Akhilesh: అఖిలేష్ యాదవ్ బిగ్ ప్లాన్.. యూపీ ఎన్నికల కోసం ఐ-ప్యాక్తో డీల్
- ఎన్నికల కోసం అఖిలేష్ యాదవ్ బిగ్ ప్లాన్
- ఐ-ప్యాక్తో డీల్ కుదుర్చుకున్న అఖిలేష్ యాదవ్
- వచ్చే ఏడాదే యూపీ ఎన్నికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్వరలో దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో కీలక ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల తర్వాత దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో 2027 ప్రారంభంలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు ఇప్పటికే ఎత్తులు.. పైఎత్తులు వేస్తున్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు యోగి ప్రభుత్వం నడుస్తోంది. ఈ సారైనా అధికారం చేజిక్కించుకోవాలని అఖిలేష్ యాదవ్, మాయావతి ప్రణాళికలు రచిస్తున్నారు.
ఈ క్రమంలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ బారీ స్కెచ్ వేశారు. ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సూచన మేరకు ఐ-ప్యాక్తో అఖిలేష్ యాదవ్ ఒప్పందం కుదుర్చుకున్నారు.
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
పార్టీ ప్రచారాన్ని జిల్లా, బూత్ స్థాయిలో తీసుకెళ్లేందుకు ఐ-ప్యాక్ను నియమించుకున్నట్లుగా అఖిలేష్ యాదవ్ తెలిపారు. ఐ-ప్యాక్ను నియమించుకోవాలని స్టాలిన్, మమతా బెనర్జీ సలహా ఇచ్చారని చెప్పారు. ఇక ఐ-ప్యాక్ సూచన మేరకు మార్చి 28న ఎన్నికల సమర శంఖారావం పూరించాలని నిర్ణయం తీసుకున్నారు. నోయిడా ర్యాలీతో అఖిలేష్ యాదవ్ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజలను కలవనున్నారు.
ఇది కూడా చదవండి: Bihar: బీహార్లో దారుణం.. వరుడి ముందే వధువును గన్తో కాల్చిన ప్రియుడు
ఐ-ప్యాక్… ప్రముఖ రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ. ఈ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎస్పీ జాతీయ ఉపాధ్యక్షుడు కిరోన్మోయ్ నందా వెల్లడించారు. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (I-PAC) ను ప్రశాంత్ కిషోర్ స్థాపించారు. ప్రస్తుతం దీనికి ప్రతీక్ జైన్ నాయకత్వం వహిస్తున్నారు. కీలక వ్యూహకర్తగా.. నాయకుడిగా పనిచేస్తున్నారు. ఇక 2022 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ 111 సీట్లు గెలుచుకుంది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ 37 సీట్లు గెలుచుకుంది.
ఇది కూడా చదవండి: UP: ఘజియాబాద్ పాఠశాలలో చిరుత హల్చల్.. విద్యార్థులు బెంబేలు.. వీడియో వైరల్
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!