Mayawati: ఢిల్లీలో మాయావతికి ప్రత్యేక బంగ్లా కేటాయింపు.. పొత్తుల పుకార్లపై క్లారిటీ
- ఢిల్లీలో మాయావతికి ప్రత్యేక బంగ్లా కేటాయింపు
- ఎన్డీఏలో చేరుతున్నారంటూ వదంతులు
- ప్రత్యర్థుల పుకార్లపై మాయావతి క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ వ్యూహాలు మారుతున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా బీఎస్పీ అధినేత్రి మాయావతికి దేశ రాజధాని ఢిల్లీలో టైప్-8 బంగ్లాను కేంద్రం కేటాయించింది. టైప్-8 బంగ్లాలను కేవలం కేంద్రమంత్రులు, మాజీ ఉపరాష్ట్రపతులకు కేటాయిస్తారు. అలాంటి టైప్-8 బంగ్లాను తాజాగా మాయావతికి కేటాయించడంపై పొలిటికల్గా రకరకాలుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. వదంతులు వ్యాప్తి చెందడంతో మాయావతి రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Iran-US: ట్రంప్నకు ఖమేనీ సవాల్.. అమెరికా యుద్ధ నౌకను సముద్రంలోనే ముంచేస్తామని వార్నింగ్
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీలో టైప్-8 బంగ్లాను కేటాయించారని.. ఇందులో ఎలాంటి వ్యూహాలు లేవని మాయావతి స్పష్టం చేశారు. తప్పుడు పుకార్లను కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది జరిగే ఎన్నికల వ్యూహాన్ని తెలియజేశారు. ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. ఎన్డీఏ కూటమిలో చేరబోతున్నారంటూ వస్తున్న వార్తలను కార్యకర్తలెవరూ నమ్మొద్దని సూచించారు. అవి తప్పుదారి పట్టించేవి.. నిరాధారమైనవిగా కొట్టిపారేశారు. తప్పుడు వార్తలను పక్కకు పెట్టి ముందుకు సాగిపోవాలని విజ్ఞప్తి చేశారు. 2007లో మాదిరిగానే రాష్ట్రంలో పూర్తి మెజారిటీతో కూడిన బీఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యం అని చెప్పారు.
ఇది కూడా చదవండి: Silver Rates: వెండి పతనం.. ఈరోజు ఎంత తగ్గిందంటే..!
కేవలం కార్యకర్తల దృష్టి మరల్చడానికే ఇలాంటి పుకార్లు ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చేస్తున్నారన్నారు. బీఎస్పీ ఎప్పుడూ తన సొంత బలాన్నినమ్ముకుంటుందని.. ఎవరి మద్దతు లేకుండా ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టంగా పేర్కొన్నారు. కార్యకర్తలంతా ఏనుగులా నడవాలని విజ్ఞప్తి చేశారు. దయచేసి బంగ్లాకు సంబంధించి ఎలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని ప్రత్యర్థులకు మాయావతి సూచించారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..