ఉత్తరప్రదేశ్లోని మధురలోని మహావన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాపర్పూర్ గ్రామంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోయి ఉండడం తీవ్ర కలకలం రేపింది.
తెలిసీ తెలియని వయసు. ఆ వయసులో ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. పెద్దోళ్లు చెబితే వినే పరిస్థితి కాదు. చివరికి ముగ్గురు తోబుట్టువుల ప్రాణాలు ఒకేసారి పోయాయి. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో చోటుచేసుకుంది. అసలు ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవండి.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చిన్నారులతో చాలా సరదాగా గడుపుతుంటారు. ఎక్కడికెళ్లినా చిన్నారులు కనిపించారంటే చాక్లెట్లు ఇస్తుంటారు. ఆ మధ్య ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఒక బుడ్డోడితో మాట్లాడుతూ ఏం కావాలని అడిగితే ముఖ్యమంత్రి చెవిలో ‘చిప్స్’ కావాలని అడిగాడు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అయింది.
వాళ్లిద్దరూ తొమ్మిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మొత్తానికి ప్రేమ ఫలించి రెండు నెలల క్రితం ఏడడుగులు వేశారు. ఇంతలోనే ఇద్దరి మధ్య ఏం జరిగిందో.. ఏమో తెలియదు గానీ భర్తను ఇల్లాలు కాటికి పంపేసింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని బరేలీలో జరిగింది.
Shocking: ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వినయ్ సింగ్ అనే వ్యక్తి తన సహోద్యోగి, ప్రియురాలు అయిన మింకీ శర్మ(32) తన పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతో దారుణంగా హత్య చేశారు. వీరిద్దరు ఒకే ఆఫీసులో కలిసి పని చేస్తున్నారు. మింకీ శర్మ హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తోది.
భార్యాభర్తల సంబంధాలు రోజురోజుకి దిగజారిపోతున్నాయి. క్షణిక సుఖం కోసం కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. సమాజం ఏమనుకుంటుందన్న ఇంకిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది.
రిపబ్లిక్ డేకు ముందు పాఠశాలలకు బెదిరింపులు రావడం నోయిడాలో తీవ్ర కలకలం రేపుతోంది. నోయిడాలోని పలు స్కూళ్లకు ఈ-మెయిల్ ద్వారా బాంబ్ బెదిరింపులు వచ్చాయి. దీంతో పాఠశాలల యాజమాన్యాలు అప్రమత్తమై పిల్లలను ఇంటికి పంపేశారు.
ఉత్తరప్రదేశ్లో విమాన ప్రమాదం జరిగింది. భారత వైమానిక దళానికి చెందిన శిక్షణ విమానం ప్రయాగ్రాజ్లో కూలిపోయింది. బమ్రౌలికి చెందిన విమానం బుధవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రయాగ్రాజ్లోని రాంబాగ్ ప్రాంతంలోని చెరువులో కూలిపోయింది. ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు.
భారతదేశంలో వివాహ వ్యవస్థకు ప్రత్యేక స్థానం ఉంది. ఒకే భార్య.. ఒకే భర్త అన్న సాంప్రదాయం ఉంది. ఇక వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాక చచ్చేంత వరకు కలిసి ఉండాలి. ఇదే పద్ధతి దేశంలో కొనసాగుతోంది. కానీ నేటి ఆధునిక యుగంలో ఆ బంధానికి విలువ లేకుండా పోయింది.