Jaganmohan Rao CID Investigation: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) స్కామ్పై తెలంగాణ నేర పరిశోధన విభాగం (సీఐడీ) విచారణ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. సీఐడీ కార్యాలయంలో హెచ్సీఏ నిందితుల విచారణ కొనసాగుతోంది. ఐదవ రోజు ఐదుగురు నిందితులను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హెచ్సీఏ ప్రెసిడెంట్గా జగన్మోహన్ రావు దొడ్డిదారిన ఎన్నికైనట్లు సీఐడీ గుర్తించింది. హెచ్సీఏ ఎన్నికల సమయంలో జగన్మోహన్ రావు 23 ఇన్స్టిట్యూషన్స్ ఓట్లను అక్రమంగా వేయించుకున్నట్లు…
HCA Meeting: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) కీలక సమావేశం నేపథ్యంలో ఉప్పల్ క్రికెట్ స్టేడియం వద్ద భద్రత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్లో భాగంగా, అనుమతులు లేని వ్యక్తుల ప్రవేశాన్ని నిరోధించేందుకు పోలీస్ యంత్రాంగం ముందస్తుగా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుదీర్ బాబు స్వయంగా ఉప్పల్ స్టేడియానికి చేరుకొని భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. సమావేశంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీస్ బలగాలను మోహరించారు. Read…
హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్. ఐపీఎల్ 2025 కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చేసిన షార్ట్లిస్ట్ జాబితాలో హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా ఉంది. ఐపీఎల్ 2025లో మిగిలిన 16 మ్యాచ్ల కోసం బీసీసీఐ మూడు వేదికలను షార్ట్లిస్ట్ చేయగా.. లిస్ట్లో బెంగళూరు, చెన్నై సహా హైదరాబాద్ కూడా ఉంది. అయితే ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. భారత ప్రభుత్వం అనుమతి ఇస్తే.. ఈ మూడు నగరాల్లో…
అజారుద్దీన్ కి హైకోర్టులో ఊరట లభించింది. ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్కి అజారుద్దీన్ పేరు తొలగించవద్దని హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్ క్రికెట్ సంఘంకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హెచ్సీఏను హైకోర్టు ఆదేశించింది. నార్త్ స్టాండ్స్కు ఉన్న అజహరుద్దీన్ పేరు తొలగించాలని గత వారం హెచ్సీఏ అంబుడ్స్మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆదేశాలు జారీ చేశారు. Also Read:Rain Alert: విశాఖకు వర్ష సూచన.. సింహాచలంలో వేగంగా దర్శనాలు తన…
పహల్గాం సమీప బైసరన్ లోయలో ఉగ్రవాదులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు.. పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఉగ్రదాడికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యులు తప్పకుండా భారీ మూల్యం చెల్లించుకుంటారని సోషల్ మీడియాలో భారతీయలు పోస్టులు పెడుతున్నారు. ఉగ్రదాడికి వ్యతిరేకంగా నేడు ఐపీఎల్ ప్లేయర్స్ నల్ల రిబ్బన్లతో…
Tilak Varma: హైదరాబాద్కు చెందిన యువ క్రికెటర్ తిలక్ వర్మ తన అద్భుతమైన బ్యాటింగ్తో ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL), టి20 లలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆటగాడు. 2022లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేసిన తిలక్ తన దూకుడు, స్థిరతతో చాలామంది అభిమానులను సంపాదించాడు. ఇకపోతే ఐపీఎల్ 2025లో భాగంగా బుధవారం నాడు హైదరాబాదులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడబోతున్నాయి.…
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్కు బిగ్షాక్ ఇచ్చింది.. ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్కు అజారుద్దీన్ పేరు తొలగించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. హెచ్సీఏకు అంబుడ్స్మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఈ ఆదేశాలు జారీ చేశారు.. తాజాగా ఈ అంశంపై అజారుద్దీన్ స్పందించారు. ఈ అంశాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.
ఇటీవలి కాలంలో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) పేరు నిత్యం వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. గతంలో మహిళా జట్టు విషయంలో, ఇప్పుడు ఐపీఎల్ 2025 టిక్కెట్ల విషయంలో హెచ్సీఏ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోయింది. తాజాగా మరోసారి హెచ్సీఏ పేరు తెరపైకి వచ్చింది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం నార్త్ స్టాండ్ పేరు విషయంలో హెచ్సీఏ సమస్య ఎదుర్కొంటోంది. స్టేడియంలోని నార్త్ స్టాండ్ పేరు ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఉప్పల్ స్టేడియంలోని నార్త్ స్టాండ్కు…
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్కు బిగ్షాక్ ఇచ్చింది.. ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్కు అజారుద్దీన్ పేరు తొలగించాలని ఆదేశించింది. హెచ్సీఏకు అంబుడ్స్మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఈ ఆదేశాలు జారీ చేశారు.. లార్డ్స్ క్రికెట్ క్లబ్ వేసిన పిటిషన్పై అంబుడ్స్మన్ విచారణ చేపట్టారు..హైదరాబాద్ క్రికెట్ సంఘం ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో తన పేరు పెట్టుకోవాలని అజార్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నట్లు గుర్తించారు. దీంతో విచారణ చేపట్టి వెంటనే ఆ పేరును తొలగించారు.
తండ్రుల అధికారాన్ని అడ్డంపెట్టుకుని కొడుకులు అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఘటనలు ఇదివరకు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే రీతిలో హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు సునీల్ అగర్వాల్ కొడుకు హంగామా చేశాడు. ఉప్పల్ స్టేడియంలో సునీల్ కొడుకు ఖుష్ అగర్వాల్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. క్రికెటర్లతో ఫొటోలు.. ఏకంగా తండ్రి చైర్లోనే కూర్చుని స్టేడియంలో సమావేశాలు.. గేట్ దగ్గర నుంచి వీఐపీ ట్రీట్మెంట్.. స్టేడియంలోని పలు ప్రదేశాల్లో రీల్స్ చేస్తూ హల్ చల్ చేశాడు. Also…