Mamata Banerjee: అంతా చెత్త.. దిశానిర్దేశం లేదు.. నిరలమ్మ బడ్జెట్పై మమత విమర్శలు
- నిరలమ్మ బడ్జెట్పై మమత విమర్శలు
- బెంగాల్కు ఒక్క పైసా లేదు.. చెత్త బడ్జెట్
- బడ్జెట్కు దిశానిర్దేశం లేదన్న మమత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర బడ్జెట్పై విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ మొత్తంగా రూ. 53.5 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ను ఆదివారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్ను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా విమర్శించారు. ఈ బడ్జెట్కు దిశానిర్దేశం లేదని… ఇందులో అసలు ఏమీ లేదని ధ్వజమెత్తారు. చెత్త బడ్జెట్గా అభివర్ణించారు. బెంగాల్కు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: Union Budget 2026: కేంద్ర బడ్జెట్ 2026.. ధరలు తగ్గేవి, పెరిగేవి ఏంటి..?
Also Read
- Boyfriend for Rent: ఇండియాలో అద్దెకు బాయ్ఫ్రెండ్.. గంటకు ఎంత ఛార్జ్ చేస్తున్నారు?
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
- ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
- RBI Report: తీవ్ర ద్రవ్యోల్బణంలో తెలంగాణ.. ఆర్బీఐ నివేదిక
పురులియాలోని జంగల్మహల్ జంగల్ సుందరి ప్రాజెక్టును ఉద్దేశిస్తూ కేంద్రం నుంచి ఎటువంటి మద్దతు లేకుండానే ఆర్థిక కారిడార్ కోసం ఇప్పటికే రూ.72,000 కోట్ల పెట్టుబడులు పెట్టినట్టు చెప్పారు. దేశాన్ని ప్రభుత్వం తప్పుదారి పట్టించిందని… బెంగాల్కు రావాల్సిన నిధులను లాక్కుందని ఆరోపించారు. కొత్త ఆర్థిక కారిడార్లపై చేసిన వాదనలను తోసిపుచ్చారు. ప్రజలకు నిజమైన ప్రయోజనాలను అందించడానికి బదులుగా ‘కఠినమైన అబద్ధాలు’ చెప్పిందని.. ‘‘మాటల గారడీ’’ ఉపయోగించిందని మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: Union Budget 2026: క్యాన్సర్ రోగులకు ఉపశమనం.. 17 రకాల మందులపై కస్టమ్స్ తగ్గింపు..
బడ్జెట్లో ప్రస్తావించిన ప్రాజెక్ట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నాయని వివరించారు. మూడు కారిడార్ల గురించి చెప్పింది పూర్తిగా అబద్దాల చెత్తగా అభివర్ణించారు. రాష్ట్రం నుంచి పెద్ద మొత్తంలో పన్ను వసూలు చేసినప్పటికీ.. బెంగాల్ బకాయిలను విడుదల చేయడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. ‘‘వారు బెంగాల్కు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఒకే ఒక పన్ను GST ఉంది. వారు మా డబ్బును లాక్కొని.. మాకు డబ్బు ఇస్తున్నామని పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు. ఇది మా డబ్బు” అని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్కు కేంద్రం రూ. 2 లక్షల కోట్లకు పైగా బాకీ ఉందని.. కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైన నిధులను నిలిపివేసిందని ఆరోపించారు. ‘‘వారు బెంగాల్ నుంచి ఏమి సేకరిస్తున్నారో.. వారు మాకు పూర్తి నిధులు ఇవ్వడం లేదు.’’ అని అన్నారు.
తాజావార్తలు
-
Dating Rumours: మృణాల్, రిషబ్ పంత్పై డేటింగ్ రూమర్స్!.. ఒక్క ఇన్స్టాగ్రామ్ ఫాలోతో వైరల్
-
Boyfriend for Rent: ఇండియాలో అద్దెకు బాయ్ఫ్రెండ్.. గంటకు ఎంత ఛార్జ్ చేస్తున్నారు?
-
Mudragada Daughter: కూతురు క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు.. గోబ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు!
-
Shubman Gill Retires Hurt: ఆట మధ్యలోనే మైదానం వీడిన కెప్టెన్.. అసలేమైంది.?
-
Toxic Work Culture: వాష్రూమ్కి వెళ్లిన టైమ్ కూడా కౌంట్ చేశాడు..మేనేజర్ మైండ్సెట్పై ఉద్యోగి ఆవేదన
ట్రెండింగ్
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!