Messi Match: మెస్సీ ఫుట్బాల్ ఈవెంట్కు కట్టుదిట్టమైన భద్రత.. మోస్ట్ అడ్వాన్స్డ్ డ్రోన్లతో నిఘా
- మెస్సీకి Z కేటగిరీ భద్రత: రాచకొండ సీపీ
- పాస్లున్నవారికే స్టేడియంలో ప్రవేశం
- 450 సీసీ కెమెరాలు, డ్రోన్లతో స్టేడియం నిఘా
- భద్రతా కారణాలతో ఫోన్ లకు మాత్రమే అనుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Messi Match: రేపు ఉప్పల్ స్టేడియంలో జరగబోయే అంతర్జాతీయ ఫుట్బాల్ ఈవెంట్ కోసం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ (సీపీ) సుధీర్ బాబు వెల్లడించారు. ఈవెంట్కు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. మెస్సీకి Z కేటగిరీ భద్రత కల్పిస్తున్నామని, ఆయన్ని గ్రీన్ ఛానల్ ద్వారా స్టేడియంకు తీసుకువస్తామని సీపీ తెలిపారు. అయితే, వాహనంలో ఉన్నప్పుడు కూడా మెస్సీని చూసే అవకాశం ప్రేక్షకులకు ఉండదని, కాబట్టి అనవసరంగా రోడ్డుపైకి వచ్చి చూసే ప్రయత్నం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
Nitish Kumar Reddy: నితీశ్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్.. అయినా ఆంధ్రకు నిరాశే!
Also Read
- Jagtial: జగిత్యాల జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య సవాళ్లు.. పట్టణంలో పోస్టర్లు కలకలం
- TGSRTC JAC: ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై మళ్లీ ఉద్రిక్తత.. నిరసనలకు సిద్ధమైన జేఏసీ
- Uttam Kumar Reddy : రైతులకు శుభవార్త.. అధికారులకు మంత్రి ఉత్తమ్ అల్టిమేటం..!
- TGIIC Auction : హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఆల్టైమ్ రికార్డు..!
స్టేడియం సామర్థ్యం 39 వేలు అని, దానికి తగ్గట్టుగానే నిర్వాహకులు పాస్లు అమ్ముతున్నారని, అయితే స్టేడియం దగ్గర ఎలాంటి పాస్లు అమ్మబడవని, కేవలం ఆన్లైన్ లోనే పాస్లు అమ్మబడతాయని క్లారిటీ ఇచ్చారు. పాసులు ఉన్నవారు మాత్రమే రావాలని, లేనివారు స్టేడియం వద్దకు రావద్దని స్పష్టం చేశారు సీపీ. భద్రత కోసం స్టేడియం పరిసరాల్లో 450 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తామని తెలిపారు. అంతేకాకుండా, మోస్ట్ అడ్వాన్స్డ్ డ్రోన్లతో కూడా నిఘా పెడుతున్నట్లు చెప్పారు. రేపు సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుందని, సాయంత్రం 4 గంటల నుంచే ప్రేక్షకులను లోపలికి అనుమతిస్తామని సీపీ పేర్కొన్నారు.
మెస్సీ కొద్దిసేపు మాత్రమే ఆడతారు కాబట్టి, ప్రేక్షకులు ముందస్తుగానే స్టేడియం చేరుకోవాలని సూచించారు. భద్రతా కారణాల దృష్ట్యా, ల్యాప్ టాప్లు, బ్యానర్లు, వాటర్ బాటిళ్లు, కెమెరాలు, సిగరెట్లు, గొడుగులు, లైటర్లు, బైనాకులర్లు, బ్యాటరీలు, షార్ప్ ఆబ్జెక్ట్స్, హెల్మెట్, బ్యాగ్ వంటి వస్తువులకు స్టేడియం లోపలికి అనుమతి లేదని, కేవలం మొబైల్ ఫోన్లను మాత్రమే అనుమతిస్తున్నట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: “రెండు సెంచరీలు మిస్.. ఫీల్ అవుతున్నావా?”.. క్వాలిఫయర్ 2కు ముందు వైభవ్ ఆసక్తికర సమాధానం..
-
Vaibhav Sooryavanshi: ఇది గమనించారా? SRHపై వైభవ్ కొట్టిన 12 సిక్సర్లలో ఓ కామన్ పాయింట్ ఉందండోయ్..
-
Vaibhav Sooryavanshi Warning: అదే అటాకింగ్ గేమ్ ఆడుతా.. గుజరాత్ టైటాన్స్కు వైభవ్ సూర్యవంశీ స్ట్రాంగ్ వార్నింగ్!
-
Vaibhav Sooryavanshi: ‘ఇది చాలా అవమానకరం’.. వైభవ్ సూర్యవంశీని అతడితో పోల్చడం ఏంటి?
-
Rocket Explosion: బ్లూ ఆరిజిన్కు భారీ షాక్.. న్యూ గ్లెన్ రాకెట్ పరీక్షలో భారీ పేలుడు.!
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!