YouTube Channels Ban: 104 యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం ఉక్కుపాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
104 YouTube Channels Blocked For Threatening National Security: జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లేటట్లు ప్రేరేపిస్తున్న యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్ర ఉక్కుపాదం మోపింది. ఇప్పటికే పలుమార్లు ఇలాంటి యూట్యూబ్ ఛానెళ్లపై బ్యాన్ విధించింది కేంద్రం. తాజాగా 104 యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేసింది. జాతీయ భద్రతకు ముప్పుగా ఉన్నందుకే వీటిని బ్యాన్ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడంతో పాటు దేశవ్యాప్తంగా అశాంతిని రేపేలా ఈ యూట్యూబ్ ఛానెళ్లు పనిచేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
104 యూట్యూబ్ ఛానెళ్లతో పాటు 45 వీడియోలను, 4 ఫేస్బుక్ ఖాతాలు, మూడు ఇన్స్టాగ్రామ్ ఖాతాలు, ఐదు ట్విట్టర్ హ్యాండిల్స్, ఆరు వెబ్సైట్లను బ్లాక్ చేసినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ గురువారం తెలిపారు. రాజ్యసభలో ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69ఏ ప్రకారం భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భారతదేశ రక్షణ, రాష్ట్ర భద్రత, విదేశీలతో స్నేహపూర్వక సంబంధాల ప్రయోజనాల ప్రభావాన్ని చూపించే డిజిటల్ మీడియా కంటెంట్ నిరోధించడానికి వీటిని బ్లాక్ చేస్తున్నట్లు అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
Also Read
- Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు..అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
- Shocking Statistics: 6 నెలల్లో 554 మంది భర్తల మృతి.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంచలన నివేదిక!
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- Sakshi Jha: సాక్షి ఝా 'మ్యాన్ హేటర్' వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
Read Also: Errabelli Dayakar Rao: జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షుడు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
ఐటీ రూల్స్ లోని పార్ట్-2 నిబంధన ప్రకారం, 2021 నుంచి అక్టోబర్ 2022 వరకు ఐటి రూల్స్లోని పార్ట్-2 నిబంధనల ప్రకారం సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో వెబ్పేజీలు, వెబ్సైట్లు, పోస్ట్లు, ఖాతాలతో సహా 1,643 యూజర్ జనరేటెడ్ యూాఆరఎల్ లను బ్లాక్ చేసినట్లు ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దేశ భద్రత విషయంలో అవసరమైతే భవిష్యత్తులో చర్యలు తీసుకోవడానికి వెనకాడం అని అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు.
చాలా వరకు పాకిస్తాన్, టర్కీ దేశాల నుంచి భారత వ్యతిరేక యూట్యూబ్ ఛానెళ్లు పనిచేస్తుంటాయి. ప్రధాని మోదీ, జమ్మూ కాశ్మీర్, ముస్లింల విషయంలో తప్పుడు కంటెంట్ ను యూట్యూబ్ ఛానెళ్లతో పోస్ట్ చేస్తూ.. జాతీయ భద్రతకు, శాంతికి భంగం కలిగించేలా ప్రయత్నిస్తున్నందుకే ఈ యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేసింది కేంద్రం.
తాజావార్తలు
-
CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
-
Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు..అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
-
Shocking Statistics: 6 నెలల్లో 554 మంది భర్తల మృతి.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంచలన నివేదిక!
-
Pawan Kumar Chandana: మ్యాథ్స్లో 51 మార్కులు.. నేడు భారత తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతం.. హైదరాబాద్ కుర్రాడి విజయగాథ!
-
Jani Master: నిర్మాతల డబ్బులు దోచేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!