Mamata Banerjee: అంతా చెత్త.. దిశానిర్దేశం లేదు.. నిరలమ్మ బడ్జెట్పై మమత విమర్శలు
- నిరలమ్మ బడ్జెట్పై మమత విమర్శలు
- బెంగాల్కు ఒక్క పైసా లేదు.. చెత్త బడ్జెట్
- బడ్జెట్కు దిశానిర్దేశం లేదన్న మమత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర బడ్జెట్పై విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ మొత్తంగా రూ. 53.5 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ను ఆదివారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్ను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా విమర్శించారు. ఈ బడ్జెట్కు దిశానిర్దేశం లేదని… ఇందులో అసలు ఏమీ లేదని ధ్వజమెత్తారు. చెత్త బడ్జెట్గా అభివర్ణించారు. బెంగాల్కు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: Union Budget 2026: కేంద్ర బడ్జెట్ 2026.. ధరలు తగ్గేవి, పెరిగేవి ఏంటి..?
Also Read
- Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
- Smartphone Price Hike: స్మార్ట్ఫోన్ ప్రియులకు ‘షాక్’.. విపరీతంగా పెరుగుతున్న మొబైల్ ధరలు.. కారణం ఇదే!
- Campa Cola vs Coca-Cola: 'కోలా వార్'లో కొత్త మలుపు.. అంబానీ 'క్యాంపా' దెబ్బకు కోక్, పెప్సీ షాక్! ఫ్రీగా రిఫ్రిజిరేటర్లు..
- Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్.. రూ.12 లక్షల కోట్ల సంపద ఆవిరి
పురులియాలోని జంగల్మహల్ జంగల్ సుందరి ప్రాజెక్టును ఉద్దేశిస్తూ కేంద్రం నుంచి ఎటువంటి మద్దతు లేకుండానే ఆర్థిక కారిడార్ కోసం ఇప్పటికే రూ.72,000 కోట్ల పెట్టుబడులు పెట్టినట్టు చెప్పారు. దేశాన్ని ప్రభుత్వం తప్పుదారి పట్టించిందని… బెంగాల్కు రావాల్సిన నిధులను లాక్కుందని ఆరోపించారు. కొత్త ఆర్థిక కారిడార్లపై చేసిన వాదనలను తోసిపుచ్చారు. ప్రజలకు నిజమైన ప్రయోజనాలను అందించడానికి బదులుగా ‘కఠినమైన అబద్ధాలు’ చెప్పిందని.. ‘‘మాటల గారడీ’’ ఉపయోగించిందని మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: Union Budget 2026: క్యాన్సర్ రోగులకు ఉపశమనం.. 17 రకాల మందులపై కస్టమ్స్ తగ్గింపు..
బడ్జెట్లో ప్రస్తావించిన ప్రాజెక్ట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నాయని వివరించారు. మూడు కారిడార్ల గురించి చెప్పింది పూర్తిగా అబద్దాల చెత్తగా అభివర్ణించారు. రాష్ట్రం నుంచి పెద్ద మొత్తంలో పన్ను వసూలు చేసినప్పటికీ.. బెంగాల్ బకాయిలను విడుదల చేయడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. ‘‘వారు బెంగాల్కు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఒకే ఒక పన్ను GST ఉంది. వారు మా డబ్బును లాక్కొని.. మాకు డబ్బు ఇస్తున్నామని పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు. ఇది మా డబ్బు” అని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్కు కేంద్రం రూ. 2 లక్షల కోట్లకు పైగా బాకీ ఉందని.. కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైన నిధులను నిలిపివేసిందని ఆరోపించారు. ‘‘వారు బెంగాల్ నుంచి ఏమి సేకరిస్తున్నారో.. వారు మాకు పూర్తి నిధులు ఇవ్వడం లేదు.’’ అని అన్నారు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!