Mayawati: ఢిల్లీలో మాయావతికి ప్రత్యేక బంగ్లా కేటాయింపు.. పొత్తుల పుకార్లపై క్లారిటీ
- ఢిల్లీలో మాయావతికి ప్రత్యేక బంగ్లా కేటాయింపు
- ఎన్డీఏలో చేరుతున్నారంటూ వదంతులు
- ప్రత్యర్థుల పుకార్లపై మాయావతి క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ వ్యూహాలు మారుతున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా బీఎస్పీ అధినేత్రి మాయావతికి దేశ రాజధాని ఢిల్లీలో టైప్-8 బంగ్లాను కేంద్రం కేటాయించింది. టైప్-8 బంగ్లాలను కేవలం కేంద్రమంత్రులు, మాజీ ఉపరాష్ట్రపతులకు కేటాయిస్తారు. అలాంటి టైప్-8 బంగ్లాను తాజాగా మాయావతికి కేటాయించడంపై పొలిటికల్గా రకరకాలుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. వదంతులు వ్యాప్తి చెందడంతో మాయావతి రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Iran-US: ట్రంప్నకు ఖమేనీ సవాల్.. అమెరికా యుద్ధ నౌకను సముద్రంలోనే ముంచేస్తామని వార్నింగ్
Also Read
- NPS Pension Scheme: వారికి కేంద్రం గుడ్న్యూస్.. రూ.99తోనే పెన్షన్ పథకం.. అర్హతలు, ప్రయోజనాలు ఇవే..
- Jharkhand JPSC Protest: రాంచీలో ఉద్రిక్తంగా మారిన విద్యార్థుల పోరు.. 600 మంది విద్యార్థులపై ఎఫ్ఐఆర్..
- Ola, Uber, Rapido: ఓలా, ఉబర్, ర్యాపిడో యూజర్లకు గుడ్ న్యూస్.. 'అడ్వాన్స్ టిప్' విధానానికి కేంద్రం చెక్
- Parliament Monsoon Session: 18 రోజులు.. చర్చ కంటే వాయిదాలే ఎక్కువ! ముగిసిన పార్లమెంట్ సమావేశాలు..
భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీలో టైప్-8 బంగ్లాను కేటాయించారని.. ఇందులో ఎలాంటి వ్యూహాలు లేవని మాయావతి స్పష్టం చేశారు. తప్పుడు పుకార్లను కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది జరిగే ఎన్నికల వ్యూహాన్ని తెలియజేశారు. ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. ఎన్డీఏ కూటమిలో చేరబోతున్నారంటూ వస్తున్న వార్తలను కార్యకర్తలెవరూ నమ్మొద్దని సూచించారు. అవి తప్పుదారి పట్టించేవి.. నిరాధారమైనవిగా కొట్టిపారేశారు. తప్పుడు వార్తలను పక్కకు పెట్టి ముందుకు సాగిపోవాలని విజ్ఞప్తి చేశారు. 2007లో మాదిరిగానే రాష్ట్రంలో పూర్తి మెజారిటీతో కూడిన బీఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యం అని చెప్పారు.
ఇది కూడా చదవండి: Silver Rates: వెండి పతనం.. ఈరోజు ఎంత తగ్గిందంటే..!
కేవలం కార్యకర్తల దృష్టి మరల్చడానికే ఇలాంటి పుకార్లు ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చేస్తున్నారన్నారు. బీఎస్పీ ఎప్పుడూ తన సొంత బలాన్నినమ్ముకుంటుందని.. ఎవరి మద్దతు లేకుండా ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టంగా పేర్కొన్నారు. కార్యకర్తలంతా ఏనుగులా నడవాలని విజ్ఞప్తి చేశారు. దయచేసి బంగ్లాకు సంబంధించి ఎలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని ప్రత్యర్థులకు మాయావతి సూచించారు.
తాజావార్తలు
-
Sukhbir Singh Badal: నాందేడ్లో సుఖ్బీర్ సింగ్ బాదల్పై దాడి
-
Bank of America: అంబానీ కంపెనీపై అమెరికా బ్యాంక్ కన్ను.. రూ.18,268 కోట్ల భారీ డీల్!
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Saransh Jain: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో మజా లేదు.. సారాంశ్ జైన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
NPS Pension Scheme: వారికి కేంద్రం గుడ్న్యూస్.. రూ.99తోనే పెన్షన్ పథకం.. అర్హతలు, ప్రయోజనాలు ఇవే..
ట్రెండింగ్
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!