Anurag Thakur: అవినీతి మంత్రులకు నిజాయితీ సర్టిఫికెట్లు ఇవ్వడమే కేజ్రీవాల్ ‘ఢిల్లీ మోడల్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anurag Thakur: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సీబీఐ దాడులపై సోమవారం బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా.. అవినీతి ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు. ఢిల్లీ మోడల్ బట్టబయలైందని, రాబోయే రోజుల్లో ఆప్ అవినీతి అంతా తెరపైకి వస్తుందని ఠాకూర్ అన్నారు. కేజ్రీవాల్ పుస్తకమైన ‘స్వరాజ్’ ను ప్రస్తావిస్తూ.. ఢిల్లీలో ఆప్ సర్కారు మద్యం రాజ్యాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు.
‘స్వరాజ్’ అనే తన పుస్తకంలో కేజ్రీవాల్ పౌరులను అడగకుండా, మహిళలను అడగకుండా డబ్బు వసూలు చేయడానికి ప్రభుత్వం మద్యం కాంట్రాక్టులను కేటాయిస్తుందని రాశారన్నారు. మద్యం కాంట్రాక్టులు కేటాయించే ముందు కేజ్రీవాల్ ఎవరిని అడిగారని ఆయన ప్రశ్నించారు. తన పార్టీకి చెందిన కొంతమంది నేతలపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కేజ్రీవాల్ మౌనంగా ఉండటంపై ఆయన విరుచుకుపడ్డారు. సమాధానం ఇచ్చేందుకు కేజ్రీవాల్పై 24గంటల సమయం ఇచ్చినట్లు వెల్లడించారు. కానీ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. మొదటి వారి ఆరోగ్య శాఖ మంత్రి అరెస్టు చేయబడి 3 నెలలు జైలులో ఉన్నాడని.. ఇప్పుడు అవినీతి ఎక్సైజ్ శాఖ మంత్రి నిందితుల మొదటి జాబితాలో ఉన్నాడన్నారు. కానీ ఇప్పటీకి కేజ్రీవాల్ మౌనంగానే ఉన్నాడని విరుచుకుపడ్డారు.
Also Read
- Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: షాపింగ్ కోసం కేతన్ నుంచి రూ.కోటి కొట్టేసిన సియా.. అవి ఎవరికిచ్చిందంటే..!
- Viral Video: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న తాతా.. 18 వేల అడుగుల ఎత్తు నుంచి దూకేసిన 80 ఏళ్ల వృద్ధుడు!
- Modi-Khamenei: ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకానున్న భారత్.. ఎవరెళ్తున్నారంటే..!
‘కేజ్రీవాల్ మోడల్’ అనేది ప్రకటనల కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయడం, వారి సొంత మంత్రులకు నిజాయితీ సర్టిఫికేట్లు ఇవ్వడం అని ఆయన విమర్శించారు. అరవింద్ కేజ్రీవాల్ మోడల్ డీకోడ్ చేయబడిందంటూ మండిపడ్డారు. ఎలాంటి జవాబుదారీతనం లేకుండా పబ్లిసిటీ చేయడానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారని ఆరోపించారు. పట్టుబడినప్పుడు మరొకరిపై నెట్టేస్తారన్నారు. అవినీతిపరులకు నిజాయితీ సర్టిఫికేట్లు ఇవ్వడం కేజ్రీవాల్ మోడల్ అంటూ ఆరోపించారు. ఒకే వ్యక్తి విద్యాశాఖతో పాటు మద్యం శాఖలకు కూడా నాయకత్వం వహిస్తున్నాడని, అదే అరవింద్ కేజ్రీవాల్ మోడల్ అని ఠాకూర్ అన్నారు.
AP Cm Jaganmohan Reddy: ప్రధాని మోడీతో సీఎం వైఎస్.జగన్ భేటీ
ఢిల్లీ గవర్నమెంట్ లిక్కర్ పాలసీ అమలులో ఆరోపించిన కుంభకోణానికి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) శుక్రవారం మనీష్ సిసోడియా నివాసంపై దాడి చేసింది. అది ఇప్పుడు ఉపసంహరించబడింది. సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో 15 మందిలో సిసోడియా ఉన్నారు. ఈ కేసులో ఎక్సైజ్ అధికారులు, మద్యం కంపెనీల అధికారులు, డీలర్లు, కొందరు గుర్తుతెలియని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులపై కేసు నమోదు చేశారు. సిసోడియా, ఆప్ నిర్దోషులని పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నందునే సిసోడియాను టార్గెట్ చేశారని వారు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Minister Seethakka : కేంద్రానికి తెలంగాణ కౌంటర్.. సీతక్క వినతిలో కీలక డిమాండ్లు.!
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Market Crash: స్విగ్గీ, జొమాటోలకు రూ.1.41 లక్షల కోట్ల భారీ లాస్.. ఏం జరిగిందంటే?
-
Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
-
Tollywood: 2026 సెకండాఫ్ సినిమాలపైనే ఆశలు!
ట్రెండింగ్
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!