అమెరికా అధ్యక్షుడు ట్రంప్-రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య గంట పాటు ఫోన్ సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పరిణామాలు గురించి వీరిద్దరి మధ్య చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్పై కూడా చర్చించారు.
అమెరికాలో మరొక యూనివర్సిటీకి ట్రంప్ సర్కా్ర్తో ముప్పు వచ్చి పడింది. ఇప్పటికే హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. యూదులకు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయం పని చేస్తుందంటూ పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. విదేశీ విద్యార్థులను చేర్చుకోకుండా సర్టిఫికేషన్ను రద్దు చేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 12 దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించడాన్ని పూర్తిగా నిషేధిస్తూ కొత్త ప్రకటనపై సంతకం చేశారు. దీనితో పాటు, మరో 7 దేశాల నుంచి వచ్చే వ్యక్తులపై కఠినమైన ఆంక్షలు విధించారు. అమెరికా జాతీయ భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ ట్రంప్ ఈ చర్య తీసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, చాడ్, కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్ వంటి 12…
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు తలెత్తినట్లుగా తెలుస్తోంది. తాజాగా ట్రంప్ సర్కార్పై మస్క్ నిరసన గళం విప్పారు. ఇటీవల ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ట్యాక్స్ బిల్లుకు వ్యతిరేకంగా మస్క్ వ్యతిరేక గళం విప్పారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి షాకిచ్చారు. దేశాలతో చర్చలు జరుగుతుండగానే వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. స్టీల్, అల్యూమినియంపై సుంకాలను 50 శాతానికి పెంచుతూ ట్రంప్ సంతకం చేశారు. పెంచిన సంకాలు నేటి నుంచే అమల్లోకి రానున్నట్లు వైట్హౌస్ ప్రకటించింది.
కొలరాడోలోని బౌల్డర్లో ఆదివారం జరిగిన ఉగ్ర దాడిపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాదంతో సంబంధం ఉన్న వ్యక్తుల వివరాలు సేకరించి వీసాలను రద్దు చేస్తామని హెచ్చరించారు.
గాజాలో ఆదివారం సహాయ పంపిణీ దగ్గర జరిగిన కాల్పుల్లో 31 మంది చనిపోయారు. పదుల కొద్దీ ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆకలితో అలమటిస్తున్న ప్రజలను ఇజ్రాయెల్ ఊచకోత కోసిందంటూ హమాస్ తీవ్ర ఆరోపణలు చేసింది.
అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి ఇజ్రాయెల్ వ్యతిరేకంగా బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఈ సందర్భంగా నిందితుడు పాలస్తీనాకు అనుకూలంగా నినాదాలు చేశాడు. పాలస్తీనాను విడిపించాలని డిమాండ్ చేశాడు.
గాజాలోని సహాయ కేంద్రం దగ్గర జరిగిన కాల్పుల్లో 26 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోగా.. 80 మంది గాయపడ్డారు. ఆకలితో అలమిటిస్తున్న అమాయక ప్రజలను ఇజ్రాయెల్ ఊచకోత కోసిందని హమాస్ ఆరోపించింది. ఆ సహాయ కేంద్రాలు మానవతా సహాయ కేంద్రాలు కాదని.. సామూహిక ఊచకోతలు అని హమాస్ ఆరోపించింది.
ఎలాన్ మస్క్ శకం ముగియలేదని.. ట్రంప్కు సలహాలు ఇస్తూనే ఉంటారని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా ఎలాన్ మస్క్ తన కాలం ముగియడంతో తప్పుకున్నారు.