Union Cabinet: రేషన్ కార్డు ఉన్నవారికి కేంద్రం శుభవార్త.. PMGKAY పొడగింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేషన్ కార్డు ఉన్న వారికి కేంద్రం శుభవార్త అందించింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పొడిగిస్తూ కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం ప్రకటించారు. కరోనా సమయంలో పేద ప్రజలకు ఉచిత రేషన్ అందించేందుకు కేంద్రం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఈ పథకాన్ని తీసుకువచ్చింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 81 కోట్ల మంది పేద ప్రజలు లబ్ధీ పొందుతన్నారు. అయితే ఇప్పుడు ఈ పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ నవంబర్ 29న వెల్లడించారు.
Also Read: Telangana Elections 2023: తెలంగాణలో రేపే పోలింగ్.. పూర్తైన ఎన్నికల సామాగ్రి పంపిణీ..
Also Read
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
ఈ పొడగింపు జనవరి 1, 2024 నుంచి డిసెంబర్, 2028 వరకు వర్తిస్తుందని, దీని ద్వారా పేద ప్రజలకు కేంద్ర సర్కార్ ఉచితంగా బియ్యం పంపిణీ చేయనుందని చెప్పారు. ఈ నిర్ణయంతో కేంద్రంపై అదనంగా మరో రూ.11.8 లక్షల కోట్ల భారం పడుతుందని ఆయన తెలిపారు. కాగా ఈ పథకాన్ని ఏప్రిల్ 2020లో కరోనా లాక్ డౌన్ విధించిన క్రమంలో కేంద్రం పీఎంజీకేఏవై పేరుతో ప్రకటించింది. దీనికి ద్వారా రేషన్ కార్డు ఉన్నవారు నెలల రూ. 5 కిలోల ఉచిత రేషన్ అందించింది. అయితే మొదట మూడు నెలలకు మాత్రమే ఉచితంగా రేషన్ ఇచ్చేందుకు ఈ స్కీమ్ తెచ్చారు. ఆ తర్వాత పలు మార్లు ఈ స్కీమ్ పొడిగించింది కేంద్రం. ఇప్పుడు మరో 5 ఏళ్లు పొడగించి ఉచితంగ రేషన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ పథకం డిసెంబర్ 2023 లో అంటే వచ్చే నెలలో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర కెబినెట ఈ పథకాన్ని పొడగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పొడగింపుతో లబ్ధిదారులు 2028 వరకు ఉచిత రేషన్ పొందవచ్చు.
Also Read: Telangana Assembly Elections 2023: రేపు సెలవు ఇవ్వని కంపెనీలపై చట్ట ప్రకారం చర్యలు: ఎన్నికల సంఘం
తాజావార్తలు
-
Amazon Zoox: స్టీరింగ్ లేదు.. డ్రైవర్ లేడు.. అమెజాన్ కొత్త రోబోట్యాక్సీ.. పెయిడ్ రైడ్స్కు రంగం సిద్ధం
-
Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
-
Divija Prabhakar: ఎంతో కస్టపడి సినిమా చేశాం.. ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ అందరికీ నచ్చుతుంది!
-
TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలు!
ట్రెండింగ్
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!