Psycho killer: సైకో కిల్లర్ కథ.. స్త్రీలే టార్గెట్.. రక్తం వచ్చేలా దాడి చేస్తాడు.. కుదిరితే చంపేస్తాడు
- యూపీలోని గోరఖ్పూర్లో పట్టుబడ్డ 'సైకో కిల్లర్'
- అజయ్ నిషాద్ గురించి షాకింగ్ విషయాలు
- కేవలం మహిళలపైనే దాడి
- స్త్రీలను హింసిస్తూ.. సంతోషించే నిందితుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని గోరఖ్పూర్లో పట్టుబడ్డ ‘సైకో కిల్లర్’ అజయ్ నిషాద్ గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతను మహిళలను చాలా ద్వేషిస్తాడని తెలిసింది. స్త్రీలను హింసించడం, వాళ్ల రక్తం వచ్చేలా దాడి చేయడం ద్వారా ఆనందిస్తాడట. వాస్తవానికి.. నిన్న గోరఖ్పూర్లోని ఝంఘా పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన అజయ్ నిషాద్ను అరెస్టు చేశారు. గత నాలుగు నెలలుగా ఇదే తరహాలో నేరాలకు పాల్పడుతూ ఆ ప్రాంతంలో భయాందోళనలు సృష్టించాడు నిషాద్. ఒకరిద్దరు కాదు ఐదుగురు మహిళలపై కర్రలు/రాడ్లు లేదా పదునైన ఆయుధాలతో దాడి చేశాడు. అతని దాడిలో ఒక మహిళ కూడా మరణించింది.
స్త్రీలు బాధ పడుతుంటే నాకు నచ్చుతుంది: అజయ్ నిషాద్
ఈ మొత్తం విషయాన్ని గోరఖ్పూర్ ఎస్పీ (నార్త్) జితేంద్ర కుమార్ శ్రీవాస్తవ వెల్లడిస్తూ.. అజయ్ నిషాద్ సీరియల్ కిల్లర్ కాదని.. కేవలం మహిళలను గాయపరిచేవాడు అని అన్నారు. ఈ యువకుడి దాడిలో మహిళ చికిత్స పొందుతూ మరణించిందన్నారు. అయితే.. ఆ ఘటనలు చేసే తీరు చూసి జనాలు అతడిని ‘సీరియల్ కిల్లర్’, ‘సైకో కిల్లర్’ అని పిలుస్తున్నారన్నారు. ” నేను మహిళలపై దాడి చేసినప్పుడు.. వారు నొప్పితో మూలుగుతారు. కేకలు వేస్తూ.. ఏడుస్తారు. స్త్రీల బాధలు, వారి శరీరంలోంచి రక్తం ప్రవహించడం నాకు చాలా నచ్చుతుంది. కుదిరితే వాళ్లని చంపేయాలని పిస్తుంది ” అని నిందితుడు అజయ్ నిషాద్ పోలీసుల విచారణలో పేర్కొన్నాడు. దాడి తర్వాత నిందితుడు తన ప్రియురాలితో కూడా మాట్లాడని పోలీసులు తెలిపారు. ఈ అయిదు ఘటనల్లోనూ దాడి తర్వాత, అతను అర్ధరాత్రి తన ప్రియురాలితో మాట్లాడుతున్నట్లు రికార్డులో కనుగొన్నారు. సంఘటనా స్థలంలో తీరుతూనే మాట్లాడేవాడట.
Also Read
- Ganja Smuggling : శంషాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టురట్టు..
- Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
- Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
అజయ్ నిషాద్ గురించి సంచలన విషయాలు..
నిందితుడు అజయ్ నిషాద్కు ఉత్తరాఖండ్కు చెందిన ప్రియురాలు సోషల్ మీడియా ద్వారా పరిచయమైంది. ఆమెను కలవడానికి అజయ్ డెహ్రాడూన్ వెళ్లేవాడు. అయితే.. అజయ్ హైస్కూల్ వరకు చదువుకున్నాడు. ఇప్పటికీ ఒంటరిగా ఉన్నాడు. కొంతకాలం క్రితం గుజరాత్లోని సూరత్లో పీఓపీని ఇన్స్టాల్ చేసేవాడు. గత నవంబర్ 4న ఛత్ పూజ కోసం ఇంటికి వచ్చాడు. అజయ్ శనివారాల్లో నల్లటి దుస్తులు ధరించి నేరం చేసిన తర్వాత పరారీలో ఉండేవాడు. తప్పించుకోవడం తేలికవుతుందని చెప్పులు లేకుండానే నేరం చేసేవాడు. అజయ్ ముందుగా టార్గెట్ నిర్ణయించుకోడు. అతను అర్ధరాత్రి చుట్టూ తిరుగుతూ.. జనసాంద్రతకు దూరంగా ఉన్న ఇళ్ల కోసం వెతుకుతున్నాడు. సులభంగా దూరే ఇంటిని ఎంచుకుంటాడు. అర్ధరాత్రి దాటిన తర్వాతే దాడి చేసేవాడు.
తాజావార్తలు
-
US Airstrike on Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రం.. 24 గంటల్లో రెండోసారి ఇరాన్పై అమెరికా వైమానిక దాడి
-
Astrology: సమస్యలు వచ్చినా భయపడని 4 రాశులు వీరేనా? ఎంత కష్టమైనా ధైర్యంగా ఎదుర్కొంటారట!
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!