Rahul Gandhi: రాహుల్ గాంధీ సహా 7 మంది ప్రతిపక్ష ఎంపీలకు పాకిస్థాన్ నుంచి మామిడి పండ్లు?..బీజేపీ ఫైర్
- కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి పాకిస్థాన్ నుంచి మామిడి పండ్లు
- రాహుల్ గాంధీ సహా 7 మంది ప్రతిపక్ష ఎంపీలకు పళ్ల పంపిణీ
- భారతీయ జనతా పార్టీ నేతలు ఫైర్
- ఈ అంశంపై ఇంకా స్పందించని కాంగ్రెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి పాకిస్థాన్ నుంచి మామిడి పండ్లను పంపిందన్న వార్తలపై భారతీయ జనతా పార్టీ మండిపడుతోంది. ఇది పాకిస్థాన్తో ‘నీచమైన’ సంబంధమని బీజేపీ అభివర్ణించింది. ఢిల్లీలోని పాక్ హైకమిషన్ నుంచి రాహుల్ సహా 7 మంది ఎంపీలకు మామిడి పళ్ల డబ్బాలు పంపిణీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై కాంగ్రెస్ నుంచి ఎలాంటి వ్యాఖ్య లేదు. మీడియా కథనాల ప్రకారం.. రాహుల్తో పాటు, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్, కేరళలోని తిరువనంతపురం నుంచి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, సమాజ్వాదీ పార్టీ ఎంపీలు ఎం నద్వీ, జియావుర్ రెహ్మాన్ బెర్గ్, ఇక్రా హసన్, ఘాజీపూర్ ఎంపీ అఫ్జల్ అన్సారీలకు మామిడి పండ్లను పంపారు. భారత్-పాక్ రెండూ శత్రు దేశాలన్న విషయం తెలిసిందే. పుల్వామా దాడి తర్వాత సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
READ MORE: CM Revanth Reddy: డల్లాస్ లో సీఎం రేవంత్ రెడ్డి.. హైదరాబాద్ లో ఛార్లెస్ స్క్వాబ్ కంపెనీపై చర్చ..
Also Read
- Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
- రికార్డుల మోత..! The Hundredలో పరుగుల సునామీ.. ఒక్క మ్యాచ్లో 31 సిక్సర్లు, 445 పరుగులు..
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి గిరిరాజ్సింగ్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. యూపీ మామిడిపండ్లు అంటే ఇష్టం లేదని రాహుల్ గాంధీ కొంతకాలం క్రితం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. “పాకిస్థాన్ వారికి మామిడి పండ్లను పంపింది. యూపీ కంటే పాకిస్థాన్ నుంచి వచ్చిన మామిడిపండు ఇష్టమా? రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. మోడీని తొలగించడాని యత్నిస్తున్నారా? దానిలో భాగంగా కొత్తగా పాక్ తో చర్చలు జరపడానికి అక్కడికి వెళ్లారా?” అని ప్రశ్నించారు.
READ MORE:Vijay-TVK Party: తిరుచ్చిలో భారీ బహిరంగ సభ.. పార్టీ అజెండాను ప్రకటించనున్న విజయ్!
దీనిపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా స్పందించారు. “ఏ ప్రదేశాన్ని ప్రేమిస్తున్నారో అక్కడ నుంచి మామిడిపళ్లు వస్తాయి. ఉత్తరప్రదేశ్లోని మామిడిపండ్లలో కొందరు తప్పులు కనుగొన్నారు. అవి రుచిగా లేవు. ఉత్తరప్రదేశ్లోని మామిడిపండ్లలోని తీపిని ఇష్టపడని రాహుల్ గాంధీ పాకిస్థాన్లోని మామిడిపండ్లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు.” అని వ్యాఖ్యానించారు. మామిడి పండ్లను పంపడంపై బీజేపీ నేత అమిత్ మాల్వియా కూడా ప్రశ్నలు సంధించారు.
తాజావార్తలు
-
Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
-
Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
-
రికార్డుల మోత..! The Hundredలో పరుగుల సునామీ.. ఒక్క మ్యాచ్లో 31 సిక్సర్లు, 445 పరుగులు..
-
Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!