UP: రక్తసంబంధానికి మాయని మచ్చ.. హత్య వెనుక అమానుషం.. వీడిన లక్నో మర్డర్ మిస్టరీ
- ఉత్తరప్రదేశ్లోని లక్నోలో దారుణం
- మర్డర్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
- విస్తుపోయిన స్థానికులు, పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘‘మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు’’ సమాజంలో జరుగుతున్న దుర్మార్గాలను చూసి చలించి తెలంగాణ కవి అందెశ్రీ రాసిన గేయం. అచ్చం అదే మాదిరిగా తాజా పరిణామాలు జరుగుతున్నాయి. ఏ తల్లిదండ్రులైనా కడుపున పుట్టిన బిడ్డలు ప్రయోజకులు కావాలని కోరుకుంటారు. అదే ఆ తండ్రికి శాపమైంది. బుద్ధిగా చదువుకోమని చెప్పడమే పాపమైంది. ఆ మాట కొడుకును రాక్షసుడిలా మార్చింది. రక్తసంబంధాన్ని మరిచి అత్యంత దారుణంగా తండ్రిని చంపి ముక్కలు.. ముక్కలు చేసి విసిరేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగింది. నాలుగు రోజుల మిస్టరీని ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
ఇది కూడా చదవండి: Virosh Wedding: విజయ్-రష్మిక పెళ్లి సంబరాలు షురూ.. “విరోష్” థీమ్తో ప్రీ వెడ్డింగ్ ఫొటోలు చూశారా!
Also Read
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
- Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
- Teacher Murder: 30 సెకన్లలో 30సార్లు పొడిచి హత్య చేశాడు..రక్తపు మరకలతో నిండిపోయిన టీచర్ శరీరం!
మన్వేంద్ర సింగ్ పాథాలజీ ఆపరేటర్. ఉత్తరప్రదేశ్లోని లక్నోలోని ఆషియానా ప్రాంతంలో కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. కుమారుడు అక్షత్ ప్రతాప్ సింగ్ (19) చదువు విషయంలో నిరంతరం ఇంట్లో తగాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 20న తెల్లవారుజామున నీట్ పరీక్ష కోసం బాగా చదువుకోవాలని తండ్రి చెప్పాడు. అయితే కుమారుడు ఏం సమాధానం ఇచ్చాడో.. ఏమో తెలియదు గానీ కోపంలో ఉన్న తండ్రి తన లైసెన్స్ తుపాకీ తీసి బెదిరించాడు. అయితే కొడుకు చదువుకుంటానని.. శాంతించమని అడగడంతో తుపాకీని పక్కన పెట్టాడు. అంతే అదే అదునుగా భావించిన అక్షత్ ప్రతాప్ సింగ్.. వెంటనే తుపాకీ తీసుకుని తండ్రి ఛాతీలోకి గురిపెట్టి కాల్చాడు. దీంతో అక్కడికక్కడే మన్వేంద్ర సింగ్ ప్రాణాలు కోల్పోయాడు. ఇంట్లో కాల్పుల శబ్దం విన్న 11వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల కూతురు అంతస్తు నుంచి కిందకు దిగి వచ్చింది. తండ్రి రక్తపుమడుగులో ఉండటాన్ని చూసి సోదరుడిని ప్రశ్నించింది. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో భయంతో ఆమె ఎవరికీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది.
అయితే మన్వేంద్ర సింగ్ తప్పిపోయినట్లుగా ఫిబ్రవరి 20న ఆషియానా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి కుటుంబ సభ్యుల్ని విచారించారు. కుమారుడిని కూడా పలుమార్లు విచారించారు. పొంతన లేని సమాధానాలు ఇచ్చాడు. దీంతో అనుమానం వచ్చి గట్టిగా నిలదీయడంతో నేరాన్ని ఒప్పుకున్నాడు. ఫిబ్రవరి 20న తెల్లవారుజామున 4:30 గంటలకు తండ్రితో జరిగిన గొడవలో తుపాకీతో కాల్చి చంపినట్లుగా ఒప్పుకున్నాడు.
అయితే ఆధారాలు నాశనం చేసేందుకు తండ్రిని ముక్కలు.. ముక్కలుగా కోసి కొన్ని ప్రాంతాల్లో విసిరేశాడు. మరికొన్ని ముక్కలను అంతస్తు కింద ఉన్న గ్రౌండ్ ఫ్లోర్లోని ఖాళీ గదిలో డ్రమ్లో దాచి పెట్టాడు. జనసంచారం లేని సమయంలో డ్రమ్మును పడేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో పోలీసులు డ్రమ్మును కనుగొని స్వాధీనం చేసుకున్నారు.
చదువుకోమని ఒత్తిడి తేవడంతో కుమారుడుడు అక్షత్ ప్రతాప్ సింగ్ విసిగిపోయాడని డీసీపీ సెంట్రల్ విక్రాంత్ వీర్ తెలిపారు. నిత్యం తండ్రి తిట్టడంతో తట్టుకోలేక చంపినట్లుగా డీసీపీ వెల్లడించారు. అన్ని ఆధారాలను సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రక్తసంబంధానికి మాయని మచ్చగా మిగిలిపోయింది.
- Tags
- Drum case
- father killed
- Lucknow
- son
- UP
తాజావార్తలు
-
Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్గా రిషభ్ పంత్..
-
Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
-
Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
ట్రెండింగ్
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!