Shashi Tharoor: కేంద్ర బడ్జెట్ పై శశి థరూర్ రియాక్షన్.. కేరళకు తీవ్ర అన్యాయం చేశారంటూ ఆగ్రహం..
- కేంద్ర బడ్జెట్ 2026 మండిపడుతున్న విపక్షాలు..
- బడ్జెట్లో కేరళకు తీవ్ర అన్యాయం జరిగింది..
- మౌలిక వసతుల ప్రస్తావనల్లో కేరళకు చోటు దక్కలేదు: శశిథరూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shashi Tharoor: కేంద్ర బడ్జెట్ 2026ను పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన అనంతరం ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బడ్జెట్ అనంతరం మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీ థరూర్.. నౌకాశ్రయాల సిద్ధీకరణ (షిప్ ప్రిపరేషన్), కనెక్టివిటీ అంశాల చర్చలో పాట్నా, వారణాసి వంటి నగరాల పేర్లు ప్రస్తావించారు.. కానీ, భారత్లో “అతి పెద్ది అయినా కేరళ గురించి ఎలాంటి ప్రస్తావన చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్లో ప్రాంతీయ అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా మౌలిక వసతుల ప్రస్తావనల్లో కేరళకు చోటు దక్కకపోవడం “ఆశ్చర్యకరం” కలిగించిందని శనిథరూర్ అన్నారు.
Read Also: Niharika : బయటికి కనిపించడం లేదు కానీ.. గుండెల్లో చాలా బరువుని మోస్తున్నా..
Also Read
- Trump: టర్కీకి బయల్దేరే ముందు ఓవల్ ఆఫీస్లో ఏం జరిగింది.. ఇరాన్పై ట్రంప్ యుద్ధానికెళ్లడానికి కారణమిదేనా?
- US-Iran War: ఇరాన్లో భారత్-చైనాలను దెబ్బతీసిన అమెరికా..
- Hardeep Singh Puri: త్వరలో చౌకగా E85! ఇథనాల్తో ఇంజిన్ దెబ్బతింటుందన్న పుకార్లు నమ్మొద్దు
- El Nino: ఎల్నినోతో వర్షాలుండవన్నారు.. ఇప్పుడెందుకు భారత్ను ముంచెత్తున్నాయి.. కారణమేంటి?
ప్రతిపక్షాల రియాక్షన్:
* సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ బడ్జెట్పై ఘాటైన విమర్శలు చేశారు. ఈ బడ్జెట్ పేదల వాస్తవ పరిస్థితులకు పూర్తిగా దూరంగా ఉందని వ్యాఖ్యానించారు. “విద్య లేకుండా వికసిత్ భారత్ ఎలా సాధ్యమవుతుంది? అని ప్రశ్నించారు.
* తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగత రాయ్ బడ్జెట్ను పూర్తిగా తిరస్కరించారు. ఈ బడ్జెట్లో కొత్తదనం ఏమీ లేదు.. గత పథకాలనే పునరావృతం చేశారని ఆరోపించారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్కు ఎలాంటి ప్రత్యేక ప్రయోజనాలు దక్కలేదని విమర్శించారు.
Read Also: Rupee Breakup: ప్రభుత్వానికి రూపాయి ఎలా వస్తోంది? ఎటు పోతోంది? పూర్తి వివరాలు ఇవే!
పన్ను సడలింపులపై ప్రభుత్వ హైలైట్స్:
పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీవన సౌలభ్యం పెంచడం, పన్ను చెల్లింపుల ప్రక్రియను సరళీకరించడం లక్ష్యంగా పలు పన్ను సంస్కరణలను ప్రకటించారు. ఆదాయపన్ను వ్యవస్థను మరింత సులభంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ద్వారా సహజ వ్యక్తికి లభించే వడ్డీ ఆదాయాన్ని ఇకపై ఆదాయపన్ను నుంచి మినహాయించనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం రోడ్డు ప్రమాద బాధితులు, వారి కుటుంబాలకు మేలు చేస్తుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అలాగే, విదేశీ టూర్ ప్యాకేజీలపై టీసీఎస్ (Tax Collection at Source) ను ప్రస్తుతం ఉన్న 5 నుంచి 2 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించారు. దీనికి ఎలాంటి మొత్త పరిమితి లేకుండా ఈ సడలింపు వర్తిస్తుందని ఆర్థిక మంత్రి సీతారామన్ వివరించారు. మొత్తంగా కేంద్ర బడ్జెట్ 2026 రాజకీయంగా తీవ్ర చర్చలకు దారి తీసింది. ప్రతిపక్షాలు ప్రాంతీయ సమానత్వం, విద్య, సంక్షేమంపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతుండగా.. ప్రభుత్వం మాత్రం పన్ను సడలింపులు, సులభతర వ్యవస్థలపై దృష్టి పెట్టినట్లు స్పష్టం చేస్తుంది.
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!