Bomb Threat For Taj Mahal: ప్రపంచంలోనే అత్యంత అందమైన కట్టడాలలో ఒకటి, ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటైన తాజ్ మహల్కు మంగళవారం బాంబు బెదిరింపు వచ్చింది. ఇందుకు సంబంధించి ఓ బెదిరింపు మెయిల్ను పర్యాటక శాఖకు పంపారు. ఈ ముప్పుతో తాజ్ మహల్ చుట్టూ భద్రతను పెంచారు. మరోవైపు, తాజ్ మహల్ లోపల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇందులో తాజ్ మహల్ సెక్యూరిటీ పోలీసులు, ఇతరత్రా సిబ్బంది కూడా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మరోవైపు మెయిల్…
ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో మహిళా కానిస్టేబుల్పై దాడి జరిగింది. ఈ ఫైట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళా కానిస్టేబుల్ సివిల్ డ్రెస్లో రోడ్డుపై వెళ్తోంది. బైక్ పై వచ్చిన ఓ వ్యక్తి ఆమెతో మాట్లాడాడు. కొంత సేపు వాదించుకున్న తర్వాత ఆ వ్యక్తి ఆమెపై భౌతిక దాడికి దిగాడు. ఈ ఘటనపై కేసు నమోదైంది.
దేశ రాజధాని ఢిల్లీ సమీప ప్రాంతంలో ఏడేళ్ల వయసులో కిడ్నాపైన బాలుడు.. 30 ఏళ్ల తర్వాత ప్రత్యక్షమయ్యాడు. క్షేమంగా పోలీసులు ఇంటికి చేర్చారు. ప్రస్తుతం అతడి వయసు 37 ఏళ్లు.
నిదానమే ప్రదానం అన్నారు పెద్దలు. ఎవడి దారిన వాడు పోతే ఇబ్బంది ఉండదు. అంతేకానీ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే.. ఎవడికైనా తిక్క రేగుతుంది. ఈ స్టోరీ చదివితే.. లేపి తన్నించుకోవడం అంటే ఇదేనేమో అనిపిస్తోంది.
యూపీలో విషాదం చోటు చేసుకుంది. హత్రాస్ జిల్లాలోని భోజ్పూర్ ఖెత్సీ గ్రామానికి చెందిన ఓ యువకుడు పెళ్లికి ఒకరోజు ముందు గుండెపోటుతో మరణించాడు. అకస్మాత్తుగా కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ చనిపోయినట్లు చెప్పారు. దీంతో.. కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరోవైపు.. వధువు ఇంట్లోనూ విషాద ఛాయలు అలముకున్నాయి. కాబోయే భర్త మరణవార్త విన్న వధువు అపస్మారక స్థితికి చేరుకుంది.
విద్యార్థుల ఆందోళనలతో ఉత్తరప్రదేశ్లో యోగి ప్రభుత్వం దిగొచ్చింది. విద్యార్థుల డిమాండ్లకు తలొగ్గింది. యూపీపీఎస్సీ పరీక్షలను ఒకే రోజులో నిర్వహించాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు.
Delhi : వాతావరణంలో నిరంతర మార్పులు కనిపిస్తున్నాయి. పర్వతాలపై తాజా హిమపాతం శీతాకాలం ప్రారంభమైంది. మైదాన ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలో తగ్గుదల కనిపించింది.