కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి పాకిస్థాన్ నుంచి మామిడి పండ్లను పంపిందన్న వార్తలపై భారతీయ జనతా పార్టీ మండిపడుతోంది. ఇది పాకిస్థాన్తో 'నీచమైన' సంబంధమని బీజేపీ అభివర్ణించింది.
రేషన్ కార్డు ఉన్న వారికి కేంద్రం శుభవార్త అందించింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పొడిగిస్తూ కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం ప్రకటించారు. కరోనా సమయంలో పేద ప్రజలకు ఉచిత రేషన్ అందించేందుకు కేంద్రం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఈ పథకాన్ని తీసుకువచ్చింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 81 కోట్ల మంది పేద ప్రజలు లబ్ధీ పొందుతన్నారు.…
ముందస్తు సార్వత్రిక ఎన్నికలను పిలిచే ఆలోచన ప్రభుత్వానికి లేదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తేల్చి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ తన పదవీ కాలం చివరి రోజు వరకు భారత పౌరులకు సేవ చేయాలని కోరుకుంటున్నారని అన్నారు. సార్వత్రిక ఎన్నికలతో పాటు రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ఆలస్యం చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని చెప్పారు.
దేశవ్యాప్తంగా గిడ్డంగుల సామర్థ్యం పెంపునకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సహకార రంగంలో పెద్ద ఎత్తున గోదాములు ఏర్పాటు చేసేందుకు కేంద్రం రూ.లక్ష కోట్లతో గిడ్డంగుల కోసం కొత్త పథకాన్ని రూపొందించనుండగా.. 700 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను నిల్వ ఉంచే లక్ష్యంతో ఈ పథకం ఉండనుంది.
Centre revises One Rank One Pension scheme: పదవీ విరమణ చేసిన మాజీ సైనికులకు వారి కుటుంబ సభ్యులకు తీపి కబురు చెప్పింది కేంద్ర ప్రభుత్వం. వన్ ర్యాంక్ వన్ పెన్షన్(ఓఆర్ఓపీ) స్కీమ్ ను కేంద్ర మంత్రి వర్గం సవరించింది. దీంతో 25 లక్షల మంది మాజీ సైనికులకు లబ్ధి చేకూరనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల 25.13 లక్షల మంది మాజీలకు లబ్ధి చేకూరనుంది. సవరించిన విధానంతో సాయుధ…
104 YouTube Channels Blocked For Threatening National Security: జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లేటట్లు ప్రేరేపిస్తున్న యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్ర ఉక్కుపాదం మోపింది. ఇప్పటికే పలుమార్లు ఇలాంటి యూట్యూబ్ ఛానెళ్లపై బ్యాన్ విధించింది కేంద్రం. తాజాగా 104 యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేసింది. జాతీయ భద్రతకు ముప్పుగా ఉన్నందుకే వీటిని బ్యాన్ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడంతో పాటు దేశవ్యాప్తంగా అశాంతిని రేపేలా ఈ యూట్యూబ్ ఛానెళ్లు పనిచేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
Cabinet Announces Bonus For Railway Employees: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రైల్వే ఉద్యోగులకు 78 రోజులకు సమానమైన ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (పీఎల్బీ) చెల్లింపునకు కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 11.27 లక్షల మంది నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు పీఎల్బీ మొత్తాన్ని చెల్లించినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం తెలిపారు. ఆర్పిఎఫ్/ఆర్పిఎస్ఎఫ్ సిబ్బందిని మినహాయించి నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు బోనస్ చెల్లించబడతాయి.
Govt bans 45 YouTube videos: భారతదేశానికి వ్యతిరేకంగా విషం చిమ్ముతూ.. దేశంలో అశాంతి ఏర్పడటానికి ప్రయత్నిస్తున్న యూట్యూబ్ ఛానెళ్లపై ఉక్కపాదం మోపుతోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే పలు పాకిస్తాన్ బేస్డ్ యూట్యూబ్ ఛానెళ్లతో పాటు భారత వ్యతిరేక ప్రచారానికి పాల్పడుతున్న మరికొన్ని ఛానెళ్లను కేంద్రం నిషేధించింది. తాజాగా మరో 10 యూట్యూబ్ ఛానెళ్లపై బ్యాన్ విధించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సీబీఐ దాడులపై సోమవారం బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా.. అవినీతి ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు.