ఉత్తరప్రదేశ్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు కాలువలో పడింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన మధురలో చోటుచేసుకుంది.
మధురలోని మాగోర్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగ్లా దైవియా సమీపంలో వేగంగా వస్తున్న మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు అదుపు తప్పి కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు. నలుగురు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారిగా భావిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం పంపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Macron: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కలిసిన బాలీవుడ్ నటులు.. ఫొటోలు వైరల్
మృతులు రాహుల్ వర్మ, అమిత్, మోహిత్, గుర్తు తెలియని యువకుడిగా గుర్తించారు. రాహుల్ వర్మ (23) మహావన్ లోని బల్దేవ్ ఘర్ పరిసరాల్లో నివసిస్తూ దర్జీగా పనిచేస్తున్నాడు. అమిత్ (23) మహావన్ లోని ప్రేమ్ నగర్ కలాన్కు చెందిన విద్యార్థి. మోహిత్ (22) మహావన్ లోని బల్దేవ్ ఘర్ ప్రాంతానికి చెందిన న్యాయ విద్యార్థి. మరొకరి గురించి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..UP 85 CV 9856 నంబర్ గల కారు రాహుల్ వర్మ సోదరుడు అడ్వకేట్ సజ్జన్ సింగ్కు చెందింది. నలుగురు యువకులు బుధవారం సాయంత్రం 6:30-7:00 గంటల మధ్య మహావన్ నుంచి బయలుదేరి ఒక కార్యక్రమానికి వెళుతున్నారు. ఈ క్రమంలో కాలువలో పడింది. బిడ్డలు విగతజీవులుగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Pixel 10a India Launch: భారత్లో గూగుల్ ‘పిక్సెల్ 10ఏ’ విడుదల.. 5100mAh బ్యాటరీ, 48MP కెమెరా!