YouTube Channels Ban: 104 యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం ఉక్కుపాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
104 YouTube Channels Blocked For Threatening National Security: జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లేటట్లు ప్రేరేపిస్తున్న యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్ర ఉక్కుపాదం మోపింది. ఇప్పటికే పలుమార్లు ఇలాంటి యూట్యూబ్ ఛానెళ్లపై బ్యాన్ విధించింది కేంద్రం. తాజాగా 104 యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేసింది. జాతీయ భద్రతకు ముప్పుగా ఉన్నందుకే వీటిని బ్యాన్ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడంతో పాటు దేశవ్యాప్తంగా అశాంతిని రేపేలా ఈ యూట్యూబ్ ఛానెళ్లు పనిచేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
104 యూట్యూబ్ ఛానెళ్లతో పాటు 45 వీడియోలను, 4 ఫేస్బుక్ ఖాతాలు, మూడు ఇన్స్టాగ్రామ్ ఖాతాలు, ఐదు ట్విట్టర్ హ్యాండిల్స్, ఆరు వెబ్సైట్లను బ్లాక్ చేసినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ గురువారం తెలిపారు. రాజ్యసభలో ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69ఏ ప్రకారం భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భారతదేశ రక్షణ, రాష్ట్ర భద్రత, విదేశీలతో స్నేహపూర్వక సంబంధాల ప్రయోజనాల ప్రభావాన్ని చూపించే డిజిటల్ మీడియా కంటెంట్ నిరోధించడానికి వీటిని బ్లాక్ చేస్తున్నట్లు అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
Also Read
- AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
- NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
Read Also: Errabelli Dayakar Rao: జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షుడు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
ఐటీ రూల్స్ లోని పార్ట్-2 నిబంధన ప్రకారం, 2021 నుంచి అక్టోబర్ 2022 వరకు ఐటి రూల్స్లోని పార్ట్-2 నిబంధనల ప్రకారం సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో వెబ్పేజీలు, వెబ్సైట్లు, పోస్ట్లు, ఖాతాలతో సహా 1,643 యూజర్ జనరేటెడ్ యూాఆరఎల్ లను బ్లాక్ చేసినట్లు ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దేశ భద్రత విషయంలో అవసరమైతే భవిష్యత్తులో చర్యలు తీసుకోవడానికి వెనకాడం అని అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు.
చాలా వరకు పాకిస్తాన్, టర్కీ దేశాల నుంచి భారత వ్యతిరేక యూట్యూబ్ ఛానెళ్లు పనిచేస్తుంటాయి. ప్రధాని మోదీ, జమ్మూ కాశ్మీర్, ముస్లింల విషయంలో తప్పుడు కంటెంట్ ను యూట్యూబ్ ఛానెళ్లతో పోస్ట్ చేస్తూ.. జాతీయ భద్రతకు, శాంతికి భంగం కలిగించేలా ప్రయత్నిస్తున్నందుకే ఈ యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేసింది కేంద్రం.
తాజావార్తలు
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..