాయెల్పై క్షిపణి దాడులు చేస్తోంది. గురువారం ఇజ్రాయెల్లోని పెద్దాస్పత్రి ధ్వంసం అయింది. తాజాగా బీర్షెబాలో మైక్రోసాఫ్ట్ ఆఫీసు సమీపంలో ఇరాన్ క్షిపణి ఢీకొట్టింది. దీంతో ఆ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
ఇది కూడా చదవండి: Canada: కెనడాలో భారతీయ విద్యార్థిని అనుమానాస్పద మృతి
Also Read
తాజా దాడులతో ఇరు దేశాల మధ్య పరిస్థితులు మరింత ఉధృతంగా మారాయి. దీంతో చాలా మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ఇజ్రాయెల్లోని రెండు నగరాల ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని బేషరతుగా లొంగిపోవాలని ట్రంప్ కోరారు. అందుకు ససేమిరా అన్నారు. ఇక అమెరికా యుద్ధంలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న తరుణంలో రష్యా హెచ్చరించింది. దాడులకు దిగొద్దని కోరింది. దీంతో రెండు వారాల పాటు ట్రంప్ నిర్ణయాన్ని వాయిదా వేశారు.
ఇది కూడా చదవండి: Air India: ఎయిరిండియా కీలక నిర్ణయం. అంతర్జాతీయ సేవలు కుదింపు
ఇక ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. దీంతో మరింత ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. టెహ్రాన్ అణు కార్యక్రమాన్ని నాశనం చేయాలనే లక్ష్యంతో ఖోండాబ్లోని భారీ నీటి పరిశోధన రియాక్టర్ సమీపంలో ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇక అణు కేంద్రం పరిసర ప్రాంత ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోయారు.
ఇక ఇరాన్ క్లస్టర్ మందుగుండు సామగ్రి ఉపయోగిస్తున్నట్లు ఇజ్రాయెల్ భావిస్తోంది. ఇవి వాతావరణంలో పేలి ఎనిమిది కిలోమీటర్ల వ్యాసార్థంలో (4.9 మైళ్ళు) చిన్న క్షిపణులను పంపుతాయి. దీంతోనే ఇజ్రాయెల్లో నష్టం వాటిల్లుతోంది. టెల్ అవీవ్ ప్రాంతంలోని పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!